రెడ్ అలర్ట్
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు.
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
అత్యధికంగా జన్నారంలో 46.3 డిగ్రీలుగా నమోదు
న్యూస్టుడే, రాంనగర్
వేసవి భగభగలు ప్రజల్ని హడలెత్తిస్తున్నాయి. నాలుగేళ్లలో ఉమ్మడి జిల్లా సగటు ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటలేదు. అలాంటిది ఈ సీజన్లో వరుసగా రెండు రోజుల నుంచి సగటు ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు ఉండగా, జిల్లాలోని పలు ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే భారత వాతావరణ శాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రెడ్అలర్ట్ ప్రకటించడంతో అప్రమత్తంగా ఉండాలంటూ వైద్యులు సూచిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో సోమవారం 44.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో ఇంకా ఎక్కువే నమోదైంది. వారం రోజులుగా వడగాల్పుల తీవ్రత అధికమైంది. ఈ నెల ప్రారంభం నుంచి వరుసగా 45 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. గాలిలో తేమ శాతం తగ్గిపోవడంతో ఎండ తీవ్రత ఎక్కువైంది.
ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటిన ప్రాంతాలు
ఉమ్మడి జిల్లాలోని పాలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటడంతో ఆయా ప్రాంతాలను రెడ్అలర్ట్గా ప్రకటించారు. ఆయా ప్రాంతాల్లోని జనం బయటకు వెళ్లకూడదని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
మంచిర్యాల జిల్లాలోని జన్నారం, హజీపూర్, దండేపల్లి మండలాల్లో 46 డిగ్రీలు దాటగా, లింగాపూర్, తపాలపూర్, తపాలపూర్, భీమిని మండలాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో వాటిని రెడ్జోన్లో చేర్చారు. ఆదిలాబాద్ జిల్లాలోని భీంపూర్ మండలంలోని అర్లి, ఆదిలాబాద్ మండలం పిప్పల్ధరి ప్రాంతాల్లో 45.8 డిగ్రీలు నమోదు కావడంతో ఆయా ప్రాంతాలను రెడ్అలర్ట్గా ప్రకటించారు. కుమురం భీం జిల్లాలో రెబ్బెన, కాగజ్నగర్ మండలాల్లో 46 డిగ్రీలకు పైగా నమోదు కాగా, ఆసిఫాబాద్, జంబుగూడ, తిర్యాణి తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీలు దాటింది. నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్, కడెం, ముజ్గి, ఖానాపూర్, తదితర ప్రాంతాలు రెడ్జోన్లో ఉన్నాయి.
మావలకు చెందిన ఉపాధి కూలీలు తెల్లవారుజామునే లేచి ఉపాధి పనులకు వెళుతున్నారు. తిరిగి 10 గంటల సమయంలో ఇంటికి కాలినడకన వెళ్లలేని పరిస్థితి ఉంది. అప్పటికే ఎండలో పని చేసిన కూలీలు తిరిగి నడిచి ఇళ్లకు వెళ్లడం ఇబ్బందిగా ఉండటంతో పనులు పూర్తయిన తర్వాత ఆటోల్లో ఇళ్లకు వెళుతున్నారు.
గుడిహత్నూర్ మండలం సీతాగొందిలో ఓ రైతు వేరుశనగ పంట వేశారు. మొక్కలను పీకడం, వాటి నుంచి కాయలను తుంచాలంటే ఉదయం నుంచి పంట పొలంలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎండలు ఎక్కువగా ఉండటంతో పొలం పనులకు తెల్లవారుజామునే వెళ్లి మొక్కలను తెంపుతున్నారు. ఎండలో కాయలు తెంపడం కష్టంగా ఉండటంతో వేరుశనగ కాయలను తెంపేందుకు పంట పొలంలోనే నీడ కోసం ప్లాస్టిక్ కవర్లతో కూలీలు చిన్న గుడారాలు ఏర్పాటు చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..