హత్య చేసి.. కరెంట్‌ షాక్‌గా చిత్రీకరణ

 తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడో యజమాని. అనంతరం దాన్ని కరెంట్‌ షాక్‌గా చిత్రీకరిండాడు

Updated : 09 Jul 2023 13:46 IST

బెంగళూరు:  తన దగ్గర పనిచేస్తున్న వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా హతమార్చాడో యజమాని. అనంతరం దాన్ని కరెంట్‌ షాక్‌గా చిత్రీకరిండాడు.  ఈ ఘటన కర్ణాటకలోని మంగళూరులో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...స్థానికంగా నివాసం ఉండే గజానన్‌ ఓ కిరణా షాపులో పని చేస్తున్నాడు.  శనివారం ఉదయం యజమానికి, అతడికి చిన్న వివాదం జరిగింది.  దీంతో కోపోద్రిక్తుడైన ఆ యజమాని అతడికి నిప్పు అంటించి హతమార్చాడు.

అనంతరం గజానన్‌కు కరెంట్‌ షాక్‌ కొట్టిందని ఊరిలో తప్పుడు ప్రచారం చేశాడు. అంతేకాకుండా అతడిని ఆసుపత్రికి కూడా తరలించాడు. కానీ అప్పటికే అతడు మరణించాడని వైద్యులు నిర్ధారించారు.  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో యజమానిపై అనుమానం రాగా విచారించారు. దీంతో అతడు నేరాన్ని అంగీకరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని