ప్రయోజనం బాగున్నా..అనుసంధానం అంతంతే !
ఆరోగ్యశ్రీ.. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-రోగ్యశ్రీ(ఏబీపీఎంజేఏవై)గా మారిన సంగతి తెలిసిందే.
నిర్మల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ-కేవైసీ చేస్తున్న ఆరోగ్య మిత్రలు
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: ఆరోగ్యశ్రీ.. ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన-రోగ్యశ్రీ(ఏబీపీఎంజేఏవై)గా మారిన సంగతి తెలిసిందే. మొన్నటి వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఈ కార్డు సేవలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగించుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దేశంలో సంబంధిత సేవలున్న ఆసుపత్రుల్లో చికిత్స పొందే అవకాశాన్నిచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెల్లరేషన్ కార్డు(ఆహార భద్రత కార్డు) ఉన్న వారికి గతంలో కేవలం తెలుగు రాష్ట్రాల్లో రూ.2 లక్షల వరకే వైద్యం పొందే వీలుండగా.. ఇప్పుడు అదనంగా మరో రూ.3 లక్షలు లాభం చేకూరడంతోపాటు దేశ వ్యాప్తంగా సేవలు పొందవచ్చు. లబ్ధిదారులు చేయాల్సిందల్లా ఆయా పథకానికి అనుసంధానం చేసుకోవడమే. లబ్ధిదారులు ఆయా సేవలందించే ఆసుపత్రుల్లోని ఆరోగ్య మిత్రలతోపాటు ఈ బాధ్యతను అప్పగించిన గ్రామాలు, పట్టణాల్లోని ఏజెన్సీలను సంప్రదించి నమోదు చేసుకోవాలి. కాగా ఈ ప్రక్రియ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతుండగా.. స్పందన అంతంత మాత్రమే వస్తున్నట్లు సంబంధిత విభాగం అధికారులు చెబుతున్నారు. తెల్లరేషన్ కార్డులు భారీగానే ఉన్నా నమోదు మాత్రం తక్కువగా ఉంటోందని ఆయా కార్యక్రమ అధికారులు పేర్కొంటున్నారు. గడువు నేటితో పూర్తి అవుతుండటంతో.. అందరూ నమోదు చేసుకోవాలని కోరుతున్నారు.
* గతేడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు ఎంతమంది అనుసంధానం చేసుకున్నారనేది అధికారికంగా తెలియకపోయినా.. ప్రస్తుత లబ్ధిదారుల్లో కనీసం 40శాతం కూడా పూర్తికాలేదని సమాచారం.
ఉమ్మడి జిల్లాలో ఆహార భద్రత కార్డు ఉన్నవారు, అందులోని లబ్ధిదారులందరూ అనుసంధానం చేసుకునే సమయంలో తప్పనిసరిగా కేం కార్డులో పేర్లున్నవారందరూ నమోదు చేసుకోవాల్సిందే..ద్రానికి వెళ్లాలి.
కార్డు వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ఆరోగ్యమిత్రలు, ఏజెన్సీల నిర్వాహకులు ప్రతి ఒక్కరి ఫొటోతో పాటు వివరాలు నమోదు చేసుకుంటారు. పూర్తి చేసిన తర్వాత చరవాణికి సందేశం వస్తుంది. ఆ తర్వాత కొన్నిరోజుల్లో నూతన కార్డును అదే కేంద్రానికి వెళ్లి పొందవచ్చు. ఈ కార్డు దేశవ్యాప్తంగా చెల్లుబాటు కావడంతోపాటు రూ.5 లక్షల వరకు వైద్యాన్ని ఉచితంగా పొందవచ్చు.
ప్రక్రియ ఉచితమే
- రాపల్లి సత్యనారాయణ, ఉమ్మడి జిల్లా మేనేజర్
ఏబీపీఎంజేఏవై ఈ-కేవైసీకి అధికారికంగా ఒక్క రోజే గడువు ఉండగా అనుసంధానం చాలా తక్కువగా ఉండటంతో పెంచే అవకాశం కనిపిస్తోంది. లబ్ధిదారులు నిర్లక్ష్యం చేయకుండా ఈ పథకం అర్హతకు నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఏ చోట కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇబ్బందులు ఎదురైతే చరవాణి నం.83338 15932ని సంప్రదించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నగేష్ నామినేషన్పై గందరగోళం
[ 27-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ స్థానం కోసం దాఖలైన భాజపా అభ్యర్థి గోడం నగేష్ నామపత్రాల పరిశీలనలో గందరగోళం నెలకొంది. -
నీళ్లు లేవు..నీడ లేదు..
[ 27-04-2024]
జిల్లాలో మారుమూల ప్రాంతవాసులకు సరకుల కొనుగోలుకు వారసంతలే దిక్కు. చిన్నా, చితక కుటుంబాలెన్నో వీటిపైనే ఆధారపడి జీవనోపాధి పొందుతున్నాయి. -
బ్యాటింగ్ చేస్తా.. ఓట్లు పట్టేస్తా!
[ 27-04-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీపార్కు, ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో శుక్రవారం భాజపా ఎంపీ అభ్యర్థి గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ తమ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
కాంగ్రెస్తోనే అన్ని వర్గాల అభివృద్ధి
[ 27-04-2024]
అన్ని వర్గాల అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అత్రం సుగుణ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
చిన్నారుల ప్రతిభ.. ఆకాశవాణి వేదిక
[ 27-04-2024]
పిల్లలు.. మీలో సహజంగానే ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది కదూ.. కానీ అది ప్రదర్శించడానికి వేదిక కావాలి.. అయితే మీలోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం అవకాశాన్ని కల్పిస్తోంది. -
నెట్టింట్లో నేతలు
[ 27-04-2024]
ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు సాదాసీదాగా సాగే ప్రచారం డిజిటల్ యుగం అందుబాటులోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. -
ఎండ వే‘ఢీ’.. చిక్కని ఓటరు నాడీ
[ 27-04-2024]
ఈసారి బరిలో నిలిచిన అభ్యర్థులకు లోక్సభ ఎన్నికలు రోజులు గడుస్తున్న కొద్దీ చెమటలు కక్కిస్తున్నాయి. రోజురోజుకూ పెరుగుతూ వస్తున్న ఎండ తీవ్రత ఒకవైపు, -
పోయిన ఫోను.. దొరుకుతున్నతీరు
[ 27-04-2024]
ఎవరైనా తమ చరవాణిని పోగొట్టుకున్నా, చోరీ అయినా ఇంతకు ముందు దానిపై ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం తమ చరవాణి పోగొట్టుకున్నా, చోరీ అయినా మీసేవా కేంద్రం ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేస్తే సరిపోతుంది. -
ఆస్ట్రేలియా అతిథి!
[ 27-04-2024]
మనదేశ సంప్రదాయాలు, సంస్కృతి.. ఇలా ప్రతీ అంశం విదేశీయులకే కాస్త ఆసక్తే. అందుకే.. ఇక్కడి పద్ధతులను ప్రత్యక్షంగా చూసేందుకు, అందులో భాగమయ్యేందుకు చాలామంది ఉత్సుకత చూపిస్తుంటారు. -
వెండి తెరపై మెరుపులు
[ 27-04-2024]
సినిమాలో అవకాశాలు రావడం చాలా అరుదు. మక్కువ ఉన్నా.. దానిని సాకారం చేసుకునేందుకు ఎంతో కష్టపడుతుంటారు. -
13 ఆమోదం.. 10 తిరస్కరణ
[ 27-04-2024]
ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు దాఖలు చేసిన నామపత్రాలను శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో పరిశీలించారు. -
తేలిన లెక్క
[ 27-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు తుది జాబితాను ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది. ఈ మేరకు శాసనసభ నియోజకవర్గాల వారిగా ఓటర్ల వివరాలు వెల్లడించారు. -
అడుగడుగునా కోడ్ గండం
[ 27-04-2024]
గడిచిన జులై 28న కురిసిన భారీ వర్షాలకు పూర్తిగా తెగిపోయిన సిరాల ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు ఆది నుంచి అవరోధాలు ఎదురవుతున్నాయి. -
దారుంది.. భయపెడుతోంది..!
[ 27-04-2024]
అదేంటది.. దారి భయపెట్టడమేంటని విస్తుపోతున్నారా! మీరు చదివింది నిజమే. అదీ జిల్లా కేంద్రంలోనే. పైగా జిల్లా ప్రధాన ఆసుపత్రి(ఇప్పుడు బోధనాసుపత్రి కూడా) పరిస్థితి ఇది. -
ఇంటర్ విద్య..వీరికి మిథ్య
[ 27-04-2024]
జిల్లాలోని మారుమూల మండలాలు భీమిని, కన్నెపల్లి, నెన్నెల. ఇక్కడ పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇంటర్ చదవాలంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.