Crime News: మణికొండలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ మృతదేహం లభ్యం

నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్‌ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు....

Published : 28 Sep 2021 01:33 IST

హైదరాబాద్: నగరంలో ఈనెల 25న రాత్రి కురిసిన వర్షానికి మణికొండలోని డ్రైనేజీలో గల్లంతైన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ రజనీకాంత్‌ మృతదేహం లభ్యమైంది. నెక్నాంపూర్‌ చెరువులో రజనీకాంత్ మృతదేహం లభ్యమైంది. సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. నాలాలు కలిసే చోట, నెక్నాంపూర్‌ చెరువు వద్ద గాలింపులో భాగంగా నెక్నాంపూర్‌ చెరువులో గుర్రపు డెక్క తొలగిస్తుండగా రజనీకాంత్‌ మృతదేహం బయటపడింది. రెండు రోజుల క్రితం పెరుగు ప్యాకెట్‌ కోసం వచ్చి మణికొండ డ్రైనేజీలో గల్లంతైన రజనీకాంత్‌ మృతదేహం దాదాపు మూడు కిలోమీటర్ల దూరం కొట్టుకొచ్చింది. గోపిశెట్టి రజనీకాంత్‌ (42) షాద్‌నగర్‌లోని నోవా గ్రీన్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని