Crime News: పెళ్లి వేడుకలో విషాదం.. 13 మంది మహిళల దుర్మరణం

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు.

Published : 17 Feb 2022 07:30 IST

లఖ్‌నవూ: పెళ్లి వేడుకలో విషాదం చోటుచేసుకుంది. ఓ వివాహ వేడుకకు వెళ్లిన 13 మంది మహిళలు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందారు. మరో కొందరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని కుషీనగర్‌ జిల్లా నెబువా నౌరంజియా వద్ద చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లిన బంధువులు సమీపంలోని ఓ బావి స్లాబ్‌పై కూర్చున్న సమయంలో అది ఒక్కసారిగా కూలిందని.. దీంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారన్నారు. బావిలో పడిన మరికొందరిని స్థానికులు రక్షించినట్లు చెప్పారు. ఈ ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల పరిహారం ప్రకటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని