వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల దాడులు
మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.
మంచిర్యాల నేరవిభాగం, న్యూస్టుడే: మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఎస్కే ఫైనాన్స్, సీసీసీ నస్పూర్కు చెందిన ఎస్కే ఇమ్రాన్ నుంచి రూ.7.64 లక్షల నగదు, 76 ప్రామిసరీ నోట్లు 16 బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
చెన్నూరు: చెన్నూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్, వడ్డీ, చీటీల వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లల్లో సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన మామిడాల లక్ష్మినారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి వద్ద 5 ఖాళీ చెక్కులు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చీటీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు, జైపూర్ ఎస్సైలు వెంకటేశ్వర్రావు, శ్రీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గొలుసు దొంగతనం
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: వివాహిత మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ అనిల్ తెలిపిన ప్రకారం.. స్థానిక శాస్త్రినగర్కు చెందిన యమున అనే మహిళ పరామర్శ నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చే క్రమంలో శివాజీచౌక్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అదునుచూసి ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడ్నుంచి పరారయ్యారు. చైన్ లాగే క్రమంలో ఆమె అదుపుతప్పి కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదుచేసినట్లు సీఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిదుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!