కొత్త రైస్ మిల్లులకు త్వరలో పచ్చజెండా?
పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్లో కొత్తగా రైస్ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు
కేసు నమోదుతో జిల్లా కేంద్రం సమీపంలోని పొన్నారి రోడ్డులో మూసి ఉన్న రైస్ మిల్లు
న్యూస్టుడే, ఆదిలాబాద్ పట్టణం: పత్తి పరిశ్రమకు పేరుగాంచిన ఆదిలాబాద్లో కొత్తగా రైస్ మిల్లుల ఏర్పాటు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. జిల్లాలో వరి సాగు అంతగా లేకున్నా ఈ పరిశ్రమలు ఎలా వస్తున్నాయనే సందేహాలు వ్యక్తమవుతుండగా మరోపక్క కొత్తగా అయిదు పరిశ్రమలకు దరఖాస్తులు వచ్చి అధికారుల వద్ద దస్త్రాలు సిద్ధంగా ఉండటం వారం పది రోజుల్లోనే అనుమతులు ఇచ్చేందుకు పావులు కదులుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
పౌరసరఫరాల సంస్థ, పౌర సరఫరాల శాఖలకు సంయుక్తంగా ఈ రైస్ మిల్లులపై అజమాయిషీ ఉంటుంది. వీరి సహకారం సంపూర్ణంగా ఉండటంతోనే రైస్ మిల్లుల అక్రమాలు బయటకు రావడం లేదనే ప్రచారం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు మౌనం వహించడం విమర్శలకు తావిస్తోంది. వరి సాగు కానప్పుడు ఈ రైస్ మిల్లులు ఎందుకు ఉన్నాయనేది ఎవరూ విచారణ చేపట్టడం లేదు. గత అయిదేళ్లలో ఎవరూ వీటిని తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. కేసులు పెట్టిన ఘటనలూ లేవు. సంగారెడ్డి పోలీసు కేసు నమోదుతో అక్రమాలు జరుగుతున్నాయనేది తెలిసొచ్చింది. ఇతర జిల్లాల్లో ప్రభుత్వ పరంగా సేకరించిన వేలాది లారీల ధాన్యాన్ని ఇక్కడికి తెచ్చి డిమాండ్ ఉన్న మహారాష్ట్రకు దర్జాగా పంపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అందుకే పంట లేకున్నా రైస్ మిల్లులు ఏర్పాటైనట్లు తెలుస్తోంది. కొత్తగా ఆదిలాబాద్లోని దస్నాపూర్, రాంపూర్, ఇతర ప్రాంతాల్లో అయిదు మిల్లుల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. వీటికి సంబంధించి భవనాలు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే తొమ్మిది మిల్లుల దందాపైనే అనేక సందేహాలు వ్యక్తమవుతుంటే ఈ కొత్త మిల్లులకు అనుమతులు ఇచ్చి ఏం చేస్తారనే ప్రశ్నలు మొదలయ్యాయి.
పాత పరిశ్రమలే..
జిల్లా కేంద్రం చుట్టు పక్కల ఆయిల్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు పదుల సంఖ్యలో మూతబడి ఉన్నాయి. అవే ఈ మిల్లు వ్యాపారులకు కలిసొస్తున్నాయి. వాటినే అద్దెకు తీసుకొని రైస్ మిల్లులుగా మార్చేస్తున్నారు. మొక్కుబడిగా అక్కడ ధాన్యాన్ని బియ్యంగా మార్చినట్లు చూపెడుతూ తమ పని సాఫీగా కానిస్తున్నారు. కొత్త మిల్లులకు అనుమతులు ఇంకా ఇవ్వలేదని పౌర సరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నా ఉన్నత స్థాయిలోనే పైరవీలు సాగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. అక్రమ దందా కలిసి వస్తుండటంతో కొందరు పత్తి వ్యాపారులు కూడా తమ గోదాంలను మిల్లులుగా మార్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టడం విశేషం. జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారిస్తేనే మిల్లుల బాగోతం బయట పడి అక్రమాలు ఆగుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్
-
శ్రీశైలంలో అభిషేకం టికెట్లపై అదనపు బాదుడు.. భక్తుల జేబుకు చిల్లు
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
-
ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ప్రమాదం.. ‘ఎవరూ బతికున్న ఆనవాళ్లు లేవు’!