నేటి నుంచి నాగోబా జాతర ప్రారంభం
ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం రాత్రి మెస్రం వంశస్థుల మహా పూజలతో ప్రారంభం కానుంది.
ఇంద్రవెల్లి, న్యూస్టుడే : ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం రాత్రి మెస్రం వంశస్థుల మహా పూజలతో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐటీడీఏ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సారి నూతన ఆలయం ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. మహాపూజ రోజున మెస్రం వంశం మహిళలు మట్టి కుండలలో మర్రి చెట్ల వద్ద కోనేరు నుంచి నీటిని తీసుకొచ్చి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. అనంతరం నాగోబా దేవత పూజారి(కటోడా) ప్రధాన్లతో పాటు మరో అయిదుగురు పెద్దలు నాగోబా గర్భగుడిలో గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత మహాపూజలుత నిర్వహిస్తారు.
ఇలా చేరుకోవచ్చు..
ఆదిలాబాద్తో పాటు మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్ నుంచి నాగోబా జాతరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. నిర్మల్, మహారాష్ట్ర నుంచి వచ్చే భక్తులకు గుడిహత్నూరు నుంచి నేరుగా నాగోబా జాతరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించారు.
* ఆదిలాబాద్ నుంచి వాహనాలలో వచ్చే వారు ముత్నూరు గ్రామం నుంచి కేస్లాపూర్ చేరుకోవచ్చు. జిల్లా కేంద్రం నుంచి కేస్లాపూర్ 44 కి.మీ దూరంలో ఉంది.
* మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి జాతరకు వచ్చే భక్తులు ఉట్నూరు మీదుగా ముత్నూరు గ్రామానికి చేరుకోవాలి. ముత్నూరు నుంచి నాగోబా ఆలయం 4 కి.మీ దూరంలో ఉంది.
* నిర్మల్ జిల్లా నుంచి వచ్చే భక్తులు ఇచ్చోడ మండలానికి చేరుకుని, ఇచ్చోడ నుంచి సిరికొండ మండలానికి చేరుకుంటే అక్కడి నుంచి 9 కి.మీ ప్రయాణించి కేస్లాపూర్ చేరుకోవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.