వడ్డీ వ్యాపారుల ఇళ్లలో పోలీసుల దాడులు
మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు.
మంచిర్యాల నేరవిభాగం, న్యూస్టుడే: మంచిర్యాల పట్టణంలో నిబంధనలు అతిక్రమించి అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ పలువురిని వేధిస్తున్న ఫైనాన్స్ నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బన్సీలాల్ తెలిపారు. ఎస్కే ఫైనాన్స్, సీసీసీ నస్పూర్కు చెందిన ఎస్కే ఇమ్రాన్ నుంచి రూ.7.64 లక్షల నగదు, 76 ప్రామిసరీ నోట్లు 16 బ్లాంక్ చెక్కులను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
చెన్నూరు: చెన్నూరు పట్టణంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఫైనాన్స్, వడ్డీ, చీటీల వ్యాపారుల కార్యాలయాలు, ఇళ్లల్లో సోమవారం పోలీసులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. పట్టణంలోని పద్మనగర్ కాలనీకి చెందిన మామిడాల లక్ష్మినారాయణ అనే వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా అతడి వద్ద 5 ఖాళీ చెక్కులు, అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న చీటీ వ్యాపారానికి సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ రవీందర్ తెలిపారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. చెన్నూరు, జైపూర్ ఎస్సైలు వెంకటేశ్వర్రావు, శ్రీధర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
గొలుసు దొంగతనం
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: వివాహిత మెడలోంచి బంగారు గొలుసు అపహరించిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకుంది. పట్టణ సీఐ అనిల్ తెలిపిన ప్రకారం.. స్థానిక శాస్త్రినగర్కు చెందిన యమున అనే మహిళ పరామర్శ నిమిత్తం వేరే గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం ఇంటికి తిరిగొచ్చే క్రమంలో శివాజీచౌక్ వద్ద బస్సు దిగి నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అదునుచూసి ఆమె మెడలోని 2 తులాల బంగారు గొలుసును లాక్కొని అక్కడ్నుంచి పరారయ్యారు. చైన్ లాగే క్రమంలో ఆమె అదుపుతప్పి కిందపడటంతో స్వల్పగాయాలయ్యాయి. కేకలు వేసినా ఫలితం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించారు. సీసీ టీవీలో నమోదైన దృశ్యాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కేసు నమోదుచేసినట్లు సీఐ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అర్హత లేకున్నా.. చికిత్స..!
[ 21-05-2024]
నిబంధనల ప్రకారం రోగులకు, క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించేందుకు మాత్రమే ఆర్ఎంపీ (రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్), పీఎంపీ (ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్)లకు అవకాశముంది -
మూడేళ్లుగా ముప్పుతిప్పలు
[ 21-05-2024]
కోటపల్లి మండలంలోని ప్రాణహిత తీరప్రాంత గ్రామాలను అనుసంధానం చేసే ప్రధాన రహదారిని బాగు చేయడంలో మూడేళ్లుగా నిర్లక్ష్యం వెంటాడుతోంది. -
తరుగు పేరిట దోపిడీ
[ 21-05-2024]
అష్టకష్టాలు పడి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రం వద్దకు అమ్మకానికి తీసుకెళ్తే రైతులు దోపిడీకి గురవుతున్నాడు. అకాల వర్షాలతో కేంద్రాల్లో నిల్వచేసిన ధాన్యం తడిసిపోవడంతో ఆరబెట్టేందుకు అనేక అవస్థలు పడ్డారు -
అధికార్ల మెలిక.. అన్నదాత తికమక
[ 21-05-2024]
వానాకాలం పంటల సాగు నేపథ్యంలో.. ఇప్పటికే పలువురు రైతులు భూములను దుక్కి దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. కానీ అటవీహక్కు పత్రాలు కలిగిన భూముల్లో ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారు -
ఎమ్మెల్యే హరీశ్బాబును అడ్డుకున్న పోలీసులు
[ 21-05-2024]
జైనూరు మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఓ వర్గం సభ్యులు గాయపడిన విషయం విదితమే. -
తోటి మిత్రులే హంతకులై.!
[ 21-05-2024]
మండలంలోని గన్నారంలో పలువురు మిత్రులు మద్యం మత్తులో తోటి స్నేహితుడిని దారుణంగా హతమార్చారు. -
రూ. 47 లక్షల విక్రయాలకు లెక్కల్లేవ్!
[ 21-05-2024]
రైతులకు రుణాలు అందించి సకాలంలో ఎరువులను సరఫరా చేసి అండగా నిలవాల్సిన వ్యవసాయ సహకార సంఘాలు అస్తవ్యస్త నిర్వహణతో గాడి తప్పుతున్నాయి. -
తడబడితే తప్పదు మూల్యం
[ 21-05-2024]
విద్యాసంవత్సరం మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యాసంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తోక పేర్లతో నూతన బ్రాంచిల పేరిట ఆయా ప్రాంతాల్లో ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. -
సర్కారు బడులు.. చకచకా పనులు
[ 21-05-2024]
భీంపూర్ జిల్లా పరిషత్ స్కూల్లో ప్రహరీ, టాయిలెట్లు, ఫ్లోరింగ్, విద్యుత్తు వంటి మరమ్మతులతోపాటు తాగునీటి సౌకర్యం కోసం కుళాయిలు ఏర్పాటు చేశారు -
రెండేళ్లుగా ఎదురుచూపులే
[ 21-05-2024]
తాంసి ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 2023లో కేంద్ర బృందం సందర్శించింది. రోగులకు ఉత్తమ వైద్య సేవలు, రికార్డుల నిర్వహణ, మందుల నిల్వలు తదితర విషయాల్లో అత్యుత్తమ పనితీరుతో ఎన్క్వాస్కు ఎంపిక చేశారు. -
విత్తన గుట్టు విప్పండి..
[ 21-05-2024]
‘‘ మీరు కోరుకున్న కంపెనీ విత్తన సంచి కావాలంటే మేం చెప్పే మరో కంపెనీకి చెందిన రెండు విత్తన సంచులు కొనాలి. లేనట్లయితే మీరు చెప్పే విత్తనాలు ఇవ్వటం కుదరదు. -
మానవతావాదులు స్పందించారు..
[ 21-05-2024]
బ్రెయిన్ స్ట్రోక్తో అపస్మారక స్థితిలో ఉన్న కాంట్రాక్టు అధ్యాపకుడు శంకర్ జాడే చికిత్స నిమిత్తం మానవతావాదులు తమవంతు సాయం చేసేందుకు ముందుకొచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కాలిఫోర్నియా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
-
రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
-
ఏపీలో రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల నిలిపివేత
-
ఏపీకి తుపాను ముప్పు లేనట్లే..!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!