కారుకు బైబై.. చేయికి సై..!
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్, ముథోల్ స్థానాలను భాజపా, ఖానాపూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు
నిర్మల్ ‘పుర’ ఛైర్మన్తో సహా మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరే అవకాశం
జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలు
నిర్మల్, న్యూస్టుడే : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోపాటు నిర్మల్, ముథోల్ స్థానాలను భాజపా, ఖానాపూర్ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనూ భారాస అభ్యర్థులు ఓటమి చెందడంతో ఆ పార్టీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డారు. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, స్థానికంగా పార్టీ అభ్యర్థులు కూడా గెలవకపోవడంతో భారాస పార్టీకి చెందిన స్థానిక సంస్థల మెజార్టీ ప్రజాప్రతినిధులు ప్రత్యామ్నాయంగా ‘చేయి’ పట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ‘కారు’ దిగి ‘హస్తం’ గూటికి చేరేందుకు నిర్మల్ పురపాలక సంఘం ఛైర్మన్తోపాటు మెజార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీకి చెందిన జిల్లాలోని సీనియర్ నాయకులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.
కాంగ్రెస్, భాజపాల్లో చేరడానికి సుముఖత...
నిర్మల్ పురపాలక సంఘంలో 42 వార్డులు ఉండగా.. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో భారాస పార్టీ 30, కాంగ్రెస్ 7, ఏఐఎంఐఎం రెండు స్థానాలు కైవసం చేసుకోగా.. స్వతంత్రులు ఇద్దరు, భాజపా నుంచి ఒక్కరు గెలుపొందారు. కొన్ని నెలలు గడిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన కౌన్సిలర్లు ఒక్కొక్కరూ పార్టీలు మారారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు భారాసకు చెందిన 16 మంది కౌన్సిలర్లు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. మిగతా 14 మందిలో ఒకరు మూన్నెళ్ల క్రితం భాజపాలో చేరగా.. మరో ఆరుగురు కూడా అందులో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. మిగిలిన ఏడుగురు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. నిర్మల్ పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు రూ.12 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉండటంతోపాటు రానున్న రోజుల్లో కొత్తగా చేపట్టాల్సిన పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరడం ఉత్తమమనే అభిప్రాయానికి భారాస కౌన్సిలర్లు వచ్చినట్లు తెలిసింది. వీరంతా మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్పై కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తీసుకొచ్చారని, ఆయన కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. త్వరలోనే హస్తం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని భారాస పార్టీ చెందిన పలువురు కౌన్సిలర్లు బాహాటంగా చెబుతున్నారు. ఇటీవల శాసనసభ ఫలితాల్లో పాత పట్టణంలోని అయిదారు వార్డుల్లో భాజపాకు బాగా మెజార్టీ వచ్చింది. ఓ వర్గానికి సంబంధించి ఓట్లు గంపగుత్తగా పడటంతో ప్రస్తుతం ఆయా వార్డులకు భారాస నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కౌన్సిలర్లు భాజపాలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. త్వరలో ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి సమక్షంలో కమలం గూటిలో చేరనున్నట్లు సమాచారం. ఓ వైపు భారాస కౌన్సిలర్లు కాంగ్రెస్, భాజపాల వైపు చూస్తుండగా.. మరోవైపు మున్సిపల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్పై అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చేందుకు కొందరు కౌన్సిలర్లు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కొద్ది నెలల క్రితం భాజపాలో చేరిన కౌన్సిలర్ ప్రస్తుతం ఏ పార్టీలో చేరేందుకు ఇష్టపడని వారితోపాటు భాజపాలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్న వారిని, భారాసలో ఉన్న మరికొందరి మద్దతు కూడగట్టే పనిలో నిమగ్నం కావడంతో శాసనసభ ఎన్నికలు ముగిసినా నిర్మల్లో రాజకీయ వేడి తగ్గడంలేదు.
ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం..?
కొత్తగా ఏర్పడిన ఖానాపూర్ పట్టణంలో 12 వార్డులు ఉండగా.. అప్పుడు జరిగిన ఎన్నికల్లో భారాస ఆరు, కాంగ్రెస్ అయిదు, ఒక స్థానంలో భాజపా గెలుపొందింది. గతేడాది ఇక్కడి మున్సిపల్ ఛైర్మన్ అంకం రాజేందర్పై తొమ్మిది మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసును అప్పటి జిల్లా పాలనాధికారి వరుణ్రెడ్డికి అందజేశారు. ఆ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా చాలా పురపాలక సంఘాల ఛైర్మన్లపై అవిశ్వాస తీర్మానాల అలజడి నెలకొనగా.. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం ‘పుర’పాలకవర్గం కొలువుదీరి నాలుగేళ్లు పూర్తయితేనే అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలోనే అవిశ్వాస తీర్మాన నోటీసులపై ప్రభుత్వం స్పందించలేదు. వచ్చే జనవరి నెలాఖరుతో నాలుగేళ్ల ‘పుర’పాలన ముగియనున్న నేపథ్యంలో ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇక్కడి పురపాలక సంఘంలో తొమ్మిది మంది కౌన్సిలర్లు సమాయత్తమవుతున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు