Eluru: ఏలూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం

ఏలూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఉదయం పాఠశాలకు వెళ్లిన వారు సాయంత్రమైనా.. ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. 

Published : 13 Mar 2024 23:15 IST

ఆగిరిపల్లి: ఏలూరు జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఉదయం పాఠశాలకని వెళ్లిన వారు.. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆగిరిపల్లి మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలలో వీరు తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాల సమయం ముగిసినా తిరిగి ఇంటికి రాకపోవడంతో చుట్టు పక్కల పరిసరాల్లో తల్లిదండ్రులు వెతికారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో బాలికలు పాఠశాలకు వెళ్లకుండా ఆర్టీసీ బస్సులో వీరవల్లి వెళ్లినట్లు గుర్తించారు. ఆ ముగ్గురిలో ఓ బాలిక చరవాణి వాడుతోంది. సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు ట్రేస్‌ చేయగా ప్రకాశం జిల్లాలో గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని