వృద్ధులు, దివ్యాంగులకు నేరుగా ఓటేసే అవకాశం
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.
ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి
మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే
‘న్యూస్టుడే’ ముఖాముఖిలో పాలనాధికారి బదావత్ సంతోష్
పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో ఈ నెల 13న నిర్వహించే ఎన్నికల కోసం అన్నీ సిద్ధం చేశామని జిల్లా పాలనాధికారి బదావత్ సంతోష్ అన్నారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు. అర్హులందరూ ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత దృష్ట్యా పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా పాలనాధికారితో ‘న్యూస్టుడే’ బుధవారం ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..
న్యూస్టుడే: ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు?
పాలనాధికారి బదావత్ సంతోష్ : ఓటర్లకు ఇబ్బంది లేకుండా ప్రతి పోలింగ్ కేంద్రంలో టెంట్లు, కుర్చీలు ఏర్పాటు చేస్తున్నాం. అక్కడ తాగునీటి వసతి కల్పిస్తున్నాం. పోలింగ్ కేంద్రాల వద్ద ఏఎన్ఎం లేదా పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వారి వద్ద మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతాం.
న్యూ: పోలింగ్ కేంద్రాలకు ఓటు వేయడానికి వచ్చే వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చంటి పిల్ల తల్లుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు?
పా: పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణులు, చంటి పిల్ల తల్లులను వరుసలో ఉంచకుండా నేరుగా పంపించి ఓటు వేసే అవకాశం కల్పించాం. దివ్యాంగులకు వీల్ఛైర్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీరిని తీసుకెళ్లడానికి ఎన్సీసీ లేదా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహాయకులుగా ఉంటారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రానికి తీసుకురావడానికి ఆటోలు ఏర్పాటు చేస్తాం. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పించాం. ఇందుకోసం జిల్లాలో 330 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరు ఈ నెల 5, 6 తేదీల్లో 304 మందికి ఇంటి వద్దే ఓటు వేసే అవకాశం కల్పించాం.
న్యూ: మీరు ఓటర్లకు ఇచ్చే సందేశం ఏంటి..?
పా : సమీపంలోని పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 13న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు వేసే అవకాశముంది. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజక వర్గాలను మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ముగుస్తుంది. ప్రస్తుతం ఎండల ప్రభావం ఎక్కువగా ఉన్నందున వృద్ధులు, మహిళలు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకోవాలి.
న్యూ: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎన్ని గుర్తించారు. అక్కడ ఎలాంటి భద్రత చర్యలు తీసుకుంటున్నారు.
పా: జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మూడు నియోజక వర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కొన్ని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ పోలింగ్ కేంద్రంలో ఒక్కో సూక్ష్మపరిశీలకులను నియమించాం. పోలింగ్ బూత్ లోపల, బయట వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేస్తాం. అక్కడ పోలింగ్ సరళిని నేరుగా ఎన్నికల సంఘం అధికారులు (ఈసీఐ), జిల్లా పాలనాధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసే కంట్రోల్ రూం నుంచి పరిశీలించే ఏర్పాటు చేశాం. అక్కడ ప్రత్యేక పోలీస్ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.
న్యూ: గత అసెంబ్లీ ఎన్నికల్లో తక్కువ శాతం పోలింగ్ నమోదైన ప్రాంతాలను గుర్తించారా.. ఇప్పుడు అక్కడ పోలింగ్ శాతం పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
పా: అసెంబ్లీ ఎన్నికల్లో మంచిర్యాల, నస్పూరు లాంటి పట్టణాలు, సింగరేణి ప్రాంతాల్లో కొంత పోలింగ్ శాతం తక్కువ నమోదైంది. ఎందుకంటే అక్కడ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లు తొలగించకపోవడం, షిప్టింగ్, రెండు పేర్లు ఉండటం వంటి సమస్యలు గుర్తించాం. ఇప్పుడు ఓటరు జాబితాలో అలాంటి పేర్లను తొలగించాం. పోలింగ్ తక్కువ శాతం నమోదైన ప్రాంతాల్లో కళాజాత బృందాలతో అవగాహన కల్పిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!