వట్టి మాటలే.. కడుపు కోతలే..
కడుపు కోతలు(శస్త్రచికిత్సలు)తగ్గించడంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమవుతోంది. సర్కారుతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది.
ప్రైవేటులో పెరుగుతున్న శస్త్రచికిత్సలు
సర్కారులో తగ్గిన సాధారణ ప్రసవాలు
మంచిర్యాల సిటీ, న్యూస్టుడే: కడుపు కోతలు(శస్త్రచికిత్సలు)తగ్గించడంలో జిల్లా వైద్యారోగ్యశాఖ విఫలమవుతోంది. సర్కారుతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ వీటి సంఖ్య పెరుగుతోంది. మంత్రులు, అధికారులు సాధారణ కాన్పులపై శ్రద్ధ పెడుతున్నామని చెబుతున్నా అవన్నీ వట్టిమాటలే అవుతున్నాయి. కాన్పులన్నీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లోనే జరగాలంటూ పదే పదే మంత్రి ఆదేశాలు ఇస్తున్నా ఇక్కడి అధికారులు పెడచెవిన పెడుతున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదు. సంబంధిత సమస్యలపై ప్రతినెల ప్రైవేటు ప్రసూతి వైద్యులతో నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలు నామమాత్రంగా మారాయి. ప్రైవేటులో ప్రసవాలు, శస్త్రచికిత్సలు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు. సర్కారులో సాధారణ ప్రసవాలు తగ్గడమే కాకుండా కాన్పుల సంఖ్య రోజురోజుకు పడిపోతుంది.
అవగాహన కల్పించ డంలో విఫలం..
మంచిర్యాలలోని మాతా, శిశు ఆరోగ్య కేంద్రం
సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనంపై అవగాహన కల్పించడంలో జిల్లా ఆరోగ్యశాఖ విఫలమవుతోంది. వైద్యులు బాధితులకు భరోసా కల్పించలేకపోతున్నారు. శస్త్రచికిత్సలతో కలిగే నష్టాలు వివరించడం లేదు. ముహూర్తాలు, నొప్పులు భరించడం లేరంటూ గర్భిణుల కుటుంబసభ్యుల మాటలు, ఒత్తిడికి లొంగుతున్నారు తప్పితే సర్దిచెప్పేందుకు ప్రయత్నించడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి.
ఈ లెక్కలు చూస్తే ప్రైవేటులో ఏ స్థాయిలో కోతలు ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని సంబంధిత ఆసుపత్రుల్లో చేస్తున్న ప్రసవాల్లో 85 శాతానికి పైగా శస్త్రచికిత్సలే ఉంటుండగా సాధారణ కాన్పులు 13 శాతానికి పరిమితం అవుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఆయా కేంద్రాలకు వచ్చే గర్భిణులకు ఏ మాత్రం అవగాహన కల్పించడం లేదని అర్థమవుతోంది. శస్త్రచికిత్సతో వచ్చే ఆదాయాన్ని చూసుకుంటున్నారు తప్పితే.. బాధితులకు భవిష్యత్తులో ఎదురయ్యే అనర్థాల గురించి వివరించడం లేదని తెలిసింది.
జిల్లాలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ, శస్త్రచికిత్సలు దాదాపు సమానంగా ఉంటున్నాయి. గతంలో వీటి వ్యత్యాసం భారీగా ఉండగా ప్రస్తుత వైద్యులకు సమయం లేకపోవడం, ఓపిక ఉండకపోవడంతో కోతలపై మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ జరిగిన సాధారణ ప్రసవాలు ఎక్కువశాతం స్టాఫ్నర్సుల చొరవ తీసుకోవడంతో జరిగినవి తప్పితే వైద్యుల పాత్ర శూన్యమని సంబంధితశాఖ సిబ్బందే తెలుపుతుండటం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వానొస్తే.. వణుకే...
[ 17-05-2024]
ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. -
సరిహద్దు ప్రజలు.. చైతన్య వారధులు
[ 17-05-2024]
జిల్లా సరిహద్దు గ్రామాల్లో పల్లెవాసులు ఓటు చైతన్యం ప్రదర్శించారు. అయిదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినా.. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. -
ఈదురుగాలుల బీభత్సం
[ 17-05-2024]
గుడిహత్నూర్, డొంగ్రగావ్, మన్నూర్, తోషం, కొల్హారి పంచాయతీల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
రుణమాఫీకి కసరత్తు
[ 17-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
స్కాన్ చెయ్.. కథలు చదివేయ్!
[ 17-05-2024]
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పఠనా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ను రూపొందించింది. -
వెక్కిరిస్తున్న ఖాళీలు
[ 17-05-2024]
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయాన్ని అర్చకులు, ఉద్యోగుల ఖాళీలు వేధిస్తున్నాయి. -
ఇక ఓపీ సేవలు సులభం
[ 17-05-2024]
జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. -
పడిపోతున్న భూగర్భ జలాలు
[ 17-05-2024]
ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఠారెత్తించాయి. -
టీకా లెక్క.. తేలేదెట్టా..!
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలోని భార్యాభర్తలు తమ ఏడాదిన్నర చిన్నారికి ఇచ్చే టీకాకు సంబంధించి ఆరోగ్య సిబ్బందిని సంప్రదించారు. -
గతమెంతో ఘనం.. నేడు దైన్యం!
[ 17-05-2024]
గతంలో గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో జిల్లాలోనే కౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందుండేది. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 17-05-2024]
ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. -
రెండు వాహనాలు ఢీ
[ 17-05-2024]
రెండు వాహనాలు ఢీకొనగా పలువురికి గాయాలైన ఘటన జాతీయ రహదారి 61పై మండలంలోని తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
నిరంతర సరఫరాకు పకడ్బందీ చర్యలు
[ 17-05-2024]
‘జిల్లాలో నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM