ఏసీబీ అదుపులో మెదక్ అదనపు కలెక్టర్
మెదక్ అదనపు పాలనాధికారి నగేష్ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ మండలం మాచవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ..
మెదక్ కలెక్టరేట్ : అవినీతి నిరోధకశాఖ అధికారులకు మరో భారీ తిమింగలం దొరికింది. మెదక్ అదనపు పాలనాధికారి నగేష్ను అనిశా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మెదక్ మండలం మాచవరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో అనిశా డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో ఉదయం నుంచే సోదాలు నిర్వహించారు.
హైదరాబాద్లోని గచ్చిబౌలికి చెందిన మూర్తి అనే రైతుకు మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పలతుర్తిలో 112 ఎకరాల పట్టా భూమి ఉంది. దీనికి సంబంధించి ఎన్వోసి ఇవ్వాలని మూర్తి ఇటీవల అదనపు పాలనాధికారి నగేష్ను సంప్రదించారు. అయితే, పాలనాధికారి ఎన్వోసీ ఇచ్చేందుకు తనకు ఎకరాకు రూ.లక్ష చొప్పున రూ.1.12 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇప్పటికే రూ.40లక్షల నగదు తీసుకున్న అదనపు కలెక్టర్ మరో రూ.72లక్షల కోసం ఐదు ఎకరాల భూమిని తన బినామీ అయిన జీవన్గౌడ్ పేరుమీద అగ్రిమెంట్ చేయించుకున్నారు. ఈనేపథ్యంలో రైతు అధికారులకు ఫిర్యాదు చేశాడు. అధికారులు మాట్లాడిన ఆడియో క్లిప్లతో సహా ఇతర ఆధారాలను అవినీతి నిరోధకశాఖ అధికారులకు సమర్పించాడు. దీంతో వారం రోజులుగా దీనిపై పూర్తి వివరాలు సేకరించిన అధికారులు అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో అరుణరెడ్డితో పాటు ఇతర రెవెన్యూ అధికారులకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మాచవరంలోని నగేష్ అధికారిక నివాసంతో పాటు కొంపల్లిలోని ఆయన స్వగృహంలో, బోయిన్పల్లిలోని జీవన్గౌడ్ ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. నగేష్ ఇంట్లో తనిఖీల్లో రూ.లక్ష నగదు, భూమికి సంబంధించిన కొన్ని దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మరికొందరు రెవెన్యూ అధికారుల పాత్ర ఉందన్న ఆరోపణలతో ఏకకాలంలో 12 చోట్ల ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కీసర తహసీల్దార్ నాగరాజు రూ.1.10కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కేసు మర్చిపోకముందే అంత పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు రావడం రెవెన్యూ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?