రెండు స్థానాలు ఎగబాకి..
పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది.
పదో తరగతి ఫలితాల్లో జిల్లాకు 17వ స్థానం
10 జీపీఏ సాధించిన బాలికలను అభినందిస్తున్న డీఈవో ప్రణీత
న్యూస్టుడే, ఆదిలాబాద్ పాలనాప్రాంగణం : పదో తరగతి ఫలితాలు ఈసారి కొంత ఊరటనిచ్చాయి. కిందటేడాదితో పోల్చితే జిల్లాకు 19వ స్థానం రాగా.. ఈసారి రెండు స్థానాలు ఎగబాకి 17వ స్థానం దక్కించుకుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 4.25 శాతం పెరుగుదలతో 92.93 శాతం ఉత్తీర్ణత సాధించారు.
జిల్లా వ్యాప్తంగా 10,374మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకాగా.. అందులో 9,641 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలురు 5,179 మంది పరీక్ష రాస్తే 4,744 మంది, బాలికల్లో 5,195 మందికి 4,897 మంది పాసయ్యారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు 91.60 శాతం, బాలికలు 94.26 శాతం సాధించారు.
94 మందికి 10 గ్రేడ్ పాయింట్లు
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 10 గ్రేడ్ పాయింట్లు(జీపీ) 46 మంది విద్యార్థులకు రాగా.. అందులో అత్యధికంగా తాంసి మండలం ఈదుల్లా సావర్గాం మహాత్మా జ్యోతిబాఫులే విద్యార్థినులు ఏకంగా 24 మంది, ప్రైవేటు విద్యా సంస్థల్లో 48 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు. బోథ్ టీఎస్డబ్ల్యూఆర్ఎస్(బాలికలు)లో ఆరుగురు, ఎంజెపీ ఆదిలాబాద్ విద్యార్థినులు నలుగురు, ఎంజెపీ నర్సాపూర్, జడ్పీఎస్ఎస్ కప్పర్లలో ఇద్దరు చొప్పున, ఎస్డబ్ల్యూఆర్, మైనార్టీ రెసిడెన్షియల్, మోడల్స్కూల్, జిల్లా పరిషత్ ఆదిలాబాద్, బజార్హత్నూర్, బోథ్, ఇచ్చోడ, జైనథ్, కూర పాఠశాలల్లో ఒకరి చొప్పున 10 జీపీఏ సాధించిన వారిలో ఉన్నారు.
59 బడుల్లో 100 శాతం ఉత్తీర్ణత
జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 37 బడుల్లో చదివిన 1,066 మంది విద్యార్థులు, 22 ప్రైవేటు బడుల్లో చదివిన 869 మంది విద్యార్థులు పాసై 100 శాతం ఉత్తీర్ణత నమోదు చేయడం విశేషం. ఇందులో 30 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో 658 మంది విద్యార్థులు, నాలుగు కేజీబీవీల్లో 132 మంది, మూడు మోడల్ స్కూళ్లలో 276 మంది, 22 ప్రైవేటు స్కూళ్లలో 869 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
యాజమాన్యాల వారీగా..
ఆశ్రమోన్నత పాఠశాలల్లో 1450(90.46శాతం), బీసీ గురుకులాల్లో 321(100శాతం)మంది, ప్రభుత్వ బడుల్లో 572(79.89శాతం), కేజీబీవీల్లో 548(94.97శాతం), ప్రైవేటు స్కూళ్లలో 2,288 (96.83 శాతం), మైనార్టీ గురుకులాల్లో 214(95.83శాతం), సోషల్ వెల్ఫేర్ స్కూళ్లలో 233(99.15శాతం), ట్రైబల్ వెల్ఫేర్లో 448(98.03 శాతం), జడ్పీ పాఠశాలల్లో 3,005(90.73శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
అందరు పాస్!
వీరంతా గాదిగూడ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ పదో తరగతి విద్యార్థినులు. పట్టుదలతో చదవడంతో పదో తరగతి పరీక్ష రాసిన 40 మంది ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలు నమోదు చేశారు. ఇతర కస్తూర్బా విద్యాలయాలైన ఇచ్చోడలో 33 మంది, నార్నూర్లో 30 మంది, తలమడుగులో 26 మంది, బేలలో 29 మంది ఉత్తీర్ణులై 100 శాతం ఫలితాలతో సత్తా చాటారు. విద్యార్థినులను, టీచర్లను, ఎస్ఓలను సెక్టోరల్ అధికారి ఉదయశ్రీ ప్రత్యేకంగా అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టణాలకొస్తే ఉగ్గపట్టుకోవాల్సిందే
[ 22-05-2024]
ఇంటి నుంచి పని నిమిత్తం బయటకు వెళ్లే మహిళలు, యువతులు, బాలికలు ఒంటికి, రెంటికి వెళ్లే క్రమంలో శౌచశాలలు లేక పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కొన్ని పురపాలికల్లోని రద్దీ ప్రదేశాల్లో శౌచశాలలు లేకపోవడం, ఉన్న వాటిల్లో కొన్నింట్లో పూర్తిస్థాయిలో వసతులు లేక వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. -
సమీకృత మార్కెట్ ఎప్పటికి పూర్తయ్యేనో?
[ 22-05-2024]
జిల్లా కేంద్రంలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన పనులకు పూర్తిస్తాయిలో నిధులు విడుదల కాలేదు. -
ఏకరూపంపై ఎన్నో అనుమానాలు
[ 22-05-2024]
పాఠశాలల పునఃప్రారంభానికి సరిగ్గా 21 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జిల్లాకు ఒక జత వస్త్రం వచ్చింది. ఇంకా అవి మండల, గ్రామస్థాయిలోని సంఘాలకు చేరాల్సి ఉంది. బడులు తెరిచే నాటికి విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఇవ్వడం సాధ్యమేనా? అన్నది అనుమానంగా కనిపిస్తోంది. -
అటు మనుషుల ప్రాణాలు.. ఇటు పులుల మరణాలు!
[ 22-05-2024]
తెలంగాణ సరిహద్దున ఉన్న మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా పులులకు ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి తడోబా అభయారణ్యాలలో వ్యాఘ్రాలు యథేచ్ఛగా సంచరిస్తుంటాయి. ఈక్రమంలో అవి తరచూ అటవీ సమీప జనావాసాల్లోకి వచ్చి మనుషులు, పశువులపై దాడిచేస్తుండగా.. ఇటు వేటగాళ్లు వాటిని హతమారుస్తున్నారు. దీంతో చంద్రపూర్ జిల్లాలో ఆందోళన నెలకొంది. -
నచ్చి.. మెచ్చి.. అభిమానించి..!
[ 22-05-2024]
ప్రపంచదేశాల్లో భారతదేశానికి ఉన్న ప్రాధాన్యం అంతాఇంతా కాదు. ఇక్కడి ఆచార వ్యవహారాలు, సంస్కృతి- సంప్రదాయాలు విదేశీయులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఆకర్షణీయమే. మన ప్రాంతంలో ఉండే కుటుంబ బంధాలు, ఆధ్యాత్మిక చింతన, కట్టుబొట్టు, వేషధారణ, బంధాలు-అనుబంధాలు.. ఇలా ఒకటేమిటి ప్రతీ విషయమూ వారిని ఆకట్టుకుంటోంది. -
మనోబలం.. విజయ పథం
[ 22-05-2024]
అందరి పిల్లల్లాగే చిన్నతనంలో బడికి వెళ్లి వచ్చి ఆటలాడుకుంటూ ఉండేది అతడి బాల్యం.. ఉన్నట్టుండి ఒక్కసారిగా అనారోగ్యానికి గురై కంటిచూపు కోల్పోయాడు. తల్లిదండ్రులు, స్నేహితుల అండతో చదువు కొనసాగించారు. -
20 కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం
[ 22-05-2024]
సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీన్ని కొనుగొన్నారు. -
ఆర్జీయూకేటీకి మళ్లీ రిక్తహస్తమే
[ 22-05-2024]
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ) ప్రాభవం క్రమంగా మసకబారుతోంది. తగ్గుతోంది. కులపతిగా గవర్నర్ పర్యవేక్షణ లేనందున శాశ్వత ఉపకులపతి(వీసీ) నియామకం చేసే వెసులుబాటు లేదు. -
ఏడుగురిపై ఏసీబీ కేసు
[ 22-05-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. భూములు కోల్పోయిన వారికి పరిహారం చెల్లింపుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రెవెన్యూ అధికారుల సహకారంతో స్థిరాస్తి వ్యాపారులు రూ.కోట్లలో పరిహారాన్ని కాజేయగా, రెవెన్యూ అధికారులకు సైతం స్థిరాస్తి వ్యాపారులు రూ.కోట్లలో ముట్టజెప్పారు. -
పని భారం.. చాలని వేతనం!
[ 22-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత కారణంగా ఉపాధ్యాయులు బోధనతోపాటు బోధనేతర పనులు కూడా నిర్వర్తిస్తున్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులను కేవలం బోధన విధులకే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. -
బొమ్మల పెండ్లి.. చిన్నారులే పెద్దలండి!
[ 22-05-2024]
పెళ్లి కుమార్తె ముస్తాబైంది.. పెళ్లి కుమారుడు మండపంలో సిద్ధంగా ఉన్నాడు. చిన్నారులు తోడుగా రాగా.. వధువు మండపానికి వచ్చేసింది. చిన్నారులే పెండ్లి పెద్దలుగా.. వేదమంత్రాలతో వివాహాన్ని పూర్తిచేశారు. ఇక్కడ వివాహం జరిగింది బొమ్మలకు. చేసింది పిల్లలే. -
నిపుణులు లేక.. సేవలు అందక
[ 22-05-2024]
ఒకప్పుడు వెలుగు వెలిగిన ఏరియా ఆసుపత్రి అది. అలాంటి ఆసుపత్రి యాజమాన్యం చిన్నచూపు, సంఘాల నాయకుల మెతక వైఖరితో ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఏకంగా ఆసుపత్రిలోని పురుషుల, మహిళల వార్డులు మూసివేశారు. -
తెల్లబంగారానికే మొగ్గు
[ 22-05-2024]
వానాకాలం పంట ప్రణాళికను వ్యవసాయశాఖ సిద్ధం చేసింది. ఈ ఏడాది ముందే రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించిన నేపథ్యంలో అన్నదాతలకు సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. -
అంతరాయం లేని విద్యుత్తు.. అధికారుల కసరత్తు
[ 22-05-2024]
అంతరాయం లేకుండా కరెంటు సరఫరా చేసేందుకు తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో ఎప్పుడు, ఎక్కడ, ఎంత సేపు విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగిందనే వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా ఇప్పటికే జిల్లాల్లో సైదీ సైఫీ విధానం అమలు చేస్తున్నారు.