logo

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్రాల నగేష్

ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కోసం గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్రాల నగేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

Published : 28 Mar 2024 18:40 IST

ఎదులాపురం: ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం కోసం గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్రాల నగేష్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఎన్నికల్లో ఎన్రాల నగేష్ తన సమీప అభ్యర్థి బిపిన్ పటేల్‌పై 20 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆయన ప్రస్తుతం వరుసగా మూడోసారి బార్‌ సోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఎన్నికల్లో విజయం సాధించిన నూతన కార్యవర్గం కోర్టు ఆవరణలో బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపును ఎన్నికల అధికారి ముస్కు రమణారెడ్డి, సహాయ ఎన్నికల అధికారులు భావన సింగ్, వై. వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టారు. ఉపాధ్యక్షురాలిగా రజిత రెడ్డి తన సమీప ప్రత్యర్థి చంద్రకాంత్‌పై 29 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. ప్రధాన కార్యదర్శిగా సంతోష్ కుమార్ 9 ఓట్ల ఆధిక్యంతో చందు సింగ్ ను ఓడించారు. క్రీడల కార్యదర్శిగా ముజాహిద్ హుస్సేన్ 5 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. అంతకు ముందు సంయుక్త కార్యదర్శిగా రాహుల్ వాగ్మారే, కోశాధికారిగా కొర్రి రమణయ్య మహిళా ప్రతినిధిగా తిలోత్తమ గిత్తే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని