విద్యుత్తు ఉపకేంద్రాల్లో సౌర యూనిట్లు
విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి.
ఉమ్మడి జిల్లాలో 13 ప్లాంట్లు
న్యూస్టుడే, ఆదిలాబాద్ వ్యవసాయం: విద్యుత్తు అవసరాలు రోజురోజుకు పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సౌరప్లాంట్ల ఏర్పాటుపై దృష్టి సారించాయి. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలపై సౌర యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో మహిళా సంఘాల సభ్యులు సోలార్ యూనిట్ ఏర్పాటు చేసుకునేందుకు రాయితీ ఇస్తున్నాయి. తాజాగా విద్యుత్తు ఉప కేంద్రాల పరిధిలో సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉంటే ఆయా ప్రాంతాల్లో సౌరవిద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేయాలని కేంద్రం ఆదేశించింది.. ఇందులోభాగంగా ఉమ్మడి జిల్లా మొత్తంలో 13 ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉందని సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులు ప్రతిపాదనలు పంపించారు.
ఉమ్మడి జిల్లాలో విద్యుత్తు అవసరాలు పెరుగుతున్నాయి. నెల వారీగా విద్యుత్తు వినియోగం 150 మిలియన్ యూనిట్లకు పైగా ఉంటోంది. వేసవిలో కోటా కంటే ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తున్నారు. పైగా 200 యూనిట్లు లోపు విద్యుత్తును వినియోగించుకునే వారికి విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నారు. మరో వైపు వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా సరఫరా ఉంది. ఈ నేపథ్యంలో సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహిస్తే.. ప్రయోజనం ఉంటుందని భావించిన కేంద్రం ‘‘పీఎం కుసుమ్’’ పథకం కింద సౌర విద్యుత్తు ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో సౌర విద్యుత్తు ఉత్పత్తికి అనువైన వాతావరణం ఉంది. ఎక్కడ లేని ఉష్ణోగ్రత, ఎండ వేడిమి ఇక్కడ ఉంటుంది. జిల్లా యంత్రాంగం చొరవ చూపితే అడవుల జిల్లా ఆదిలాబాద్ సౌర వెలుగుల జిల్లాగా మారే అవకాశాలు ఉన్నాయి.
రూ.4.25 కోట్ల వ్యయంతో..
సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలం ఉన్న ఉప కేంద్రాల వివరాలతో ప్రతిపాదనలు పంపించారు. ఆయా ఉపకేంద్రాల పరిధిలో సోలార్ యూనిట్ ఏర్పాటు చేసి వీటి నిర్వహణ బాధ్యతలను మహిళా సంఘాల సభ్యులకు అప్పజెప్పాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.4.25 కోట్ల వ్యయంతో ఒక్కో సౌర విద్యుతు ప్లాంటు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో 13 ఉపకేంద్రాల్లో యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన స్థలం ఉందని గుర్తించి ప్రతిపాదనలు పంపించారు. కేంద్రం నుంచి ఆదేశాలు వస్తే ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్తు ప్లాంటు ఏర్పాటు చేస్తారు. ఉత్పత్తయిన విద్యుత్తును గ్రిడ్కు విక్రయించేలా కార్యాచరణ రూపొందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేతకాని మహార్ల సమస్యలను పరిష్కరించాలి
[ 19-05-2024]
నేతకాని మహార్ కులస్తుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నరసయ్య కోరారు. -
గాంధీ విగ్రహం ధ్వంసం
[ 19-05-2024]
మండలంలోని నిపానిలో గుర్తు తెలియని దుండగులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. -
పుచ్చలపల్లి ఆశయ సాధనే ఆయనకు ఘన నివాళి
[ 19-05-2024]
పుచ్చలపల్లి ఆశయాల సాధన కోసం కృషి చేసినప్పుడే ఆయనకు నివాళులర్పించినట్లు అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. -
మార్కెట్ కేంద్రంగా మొబైల్ దొంగతనాలు.. పిల్లలైతే అనుమానించరని..!
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని గాంధీ కూరగాయల మార్కెట్. 44వ జాతీయరహదారిని ఆనుకొని, జిల్లా పోలీసు అధికారి, జిల్లా పాలనాధికారి క్యాంపు కార్యాలయానికి సమీపంలో ఉండే ప్రాంతం. -
ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట
[ 19-05-2024]
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. -
నల్లబజారుకు.. తెల్లబంగారం విత్తనాలు
[ 19-05-2024]
వానాకాలం సీజన్ ప్రారంభమే కాలేదు. అప్పుడే పత్తి విత్తనాలకు కొరత ఏర్పడింది. -
నిర్లక్ష్యానికీ నిదర్శనం
[ 19-05-2024]
ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని అంతా ఊపిరి పీల్చుకుంటుండగా.. ఈ క్రతువులో విజయవంతంగా విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ చేయడం వారిని కలవరానికి గురిచేస్తోంది. -
అధికారుల పనితీరుపై అందరి ఆగ్రహం..
[ 19-05-2024]
అధికారుల తీరుపై జడ్పీ సమావేశంలో సభ్యులందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
నేతల అండ.. అక్రమాల కొండ
[ 19-05-2024]
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక్కటై భూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. -
ఆ సామగ్రి ఏం చేశారు?
[ 19-05-2024]
విద్యుత్తు ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుంటూ జైపూర్ మండలం పెగడపల్లిలోని సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్రం(ఎస్టీపీపీ)లో తన కంటూ ప్రత్యేకత చాటుకుంటోంది. -
నాటు సారాపై సమరం..
[ 19-05-2024]
నాటుసారా (గుడుంబా)తయారీపై ఆబ్కారీశాఖ ఉక్కుపాదం మోపనుంది. విస్తృతంగా దాడులు నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. -
అనర్హులకు అందలం..!
[ 19-05-2024]
కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న డిగ్రీ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. -
ప్రతిభ మెరిసెనిలా...
[ 19-05-2024]
ఎప్సెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల్లో ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ప్రతిభను చాటారు. -
ఇంతకీ ఉద్యోగులు ఎటు వైపు?
[ 19-05-2024]
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలా ఉంటూ క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలులో ఉద్యోగులదే కీలక పాత్ర. -
ఊరు.. అల్లనేరేడుకు పేరు
[ 19-05-2024]
ఆ ఊరు పచ్చదనంతో పులకిస్తోంది. ఇంటికో అల్లనేరేడు చెట్టుతో కళకళలాడుతోంది. సాధారణంగా ఇళ్లల్లో విభిన్న రకాల పూల చెట్లు, పండ్ల చెట్లు ఉంటాయి. -
జొన్నలు కొనుగోలు చేయండి
[ 19-05-2024]
రైతులు పండించిన జొన్నలను ప్రభుత్వ పంట కొనుగోలు కేంద్రంలో కొనుగోలు చేయాలని ఆర్డీవో జివాకర్రెడ్డి అన్నారు. -
బెదిరింపుల కేసులో కౌన్సిలర్ భర్త అరెస్టు
[ 19-05-2024]
పట్టణంలోని వినాయక్నగర్కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కె.అరవింద్ను బెదిరించిన కేసులో ఒకరిని శనివారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ డి.రాజారెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీపై వ్యతిరేక ప్రచారం.. జైలుపాలైన ఉపాధ్యాయుడు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు