అతివేగం.. యువకుడికి ప్రాణసంకటం..

రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని ద్విచక్రవాహనదారుడు అతివేగంగా ఢీకొట్టడంతో అతడు కొంతదూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చింతల్‌లో చోటుచేసుకుంది. పద్మానగర్‌కు చెందిన జగత్‌ రోడ్డుదాటుతుండగా....

Published : 29 Apr 2021 01:18 IST

చింతల్‌: రోడ్డు దాటుతున్న ఓ యువకుడిని ద్విచక్రవాహనదారుడు అతివేగంగా ఢీకొట్టడంతో అతడు కొంతదూరంలో ఎగిరిపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని చింతల్‌లో చోటుచేసుకుంది. పద్మానగర్‌కు చెందిన జగత్‌ రోడ్డు దాటుతుండగా.. ఆ సమయంలో షాపూర్‌నగర్‌ నుంచి బాలానగర్‌ వైపు ద్విచక్రవాహనంపై ఇద్దరు యువకులు అతి వేగంగా దూసుకెళ్తూ రోడ్డు దాటుతున్న జగత్‌ను ఢీకొట్టారు. వేగంగా ఢీకొట్టడంతో జగత్‌ ఎగిరిపడ్డాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ప్రమాదంలో జగత్‌ కాలికి గాయాలు కాగా.. బైక్‌పై వెళుతున్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడినట్లు పోలీసులు తెలిపారు. ద్విచక్రవాహనానికి నంబర్‌ ప్లేట్‌ లేదని, వారికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని