Kadapa: కడప ఎల్‌ఐసీ కార్యాలయంలో వాలంటీర్‌ దారుణహత్య

కడపలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో హత్య జరిగింది. భవానీశంకర్‌ (37) అనే వ్యక్తిని తోటి స్నేహితుడే హతమార్చాడు.

Updated : 12 Nov 2023 13:17 IST

కడప నేరవార్తలు: కడపలోని ఎల్ఐసీ ప్రధాన కార్యాలయంలో హత్య జరిగింది. భవానీశంకర్‌ (37) అనే వ్యక్తిని తోటి స్నేహితుడే హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. కడప ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని 14వ డివిజన్‌ వాలంటీర్‌గా భవానీశంకర్‌ పనిచేస్తున్నాడు. దీంతో పాటు కడపలోని ఎల్‌ఐసీ కార్యాలయంలో డిజిటలైజేషన్‌ విభాగంలోనూ విధులు నిర్వర్తిస్తున్నాడు. భవానీ శంకర్‌కు అక్కడే పనిచేస్తున్న మల్లికార్జున్‌ మంచి స్నేహితుడు. ఇటీవల వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరికీ గొడవలయ్యాయి. 

ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటలకు భవానీ శంకర్‌కు మల్లికార్జున్‌ ఫోన్‌ చేసి ఎల్‌ఐసీ కార్యాలయానికి రమ్మని పిలిచాడు. అక్కడికి భవానీ శంకర్‌ చేరుకోగానే.. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో మెడపై దాడి చేయడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న కడప డీఎస్పీ షరీఫ్‌ ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని