logo

భాజపాతోనే దేశానికి, ధర్మానికి రక్షణ

‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే దేశానికి, ధర్మానికి రక్షణ ఉంటుందా? ఒక్కసారి వినండి కాంగ్రెస్‌ ఓటు జిహాద్‌కు పాల్పడుతుంది. మనమంతా ఒక్కటి కావాలి’ అంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు.

Published : 09 May 2024 06:50 IST

గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌

మాట్లాడుతున్న గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, చిత్రంలో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌, ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌

ఇచ్చోడ, న్యూస్‌టుడే : ‘రాహుల్‌ గాంధీ ప్రధాని అయితే దేశానికి, ధర్మానికి రక్షణ ఉంటుందా? ఒక్కసారి వినండి కాంగ్రెస్‌ ఓటు జిహాద్‌కు పాల్పడుతుంది. మనమంతా ఒక్కటి కావాలి’ అంటూ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఇచ్చోడలో నిర్వహించిన రోడ్‌షోలో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్‌తో కలిసి పాల్గొన్నారు. రాముని గుడి ఎవరు కట్టారో, ఆర్టికల్‌ 370 ఎవరు తీసేశారో, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు చేసిన వారికే నా ఓటు అనే ఆలోచన రావాలి. గోరక్షణ ఎవరు చేస్తారో వారికే నా ఓటు అనుకోవాలి. తెలంగాణలో 12 సీట్లు గెలుస్తున్నాం. అందులో ఆదిలాబాద్‌ ఉంది. కేసీఆర్‌ రాజ్యం ఖతమైంది. ఇప్పుడు కాంగ్రెస్‌ రాజ్యం వచ్చింది. ఒక్కో కార్యకర్త తనతోపాటు 100 మందితో ఓటు వేయిస్తాననే సంకల్పం తీసుకోవాలి. వేరే పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని భాజపాకు ఓటు వేయాలన్నారు. నియోజకవర్గంతోపాటు ఆదిలాబాద్‌ నుంచి కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌, జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌, తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని