జిల్లా.. వైద్య రంగాలకు ప్రాధాన్యం
‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది.
‘ఈనాడు’తో కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ
ఈటీవీ - ఆదిలాబాద్ : ‘‘మొన్నటి వరకు నేనో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలిని. నా విధుల నిర్వహణ తరగతి కేంద్రంగా సాగేది. సమాజ ప్రగతి అనేది స్వప్నంగా కనిపించేది. అందుకే రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా పోటీ చేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ప్రజల ఆశీస్సులతో ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్లమెంటు నియోజకవర్గమే పాఠశాలగా పని చేస్తా‘‘నని కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ స్పష్టం చేశారు. పదేళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఆచరణాత్మకమైన అభివృద్ధిని చేసి చూపిస్తానంటున్న’’ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణతో ‘ఈనాడు’ ముఖాముఖి.
ఈనాడు : ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పాఠశాలలో పని చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీగా విజయం సాధిస్తే రాజకీయాల్లో రాణించగలననే నమ్మకం ఉందా? అయిదేళ్ల వ్యవధిలో మీకంటూ ఎంచుకున్న తొలి ప్రాథామ్యాలు ఏమిటి?
సుగుణ : ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా ఉన్నప్పుడు కూడా ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నాను. ఉపాధ్యాయురాలిగా ఉంటూ ప్రజా ఉద్యమాలకు పూర్తి న్యాయం చేయలేం. అందుకే భర్త భుజంగరావు తోడ్పాటుతో రాజకీయాల్లోకి వచ్చా. ఎంపీగా విజయం సాధించాక విద్యా, వైద్యం, రవాణా రంగాలను మెరుగుపర్చడాన్ని తొలి ప్రాథామ్యాలుగా భావిస్తా. సామాన్యుల అవసరాలు, విద్యావంతుల సూచనలు, మేధావుల ఆలోచనలను రంగరించి ఎంపీ ల్యాడ్స్ నిధులను వెచ్చిస్తా. ప్రగతి అనేది మాటల్లో కాకుండా ఆచరించి చూపించి ఆదిలాబాద్ ఖ్యాతిని ఇనుమడింపజేస్తా.
ఈ : ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన మీరు కాంగ్రెస్ ఎంపీగా గెలిచాక ప్రజా సమస్యలను గుర్తించటం, వాటిని చట్టసభల్లో వినిపించి పరిష్కరించటం సాధ్యమేనంటారా?
సుగుణ : మీరనేది వాస్తవమే కావచ్చు. కానీ మాది వ్యక్తిగత అవసరాల రీత్యా ప్రజలను తప్పుదోవ పట్టించే నైజం కాదు. పారదర్శకంగా పని చేయాలనేది మా అభిమతం. అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల బాధలు గుర్తించామా? లేదా? అనేది ముఖ్యం. పదేళ్ల భాజపా, భారాస పాలనలో ఆదిలాబాద్ లోక్సభ స్థానం ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. ఆదిలాబాద్ - ఆర్మూర్ రైల్వేలైన్ సాధించటం, సిమెంటు పరిశ్రమను తెరిపించటం, కేరళ రాష్ట్రం మాదిరిగా గల్ఫ్ వెళ్లేవారికి ప్రత్యేక విధానం అమలుచేయటం, బీడీ కార్మికుల కుటుంబాల సంక్షేమం కోసం పని చేయటం, వాళ్లు కోరుకుంటే స్వయం ఉపాధిని చూపించటం, అన్ని గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం, మా ఎన్నికల ప్రణాళికలో పొందుపర్చినట్లు పట్టభద్రులైన నిరుద్యోగులకు ఉద్యోగాలిప్పించటం నా కర్తవ్యం.
ఈ : ఉమ్మడి జిల్లాలో ఆదివాసీలు, ప్రధానంగా గిరిజనులు, గిరిజనేతరుల భూ సమస్య ఇబ్బందికరంగా ఉంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా మీ వైఖరి ఏమిటి? ఎలా ఉండబోతోంది?
సుగుణ : ఇది ఉమ్మడి జిల్లా ప్రధాన సమస్య. భాజపా, భారాస ప్రభుత్వాల పదేళ్ల కాలంలో ఆదివాసీలు, ఇతర గిరిజనులు, గిరిజనేతరులకు ఎలాంటి లబ్ధి జరగలేదు. వారికి భిన్నంగా నేను పారదర్శక పనితనంతో ప్రతి ఒక్కరి బాధ వింటా. పరిష్కారం చూపిస్తా. మా పార్టీ విధానాలకు లోబడి గిరిజనులకు సాగుభూమిపై హక్కులు కల్పిస్తాం. గిరిజనేతరుల సమస్యలు పరిష్కరించి గతంలో పహాణీ, నకలు జారీ చేసి పంట రుణాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటా. ఈ విషయమై సీఎం రేవంత్రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క సైతం అనుకూలంగా ఉన్నందున ఏ ఇబ్బందులకు తావులేదు.
ఈ : ఆదిలాబాద్ లోక్సభ స్థానం నుంచి తొలిసారి మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. వారి సమస్యల పట్ల మీ స్పందన ఏమిటి?
సుగుణ : వ్యక్తిగతంగా డబ్బులు సంపాదించాలని, కోట్లకు పడగలెత్తాలనే ఆలోచన నాది కాదు. ఉట్నూరులో మాకంటూ ఉన్న ఓ ఇల్లు చాలు. ఇప్పటికీ ఆదివాసీ, గిరిజన, మైదాన ప్రాంతాల్లో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలను చూస్తుంటే గుండె తరుక్కుపోతోంది. వైద్యం అందక బాలింతలు చనిపోయారని, ఉప్పొంగిన వాగులతో సకాలంలో ఆసుపత్రికి రాలేక కడుపులోనే పిండం చనిపోయిందని విన్నప్పుడు ఆవేదన కలుగుతోంది. సాటి మహిళగా వారికి అండగా నిలవాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చా. మహిళలు అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించగలరు. సహనం, గుండె ధైర్యం కావాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని మహిళలకు అండగా ఉంటా. ఎంపీగా గెలిచాక తప్పకుండా విశ్వవిద్యాలయం తీసుకొస్తా. మహిళల అక్షరాస్యతను పెంచేలా కృషి చేస్తా. బాలికల చదువులు మధ్యలో ఆగకుండా చూస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్