ఏడేళ్లుగా తీరని వెతలు!
భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది.
వానాకాలంతో గుండేగాం వాసుల గుబులు
గుండేగాంలో కూలిపోయిన ఇల్లు
భైంసా, న్యూస్టుడే: భైంసా మండలం గుండేగాం వాసుల పునరావాసం మాట అరణ్య రోదనే అవుతోంది. ఏడేళ్లుగా వారి కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ప్రభుత్వం శాశ్వత పరిష్కారం కోసం జీవో విడుదల చేసినా కార్యాచరణ ముందడుగు వేయడంలేదు. దీనికి శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల నిబంధనలకు కూడా అడ్డుగా మారాయి. ఈ ఎన్నికలు పూర్తయితే మళ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఈ ఏడాది కూడా కష్టాలు తప్పేటట్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే ప్రత్యేక అనుమతులతో పునరావాస చర్యలు చేపడితే సమస్య అధిగమించే వీలుందంటున్నారు.
2006లో మండలంలోని కోతుల్గాం-వాడి శివారులోని చిన్న సుద్దవాగుపై పల్సీకర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టగా 2017లో పూర్తయ్యాయి. రూ.37 కోట్లతో నిర్మించిన పనుల్లో ఆయా శాఖల అధికారుల తప్పిదాలు గుండేగాం వాసుల శాపమయ్యాయి. పూర్తిగా రూపుదిద్దుకున్న ప్రాజెక్టుతో మొదటి వర్షాకాలంలోనే గ్రామంలో వెనకతట్టు నీరు ప్రవేశించింది. దీంతో ఏడేళ్లుగా వానాకాలం వస్తే గూడులేని పక్షుల్లా ఇతర ప్రాంతాల్లో తల దాచుకుంటున్నారు. వాగు పరీవాహక ప్రాంత వ్యవసాయ భూములు సైతం నీట మునుగుతున్నాయి. ఏడేళ్లుగా పునరావాసం కల్పిస్తామని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు హామీలతోనే కాలం వెళ్లదీస్తున్నాయని బాధిత గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. రెండేళ్ల కిందట జులైలో ఆర్అండ్ఆర్ ప్యాకేజీ కింద రూ.61.30 కోట్లను మంజూరు చేస్తూ 211 జీవో జారీ చేసింది. దీంతో అధికారులు గతేడాది మే 5న గ్రామసభ నిర్వహించి పునరావాస చర్యలను వివరించారు. కుటుంబాలు, నివాసాలు, ఆస్తులకు అందించే పరిహారం, 18 సంవత్సరాలు నిండిన వారికి భత్యం, ఉపాధి, జీవన భృతి వంటి విషయాలపై బాధితులతో చర్చించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తర్వాత ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
శిథిలమైన ఇళ్లలోనే..
బాధితులకు పరిహారం, భత్యం వంటి ఆర్థిక చేయూత, ఇళ్లస్థలాలు చూపక పోవడంతో ఈ వానాకాలం సైతం కష్టాలు తప్పవని ఆందోళన చెందుతున్నారు. శిథిలమైన ఇళ్లకు మరమ్మతులు లేక అవి వానలకు కూలిపోతున్నాయి. ఊరు వదలని కొందరు ఇళ్లపై పాలిథిన్ కవర్లు, టార్పలిన్లు కప్పుకొని వాటిలోనే గడుపుతున్నారు
స్థలం గుర్తించినా..
భైంసా వాసుల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయంలో బాధితులకు ప్రస్తుతానికి తాత్కాలిక ఆవాసాలు కల్పించారు. శాశ్వత పరిష్కారం కోసం సిద్దూరు శివారులోని సర్వే నంబరు 79 ప్రభుత్వ భూమిలో 20 ఎకరాలు కేటాయించారు. దీనికి గ్రామస్థులు సమ్మతించినట్లు అధికారులు తెలిపారు. కాగా గ్రామసభ నివేదికను జిల్లా అధికారులకు పంపి ఏడాది గడుస్తున్నా ఎలాంటి పురోగతి లేదు.
ప్రభుత్వం ఆదేశిస్తే చర్యలు చేపడతాం: కోమల్రెడ్డి, ఆర్డీవో
పునరావాసం కోసం స్థలం గుర్తించాం. గ్రామసభ నివేదికను ఉన్నతాధికారులకు నివేదించాం. తదుపరి ఎలాంటి ఆదేశాలు రాలేదు. ప్రభుత్వం అనుమతిస్తే మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకుని బాధితులను అన్ని విధాలా ఆదుకుంటాం.
గ్రామంలో లెక్కలిలా..
నివాసాలు : 271
నీట మునిగినవి : 240
శిథిలమై కూలినవి : 35
పాక్షికంగా దెబ్బతిన్నవి : 25
జనాభా : 980
గుర్తించిన కుటుంబాలు : 454
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్