గృహలక్ష్మిపై.. లక్ష సందేహాలు
పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది.
దరఖాస్తుల స్వీకరణకు ఇంకా రెండు రోజులే గడువు..
తొలిరోజు 3,379 స్వీకరణ
న్యూస్టుడే, ఆదిలాబాద్పాలనాప్రాంగణం :పేద, మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చేలా ప్రభుత్వం ‘గృహలక్ష్మి’ పథకం అమలుకు శ్రీకారం చుట్టింది. మంగళవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. ఈ నెల 10 తుదిగడువు విధించడంతో అందరిలో అయోమయం నెలకొంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జతచేయాలో.. ఎవరి పేరిట దరఖాస్తు చేసుకోవాలో తెలియక ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తొలిరోజున 3,379 మంది దరఖాస్తులు సమర్పించారు.
సొంత స్థలం ఉండి పక్కాగృహం లేని బలహీనవర్గాల కుటుంబాలు గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. రూ.3 లక్షల నగదును లబ్ధిదారు బ్యాంకు ఖాతాల్లో మూడు విడతల్లో జమ చేయాలని నిర్ణయించింది. దరఖాస్తుల సమర్పణకు కేవలం మూడు రోజులే గడువు ఇవ్వడం అందరిలో అనుమానాలను రేకెత్తిస్తోంది. దరఖాస్తుకు ఏ పత్రాలు జత చేయాలో తెలుసుకునేందుకు సంబంధీకులు కార్యాలయాలకు తరలివచ్చారు. మూడు రోజుల్లో ఒకరోజు ముగిసిపోయింది. ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ఆయాపత్రాల సేకరణకు ఉరుకులు, పరుగులు పెడుతున్నారు. కుల, వార్షికాదాయ వివరాలను అడగడం.. ఇళ్ల కేటాయింపుల్లో కులాల వారీగా రిజర్వేషన్లు ఉండటంతో ఆ పత్రాలు లేనివారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. గడువులోగా ఆ పత్రాలు వస్తాయో, రావో అన్న మీమాంస వారిని వెంటాడుతోంది.
ఇవీ జత చేయాలి!
నిర్ణీత దరఖాస్తుకు రెండు పాస్పోర్ట్సైజు ఫొటోలు, ఆహార భద్రత కార్డు, ఓటరుకార్డు, ఆధార్కార్డు, ఇంటి స్థల దస్తావేజులు, ఇంటిపన్ను రసీదు, విద్యుత్తు బిల్లు రసీదు, బ్యాంకు పాస్బుక్ జిరాక్సు ప్రతులను జత చేయాలి. దివ్యాంగులైతే సదరం సర్టిఫికెట్నూ సమర్పించాలి.
ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో
జిల్లాలోని 18 తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రజల నుంచి గృహలక్ష్మి దరఖాస్తులు తీసుకునేలా ప్రత్యేక కౌంటర్లను మంగళవారం ప్రారంభించారు.
మహిళ పేరిట చేయాలి: ఆర్డీవో స్రవంతి
ఇంటిస్థలం ఉన్నవారు మాత్రమే అర్హులు. దస్తావేజులు మగవారి పేరిట ఉన్నా మహిళ పేరిట మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. విచారణ సమయంలో దరఖాస్తుదారుతో ఉన్న సంబంధాన్ని నిర్ధారిస్తారు. గ్రామీణులైతే తహసీల్దార్ కార్యాలయంలో, పట్టణవాసులు మున్సిపాలిటీ కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలి.
22 అంశాలతో దరఖాస్తు!
గృహలక్ష్మి కోసం దరఖాస్తు పేరిట అందులో 22 అంశాలను పొందుపరిచేలా రూపొందించారు. ఇంటి స్థలం ఉంటేనే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని నిర్దేశించారు.
తొలిరోజునే బారులు!
ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి తొలిరోజునే గృహలక్ష్మి దరఖాస్తుదారులు వరుస కట్టారు. మొత్తం 49 వార్డుల దరఖాస్తులను ఇక్కడే స్వీకరిస్తుండటంతో సందడి నెలకొంది. వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడకుండా కార్యాలయ కింది గదిలోనే ప్రత్యేక కౌంటరును తెరిచారు.
అంతా అయోమయం!
వీరంతా మావల మండలం బట్టిసావర్గాం పంచాయతీ దుబ్బగూడ కాలనీవాసులు. తొలిరోజున కార్యాలయానికి వచ్చిన వీరంతా దరఖాస్తుకు ఏం జత చేయాలో తెలియక గంటల తరబడి నిరీక్షించారు. అక్కడి సిబ్బంది సూచనలతో ఆయా పత్రాల కోసం తిరిగి ఇళ్లకు వెళ్లి తెచ్చారు.
రెండు కౌంటర్లు..!
కలెక్టరేట్లో రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చే వారితోపాటు ఆదిలాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని 14 మండలాల దరఖాస్తులు స్వీకరణకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. అనంతరం మండలాలవారీగా వాటిని వేరుచేసి ఆయా తహసీల్దార్ కార్యాలయాలకు పంపించనున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు లారీలు ఢీ.. డ్రైవర్ దుర్మరణం
[ 17-05-2024]
రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్ దుర్మరణం చెందారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మండలంలోని మావల సమీపంలోని జాతీయ రహదారిపై జరిగింది. -
వానొస్తే.. వణుకే...
[ 17-05-2024]
ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతన్నను అడుగడుగునా కష్టాలు వెంటాడుతున్నాయి. -
సరిహద్దు ప్రజలు.. చైతన్య వారధులు
[ 17-05-2024]
జిల్లా సరిహద్దు గ్రామాల్లో పల్లెవాసులు ఓటు చైతన్యం ప్రదర్శించారు. అయిదు నెలల కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గినా.. గత లోక్సభ ఎన్నికలతో పోల్చితే ఈసారి ఎక్కువ మంది ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. -
ఈదురుగాలుల బీభత్సం
[ 17-05-2024]
గుడిహత్నూర్, డొంగ్రగావ్, మన్నూర్, తోషం, కొల్హారి పంచాయతీల్లో గురువారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. -
రుణమాఫీకి కసరత్తు
[ 17-05-2024]
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీమేరకు రుణమాఫీని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. -
స్కాన్ చెయ్.. కథలు చదివేయ్!
[ 17-05-2024]
విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుని పఠనా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు రూమ్ టు రీడ్ స్వచ్ఛంద సంస్థ లిటరసీ క్లౌడ్ వెబ్సైట్ను రూపొందించింది. -
వెక్కిరిస్తున్న ఖాళీలు
[ 17-05-2024]
దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన బాసర సరస్వతి ఆలయాన్ని అర్చకులు, ఉద్యోగుల ఖాళీలు వేధిస్తున్నాయి. -
ఇక ఓపీ సేవలు సులభం
[ 17-05-2024]
జనరల్ ఆసుపత్రిలో బాధితుల తాకిడి ఏ స్థాయిలో ఉంటుందో అందరికీ తెలిసిందే. వైద్యులను సంప్రదించడం పక్కన పెడితే ఓపీ చీటీ పొందాలంటేనే గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి. -
పడిపోతున్న భూగర్భ జలాలు
[ 17-05-2024]
ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో భానుడు ఉగ్రరూపం దాల్చడంతో ఎండలు ఠారెత్తించాయి. -
టీకా లెక్క.. తేలేదెట్టా..!
[ 17-05-2024]
జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలోని భార్యాభర్తలు తమ ఏడాదిన్నర చిన్నారికి ఇచ్చే టీకాకు సంబంధించి ఆరోగ్య సిబ్బందిని సంప్రదించారు. -
గతమెంతో ఘనం.. నేడు దైన్యం!
[ 17-05-2024]
గతంలో గ్రామీణ ప్రాంతవాసులకు మెరుగైన వైద్యసేవలు అందించడంలో జిల్లాలోనే కౌటాల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ముందుండేది. -
రైతులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
[ 17-05-2024]
ధాన్యానికి క్వింటాలుకు రూ.500ల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు సన్నరకం వడ్లకే బోనస్ అంటూ రైతాంగాన్ని మోసం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపించారు. -
రెండు వాహనాలు ఢీ
[ 17-05-2024]
రెండు వాహనాలు ఢీకొనగా పలువురికి గాయాలైన ఘటన జాతీయ రహదారి 61పై మండలంలోని తిమ్మాపూర్ బస్టాండ్ సమీపంలో గురువారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. -
నిరంతర సరఫరాకు పకడ్బందీ చర్యలు
[ 17-05-2024]
‘జిల్లాలో నాణ్యమైన నిరంతర విద్యుత్తు సరఫరాకు చర్యలు తీసుకుంటున్నాం. వర్షాకాలం నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి