తరుణీ శరణం..!
పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు.
మహిళా సంఘాల మద్దతుకు నేతల ప్రయత్నాలు
మండల సమాఖ్య కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యుల సమావేశం
చెన్నూరు పట్టణం, న్యూస్టుడే: పల్లె.. పట్టణం తేడా లేకుండా అన్నిచోట్ల స్వయం సహాయక సంఘాలున్నాయి. వీటిలో వేలాది మంది సభ్యులుగా కొనసాగుతున్నారు. వీరంతా పొదుపు చేయడం.. రుణాలు స్వీకరించడం.. వాయిదాలు చెల్లించడం నెలనెలా సమావేశాలు నిర్వహించడం నిరంతరం చేస్తుంటారు. ఇంతవరకే వీరి పాత్ర పరిమితం అనుకుంటే పొరపాటే.. ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లోనూ వీరి ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. మహిళా సంఘాలను ప్రసన్నం చేసుకుంటే విజయం సాధించడం తథ్యమని రాజకీయ పార్టీల నేతలు భావిస్తుంటారు. అందుకే ఆ దిశగా పావులు కదుపుతుంటారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు వీరివైపు చూస్తున్నాయి.. తరుణుల కరుణ కోసం నేతలు రహస్య మంతనాలు మొదలుపెట్టారు. సంఘాల ప్రతినిధులతో మాటమంతీ చేస్తున్నారు. కరుణించాలని వేడుకుంటున్నారు..
మీ మద్దతు కావాలని..
గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో మహిళా సంఘాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఒక్కో సంఘంలో 10 నుంచి 15 మంది సభ్యులు ఉన్నారు. ఇలా ఒక్కో మండలంలో సుమారు 5వేల నుంచి 10వేల మంది సభ్యులు ఉన్నారు. పురపాలికల్లో కూడా అదే స్థాయిలో ఉండటంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు దృష్టిసారించారు. ఇందుకోసం గ్రామాలు, పట్టణాల్లో వేర్వేరుగా వ్యూహాలను పన్నుతున్నారు. సంఘాల్లో కీలకంగా వ్యవహరించే వారి సహకారంతో సభ్యుల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఓట్లను పొందేందుకు అన్నింటికీ సిద్ధపడుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో ఉన్న నాయకులను రంగంలోకి దింపుతున్నారు. విజయం సాధిస్తే సంఘాల అభివృద్ధికి కృషిచేస్తామని స్పష్టమైన హామీ ఇస్తున్నారు.. సంఘాల సభ్యులను ఒప్పిస్తే ఆ ఇంట్లో ఉన్న ఓట్లన్నీ తమకే వస్తాయని నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాలు పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలో ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 23,01,424 మంది మొత్తం ఓటర్లు ఉండగా అందులో 11,72,832 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఆయా నియోజకవర్గాల్లో గ్రామీణాభివృద్ధి శాఖ, మెప్మా ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,878 గ్రామైక్య సంఘాలు, 67,644 స్వయం సహాయ సంఘాలు, 7,20,115 మంది సభ్యులు కొనసాగుతున్నారు.
ఉమ్మడి జిల్లాలో స్వయం సహాయక సంఘాల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్