పోలింగ్ కేంద్రం దూరం.. అసౌకర్యాల భారం..
మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా..
ఈనాడు, ఆసిఫాబాద్: మరో ఆరు రోజుల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవస్థల మధ్య ఓట్లేసిన జిల్లావాసులకు మళ్లీ అసౌకర్యాలే ఎదురుకానున్నాయి. చాలా చోట్ల హడావుడిగా పనులను చేస్తున్నా.. అనేక చోట్ల తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లు, మూత్రశాలల పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. ర్యాంపులు సైతం లేవు. పల్లె ప్రజలు నాలుగైదు, కిలోమీటర్ల మేర నడిచి ఓట్లు వేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే పోలింగ్ కేంద్రాలు పెంచినా, సౌకర్యాలు కల్పించేందుకు చేపడుతున్న పనులు మరింత వేగం పెంచాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పోలింగ్ కేంద్రాలలో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం సౌకర్యాల కల్పన పనులు కొనసాగుతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 356 కేంద్రాలు, సిర్పూర్లో 320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 69 కొత్తగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శిథిలమైన పాఠశాల భవనాలకు మరమ్మతులు పూర్తి చేస్తున్నారు. టైల్స్ వేయడం, ఫ్యాన్లు, లైట్లు బిగించడం విద్యుదీకరణ పనులు గడువులోగా పూర్తవుతాయిఅనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని కేంద్రాల్లో ర్యాంపులు లేక దివ్యాంగులకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అనేక పాఠశాలల్లో తాగునీటి కోసం పోలింగ్ జరిగే రోజు తాత్కాలిక ట్యాంకులను ఏర్పాటు చేయనున్నారు. మిషన్ భగీరథ కనెక్షన్లు ఉన్నా.. నీటి సరఫరా కావడం లేదు.
జైనూర్ మండలంలోని దబోలి పోలింగ్ కేంద్రానికి లొద్దిగూడ నుంచి మూడు కిలోమీటర్లు నడిచి వచ్చి ఓటేయాలి. తిర్యాణి మండలం నయకపుగూడ, గోండుగూడ, కొలాంగూడలకు చెందిన ఓటర్లకు గోవెన వద్ద పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. తాగునీరు, మరుగుదొడ్లు ఏవీ ఇక్కడ లేవు. రేకులతో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు.
అడదస్నాపూర్ (211) పోలింగ్ కేంద్రం ఇది. వావుదాం, కొత్త దెమ్మడిగూడ, పాత దెమ్మడిగూడ, మెటీగూడ గ్రామాల్లో 677 మంది ఓటర్లు ఇక్కడ ఓటేస్తారు. ర్యాంప్ ఏర్పాటు చేయలేదు. తిర్యాణి మండలంలోని పంగిడి గ్రామస్థులు నాలుగు కిలోమీటర్ల దూరంలో పంగిడిమాదరకు ఓటేయడానికి వెళ్లారు. కన్నెపల్లి, రాంబాయిగూడ గ్రామస్థులు 7 కిలోమీటర్ల దూరం వెళ్లి మెర్రిగూడలో ఓటు వేయాలి.
కెరమెరి మండలంలోని పరస్వాడ గ్రామానికి చెందిన ప్రజలు ఆరు కిలోమీటర్లు నడిచి కేలీ-బి పోలింగ్ కేంద్రంలో ఓటు వేయాలి. టోకెన్మోవాడ్ కేంద్రంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు. పోలింగ్ సిబ్బంది ఒకరోజు ముందే కేంద్రానికి చేరుకునే నేపథ్యంలో మహిళా సిబ్బంది ఉంటే ఇబ్బంది పడే అవకాశం ఉంది.
లింగాపూర్ మండలంలోని చోర్పల్లి పంచాయతీ పరిధిలోని 12 గ్రామాల ప్రజలందరూ.. దాదాపు 5-6 కిలోమీటర్లు వెళ్లి చోర్పల్లిలో ఓటువేయాల్సి ఉంటుంది. ఒకే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంతో దూరభారం కానుంది.
కాఫ్రి పోలింగ్ కేంద్రం ఇది. టైల్స్, విద్యుదీకరణ, మరుగుదొడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. ర్యాంప్ లేదు. భవనం సైతం శిథిలావస్థలో ఉంది. నీటి సౌకర్యం లేదు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో 383 మంది ఓటర్లు ఉన్నారు.
ఆసిఫాబాద్ మండలం బలాన్పూర్ (216) పోలింగ్ కేంద్రం ఇది. ఇక్కడ భవనం పైకప్పు పూర్తిగా శిథిలమైంది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉన్నా నీటి వసతి లేదు. ఇవి అధ్వానంగా మారాయి. వెంకటాపూర్, పార్వతీగూడ, ఓట్టేఘాట్, సమతుల గుండం (వీరు మూడు కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలి) గ్రామాలలో 528 ఓట్లు ఈ కేంద్రం పరిధిలో ఉన్నాయి. ఓటు వేసే సమయంలో వీరికి అవస్థలు తప్పేలా లేవు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు