Crime News: విచారణ పేరిట చిత్రహింసలు.. ఆత్మకూరు(ఎస్) ఎస్ఐ లింగంపై బదిలీ వేటు
సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) ఎస్ఐ లింగంపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ లింగంను వీఆర్కు పంపిస్తూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పేరిట గిరిజనుడిని చిత్రహింసలు పెట్టినట్లు ఎస్ఐపై ఆరోపణలు వచ్చిన విషయం...
ఆత్మకూర్(ఎస్): సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) ఎస్ఐ లింగంపై బదిలీ వేటు పడింది. ఎస్ఐ లింగంను వీఆర్కు పంపిస్తూ జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. విచారణ పేరిట గిరిజనుడిని చిత్రహింసలు పెట్టినట్లు ఎస్ఐపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. రామోజీతండాకు చెందిన వ్యక్తిని.. దొంగతనం కేసులో విచారణ పేరిట చిత్రహింసలు పెట్టారని బంధువులు నిన్న ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ ఎదుట బాధితుడితో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో ఎస్పీ రాజేంద్రప్రసాద్ విచారణకు ఆదేశించారు. ఎస్ఐని వీఆర్కు పంపిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
(చికిత్స పొందుతున్న వీరశేఖర్)
అసలేం జరిగిందంటే..
దొంగతనం కేసులో విచారణ పేరిట ఓ 23 ఏళ్ల యువకుడిని పోలీసులు తీవ్రంగా కొట్టారంటూ సూర్యాపేట జిల్లాలోని రామోజీ తండాకు చెందిన గిరిజనులు నిన్న పోలీస్స్టేషన్ను ముట్టడించారు. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితుడితో మూకుమ్మడిగా ఠాణాకు చేరుకొని ఆందోళన చేపట్టారు. ఆత్మకూర్(ఎస్) పోలీస్స్టేషన్ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. ఈ నెల 4న ఏపూర్లోని తన దుకాణంలో రూ.10 వేల నగదు, 40 మద్యం సీసాలు ఎత్తుకెళ్లినట్లు నిర్వాహకుడు షేక్ సైదులు గత శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో రామోజీతండాకు చెందిన బానోత్ నవీన్ను సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అతను మరికొందరి పేర్లను చెప్పడంతో బానోత్ బుచ్చ్యా, బానోత్ లాల్సింగ్, గుగులోతు వీరశేఖర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరశేఖర్ను బుధవారం మధ్యాహ్నం ఠాణాకు తీసుకొచ్చి విచారించి అర్ధరాత్రి వదిలేశారు. గురువారం ఉదయం మళ్లీ తండాకు వెళ్లి అతన్ని స్టేషన్కు రావాలని అడిగారు. అప్పటికే మంచంపై మూలుగుతున్న వీరశేఖర్ను కుటుంబసభ్యులు, తండావాసులు ఆరాతీయగా.. తనను రాత్రంతా పోలీసులు కొట్టినట్లు అతను తెలిపాడు. దీంతో తండావాసులు ఆగ్రహించి అతడిని ట్రాక్టర్పై ఠాణాకు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. వారించేందుకు యత్నించిన ఎస్సై ఎం.లింగంతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా వీరశేఖర్కు న్యాయం చేయాలని, ఎస్సైను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు. అనంతరం బాధితుడిని ఆటోలో సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ స్పందించి విచారణకు ఆదేశించారు. సూర్యాపేట డీఎస్పీ మోహన్కుమార్ను విచారణ అధికారిగా నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రమాదాలు
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శుక్రవారం రెండు వేర్వేరు చోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. ఆ రెండు బస్సులూ కాలం చెల్లినవే కావడం గమనార్హం. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
కొట్టేసిన ఫోన్లు సూడాన్కు.. స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టు
రాష్ట్రంలో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తున్న, వాటిని కొనుగోలు చేస్తున్న 12 మంది సభ్యులున్న ముఠాను హైదరాబాద్ సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. -
ఆలిన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండల కేంద్రంలోని ఆలిన్ ఫార్మసీ కంపెనీలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. -
ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు సభ్యులు శుక్రవారం పోలీసులకు లొంగిపోయారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా కిష్టారం పోలీస్స్టేషన్ పరిధిలోని నెమలిగూడకు చెందిన పొడియం ఇడుమయ్య అలియాస్ హరీశ్, ఉయికే ముత్యాలక్క లు భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఎదుట లొంగిపోయినట్లు తన కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఏఎస్పీ తెలిపారు. -
నీటి బకెట్లో పడి చిన్నారి మృతి
నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. -
ఏనుగు దాడిలో మరో ఇద్దరి రైతుల మృతి
కుమురం భీం జిల్లాలో ఇటీవల ఇద్దరిని చంపిన ఏనుగు మహారాష్ట్రలో మరో ఇద్దరిని బలి తీసుకుంది. -
స్టాక్ ట్రేడింగ్లో లాభాలిస్తామని రూ.కోటి కాజేత
సైబర్ వలలో చిక్కుకున్న ఓ విద్యార్థిని రూ.కోటికి పైగా డబ్బు పోగొట్టుకుంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. -
అంతర్జాతీయ కోడ్తో వాట్సప్ కాల్స్!
బంజారాహిల్స్ వాసి దినేశ్కు +84 (వియత్నాం) కోడ్తో మొదలయ్యే నంబర్ నుంచి వాట్సప్ వీడియోకాల్ వచ్చింది. అది విదేశీ నంబర్ కావడంతో అనుమానంతో అతను లిఫ్ట్ చేయలేదు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?