తునికాకు సేకరణకు సన్నాహాలు
ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు.
10 నుంచి ప్రారంభం..
బెజ్జూరులో తునికాకు కట్టలు కడుతున్న కుటుంబ సభ్యులు
ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని గిరివెల్లి-ఏ, గిరివెల్లి, కాగజ్నగర్ డివిజన్ పరిధిలోని బెజ్జూరు, సలుగుపల్లి, గూడెం, కర్జెల్లి, చీలపెల్లి, ముత్తంపేట, కొత్తపేట, అనుకోడ, పెంచికల్పేట, లోనవెల్లి, కడంబ, బొంబాయిగూడ, డబ్బా యూనిట్లకు ఇటీవల ఆన్లైన్ టెండర్లు నిర్వహించారు. కడంబా, బొంబాయిగూడ, గిరివెల్లి-ఏ యూనిట్లలో గుత్తేదార్లు ముందుకు రాలేదు.
కాగజ్నగర్, బెజ్జూరు, న్యూస్టుడే
ఏటా వేసవిలో గిరిజనులు,కూలీలకు ఉపాధి లభించే తునికాకు సేకరణ కోసం అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. ఇటీవలి అకాల వర్షాల కారణంగా ఆకు నాణ్యత బాగుందని అధికారులు, గుత్తేదార్లు భావిస్తున్నారు. ఈ ఏడాది కాగజ్నగర్, ఆసిఫాబాద్ డివిజన్ల పరిధిలోని 15 యూనిట్లలో సేకరణకు టెండర్లు పిలిచినప్పటికీ, మూడింటిలో గుత్తేదార్లు ముందుకు రాలేదు.
జిల్లాలోని గిరిజనులు, కూలీలు, రైతులకు వేసవిలో వ్యవసాయ పనులు లేకపోవడంతో తునికాకు సేకరణ ప్రధాన ఆదాయంగా మారుతోంది. దాదాపు అయిదువేల మందికి పైగా ఉపాధి లభిస్తోంది. యాభై ఆకులను ఒక కట్టగా కట్టి కల్లాల్లో విక్రయిస్తారు. అధికారులు కట్టకు రూ.మూడు చొప్పున కొనుగోలుచేసి, ఎండబెట్టి వెయ్యి కట్టలను ఒక స్టాండర్డ్ బ్యాగుగా నింపి గుత్తేదార్లకు అప్పగిస్తారు. ఒక్కొక్క కుటుంబంలో రోజుకు రూ.500 నుంచి రూ.1000 వరకు సంపాదిస్తారు. గుత్తేదార్లు, బీడీ కార్మికులకు సైతం ఉపాధి లభిస్తుంది. ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాలో 12 యూనిట్ల పరిధిలోని 197 కల్లాల్లో ఆకు సేకరణ ఏర్పాట్లు చేసినట్లు డివిజన్ అధికారి తెలిపారు. ఈ నెల చివరి వరకు సేకరణ జరుగనుంది.
కూలీలకు రాయల్టీ డబ్బుల చెల్లింపు
నాలుగేళ్ల పెండింగ్ డబ్బులు గతేడాది ప్రభుత్వం విడుదల చేయగా.. జిల్లాకు దాదాపు రూ.36 కోట్లు వచ్చాయి. తునికాకు సేకరణను బట్టి రాయల్టీ డబ్బులు ప్రభుత్వం కూలీలకు మంజూరు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సారి తునికాకు తగ్గి, ఆ డబ్బులు తగ్గే అవకాశం ఉంది.
పొంచి ఉన్న ముప్పు
ఏప్రిల్ మొదటి వారంలో ఛత్తీస్గడ్ రాష్ట్రం నుంచి జిల్లాలోని చింతలమానేపల్లి, పెంచికల్పేట మండలాలకు వచ్చిన ఏనుగు ఇద్దరు రైతులను బలిగొన్న విషయం తెలిసిందే. రెండ్రోజుల పాటు అటవీ ప్రాంతంలో హల్చల్ సృష్టించి తిరిగి మహారాష్ట్రకు వెళ్లడంతో అధికారులు, జిల్లావాసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణహిత నదిని ఆనుకుని ఒక వైపు మహారాష్ట్ర-ఛత్తీస్గడ్ అభయారణ్యాలు, మరోవైపు కుమురంభీం, మంచిర్యాల జిల్లాల గ్రామాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏనుగుల గుంపు నదికి అటువైపు కేవలం 50-60 కిలోమీటర్ల మేర సంచరిస్తున్నాయని, ఏ క్షణమైనా తెలంగాణ వైపు గుంపు వచ్చే అవకాశం ఉందని అధికారులు అప్రమత్తమయ్యారు. అటవీ ప్రాంతాల్లో ఉండే గ్రామాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు కాగజ్నగర్ సరిహద్దు ప్రాంతం గుండా మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా, ఇంద్రావతి అభయారణ్యాల నుంచి పులుల రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తునికాకు సేకరణపై కూడా ఆ ప్రభావం పడే అవకాశం ఉంది. అధికారులు కాగజ్నగర్ డివిజన్ ప్రాంతాల్లో పులి సంచరిస్తున్న పలు ప్రాంతాల్లో సేకరణ సందర్భంగా కూలీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కల్తీ కల్లును వెంటనే నిర్మూలించాలి
[ 18-05-2024]
జిల్లాలోని పలు గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు జోరుగా కొనసాగుతున్నా సంబంధిత అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని... -
రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
[ 18-05-2024]
తాంసి వ్యవసాయ ఉప మార్కెట్ యార్డులో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని శనివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సందర్శించారు. -
బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
[ 18-05-2024]
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంఘం జిల్లా నాయకుడు బాలసాని శ్రీనివాస్గౌడ్ కోరారు. -
కొనుగోళ్లు చేయరు.. కన్నీళ్లు తుడవరు
[ 18-05-2024]
నిత్యం ఆకాశం కారుమబ్బులతో నిండి ఉండటం, తరచూ వర్షం పడటంతో ధాన్యం రైతులు పంట విక్రయించడానికి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తేమ పేరుతో కేంద్రాల నిర్వాహకులు కొర్రీలు పెట్టడం, మరోవైపు వీడని వర్షంతో ధాన్యాన్ని ఎలా అమ్మాలో, ఎట్లా రక్షించుకోవాలో తెలియని దుస్థితిలో అన్నదాతలున్నారు. -
పెద్దపల్లిపై పెద్ద ఆశలు..
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రధాన ఘట్టం ముగియడంతో విజయంపై ఆయా పార్టీల అభ్యర్థుల అంచనాలు వేసుకుంటున్నారు. పోలింగ్ జరిగిన తర్వాత ఆయా పార్టీల అభ్యర్థులు వారి శ్రేణులతో మాట్లాడి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. -
పునరుద్ధరించుకోకుంటే వడ్డనే..
[ 18-05-2024]
పురపాలికల్లో వ్యాపార లైసెన్సులు పునరుద్ధరించుకోని దుకాణదారులు, వ్యాపారులు ఇకపై భారీగా అపరాధ రుసుము చెల్లించాలి. కొత్త వ్యాపార లైసెన్స్ విధానంలో భాగంగా ఇప్పటికే వ్యాపార అనుమతి విలువలో 25 శాతం అపరాధ రుసుము కట్టాలి. -
అర్హత లేని వైద్యం.. అధికారుల చోద్యం
[ 18-05-2024]
బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఓ మండలానికి చెందిన మహిళ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో హెల్త్ సూపర్వైజర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఎలాంటి అర్హతలు లేని ఆమె భర్త ఇంట్లోనే గత 25 ఏళ్లుగా చిన్నపాటి క్లీనిక్లాంటి వ్యవస్థను నడిపిస్తున్నారు. -
ప్రత్యేక బృందాలకు పట్టుబడ్డారు!
[ 18-05-2024]
జిల్లా వైద్యశాఖ పనితీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు అక్రమదందాకు తెరతీసినా అడ్డుకునే చర్యలు కనిపించడం లేదు. -
ఇప్పుడే ఇలా.. మున్ముందెలా..!
[ 18-05-2024]
భవిష్యత్తు అవసరాల దృష్ట్యా, ఇల్లు కట్టుకోవాలన్న ఉద్దేశంతో పలువురు పట్టణాల్లో స్థిరపడేందుకు మొగ్గు చూపుతున్నారు. జిల్లా కేంద్రంగా నిర్మల్, డివిజన్గా భైంసా, పురపాలికగా ఖానాపూర్ ఏర్పడిన తర్వాత స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంది. -
పనుల మందగమనం..
[ 18-05-2024]
కడెం నారాయణరెడ్డి జలాశయం వరదగేట్ల మరమ్మతు పనులకు వానాకాలం ముప్పు పొంచి ఉంది. మరో 20రోజుల్లో వర్షాకాలం మొదలవనుండగా మరమ్మతు పనులు ఇంకా పూర్తిస్థాయికి చేరుకోనేలేదు. -
నిధుల కోసం నిరీక్షణ
[ 18-05-2024]
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్లోని రైల్వే పైవంతెన, కింది వంతెనల నిర్మాణాల అంశం నిరాదరణకు గురైంది. స్వరాష్ట్రంలో రెండేళ్ల కిందట మళ్లీ తెరపైకి వచ్చింది. -
పంచాయతీ ఎన్నికలవైపు.. అధికారుల చూపు..
[ 18-05-2024]
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ధోనీ వల్లే.. ఇలాంటి విరాట్ను చూస్తున్నాం: సునీల్ గావస్కర్
-
తనలాంటి వ్యక్తిని వైద్య పరీక్షలకు పంపి.. బెయిల్ కోసం ‘లావా’ బాస్ నిర్వాకం
-
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
టీమ్ఇండియా.. ‘అమెరికా’ విమానం ఎక్కేదప్పుడే!
-
హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పు లేదు