లారీల కొరత.. అన్నదాతకు వెత
కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
దండేపల్లిలో ధాన్యాన్ని తూకం వేస్తున్న హమాలీలు
మంచిర్యాల వ్యవసాయం, న్యూస్టుడే: కొనుగోలు కేంద్రాలనుంచి వెంటవెంట ధాన్యం తరలించకపోవడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కేంద్రాల్లో తూకం వేసినప్పటికీ లారీల కొరతతో తరలింపులో జాప్యమవుతోంది. మిల్లుల్లో ధాన్యాన్ని దించుకోకపోవడంతో రోజుల తరబడి అక్కడే నిరీక్షించేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు. ధాన్యంలో తప్ప, తాలు, విరిగిన నూక వస్తోందనే నెపంతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ దించుకోవడం లేదు. అసలే లారీలు తక్కువగా ఉన్నాయంటే దీనికితోడు మిల్లర్లు వెంటనే దించుకోకపోవడం సమస్యగా మారింది. లారీలురాక కేంద్రాల్లో బస్తాల నిల్వలు పేరుకుపోతున్నాయి. మిల్లులకు లారీలు చేరుకున్న తరువాత ధాన్యం దించుకోకపోవడంతో వెనుకకు రావడం లేదు. దీంతో కేంద్రాల్లో రైతులు పడిగాపులు కాయాల్సి వస్తోంది.
పదిరోజులుగా వరికోతలు ముమ్మరంగా సాగుతుండటంతో కేంద్రాలకు ధాన్యం విరివిగా వస్తోంది. అయితే కేంద్రాల్లో అప్పటికే తూకం వేసిన ధాన్యం నిల్వలు ఉండటంతో ఆరబోసేందుకు స్థలంలేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని హాజీపూర్, భీమారం, జైపూర్, చెన్నూరు, భీమిని, కన్నేపల్లి, లక్షెట్టిపేట, దండేపల్లి తదితర మండలాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. వెంటవెంట ధాన్యం తరలించి మిల్లుల్లో దించుకునేలా అధికారులు చర్యలు తీసుకుంటేనే రైతులకు ప్రయోజనం చేకూరనుంది.
అంతా సాధారణ రకమే..
ధాన్యాన్ని రెండు రకాలుగా విభజించి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ‘ఏ’రకం క్వింటాలుకు రూ.2203 మద్దతు ధర ఉండగా.. సాధారణ రకం ‘బీ’ రకానికి రూ. 2183 మద్దతు ధర ఉంది. అయితే మిల్లుల్లో మొత్తం బీ రకం కిందే తీసుకోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘ఏ’ రకాన్ని కూడా ‘బీ’ కిందే కొనుగోలు చేయడంతో తాము క్వింటాలుకు రూ. 20 నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వెంటవెంటనే తరలించేలా చర్యలు: వాజీద్, జిల్లా పౌరసరఫరాల అధికారి, మంచిర్యాల
జిల్లాలో మిల్లుల సామర్థ్యం తక్కువగా ఉండటంతో ఆలస్యం అవుతోంది. పెద్దపల్లి జిల్లా మిల్లర్లతో మాట్లాడాం. ఇక్కడి మిల్లులకు ట్యాగింగ్ చేసి వెంటవెంటనే తరలించేలా చర్యలు తీసుకుంటాం. మిల్లుల్లో ఆలస్యం చేయకుండా త్వరగా దించుకునేలా చూస్తాం.
వారం రోజులుగా ధాన్యం కేంద్రంలోనే: తిరుపతి, రైతు, వందూర్గూడ
నాకు రెండెకరాల పొలం ఉంది. వారం రోజుల కింద ధాన్యం కేంద్రంలో పోశాను. ఇప్పటికీ తూకం కాలేదు. తేమ రాలేదని ఇప్పటి వరకు తూకం వేస్తలేరు. వారం రోజులుగా ఇక్కడే ఉండాల్సి వస్తోంది. వెంటనే తూకం వేసి ధాన్యం తరలించేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..