logo

Crime News: లారీని ఢీకొన్న పాఠశాల బస్సు.. 21 మందికి గాయాలు

కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బెన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి.

Updated : 09 Jan 2024 19:08 IST

రెబ్బెన: కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెబ్బెన మండలం ఇంద్రానగర్‌ వద్ద పాఠశాల బస్సు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో 21 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని కాగజ్‌నగర్‌, మంచిర్యాలలోని ఆస్పత్రులకు తరలించారు. పాఠశాల బస్సు డ్రైవర్‌ రాంగ్‌ రూట్‌లో రావడమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని