Hyderabad: మద్యం మత్తులో కారు నడిపి.. వ్యక్తిపైకి దూసుకెళ్లి..

మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు.

Updated : 18 Dec 2023 12:03 IST

హైదరాబాద్‌: చైతన్యపురి రాజీవ్‌గాంధీనగర్‌ వద్ద కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో ఓ వ్యక్తి కారు నడుపుతూ.. రోడ్డు పక్కన నిల్చొని ఉన్న వ్యక్తిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం కారు అదుపుతప్పి కమాన్‌ దిమ్మెను ఢీకొట్టడంతో కారులో ఉన్న ఏడుగురు యువకులకు తీవ్రగాయాలై అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఎల్బీనగర్‌ - ఉప్పల్‌ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని