ఉద్ధృతంగా ఇంటింటి ప్రచారం
ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు.
ప్రతి ఓటరును కలిసేలా ప్రధాన పార్టీల ప్రణాళిక
చెన్నూరు గ్రామీణం, న్యూస్టుడే: ఎన్నికల పోలింగ్కు సమయం దగ్గరపడుతోంది. ప్రచారానికి ఇంకా రెండు రోజులే మిగిలి ఉండటంతో ప్రధాన పార్టీలు కీలక నేతలు తమ ప్రచారపంథాను పూర్తిగా మార్చివేశారు. ఇన్ని రోజులు సభలు, సమావేశాలు నిర్వహించి ఒక్క దగ్గరే ఓటర్లను కలిసిన నేతలు బూత్స్థాయిలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులకు బాధ్యతలు అప్పగించి ఇంటింటికి వెళ్లి ఓటరును నేరుగా కలిసేలా దిశానిర్దేశం చేశారు. ప్రతీబూత్లో మెజార్టీ ఓట్లు పొందడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. గెలుపే లక్ష్యంగా బూత్స్థాయి నాయకులు అన్నీతామై అభ్యర్థుల తరఫున ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. దీంతో పల్లెలు, పట్టణాల్లో ఎక్కడ చూసిన ప్రధాన పార్టీల ప్రచారం హోరెత్తుతోంది. జిల్లాలోని మూడు నియోజకవర్గాలో ప్రధాన పార్టీల క్షేత్రస్థాయి ప్రచారతీరుపై కథనం.
అధినేత బస్సుయాత్రతో శ్రేణుల్లో జోష్
బూత్స్థాయి ప్రచారం తీరును పార్టీ కార్యాలయంలో సమీక్షించుకుంటున్న భారాస శ్రేణులు
మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర పార్టీ నేతలు, శ్రేణుల్లో జోష్ నింపింది. జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో సమావేశానికి హాజరుకావడంతో పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. పురపాలికలు, మండలాల వారీగా బూత్స్థాయిలో పర్యటిస్తూ బూత్స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేతలు సూచించిన విధంగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రత్యర్థుల బలహీనతలు వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బూత్స్థాయిలో చేపట్టిన ప్రచారంపై సమీక్ష చేసుకుంటున్నారు.
లక్ష్యం నిర్ధేశించి.. బాధ్యతలు అప్పగించి
చెన్నూరులోని పద్మనగర్లో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు
కొన్ని రోజులుగా సభలు, సమావేశాల నిర్వహణ ద్వారా కాంగ్రెస్ కీలక నేతలు ఓటర్లు కలిశారు. రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమలు తీరు వివరించడంతోపాటు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కలిగే ప్రయోజనాలను చెబుతూ ఓటర్లకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఉదయాన్నే ఉపాధిహామీ పని స్థలాలకు వెళ్లి వందలాది మంది కూలీలను ఓకే చోట కలిశారు. అయితే పోలింగ్ సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో నేరుగా ఓటర్లను కలిసే కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బూత్ల వారీగా పార్టీ శ్రేణులకు బాధ్యతలను అప్పగించి నేరుగా ఓటర్లను కలుస్తున్నారు. వారికి ముందుగానే లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. ఓటర్ల నాడిని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రచారానికి మరో మూడు రోజులే సమయం మిగిలి ఉండటంతో వీలైనంత ఎక్కువ మంది ఓటర్లను కలిసేందుకు క్షేత్రస్థాయిలో శ్రమిస్తున్నారు.
బూత్ స్థాయికే ప్రాధాన్యం
చెన్నూరులో ప్రచారం చేస్తున్న భాజపా నేతలు, కార్యకర్తలు
జిల్లాలోని భాజపా శ్రేణులు ఎన్నికల ప్రచారంలో ఆది నుంచి ప్రత్యర్థుల కంటే ముందుగానే ఉన్నట్లు తెలుస్తోంది. సభలు, సమావేశాల నిర్వహణ కంటే బూత్స్థాయి ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. అభ్యర్థిని ప్రకటించగానే నేతల ఆదేశాలతో క్షేత్రస్థాయి ప్రచారాన్ని కార్యకర్తలు చేపట్టారు. గతం నుంచి బూత్స్థాయిలో బాధ్యతలు నిర్వర్తిస్తున్న నాయకులు, కార్యకర్తలు గ్రామాల వారీగా పర్యటిస్తూ ఓటర్లకు కలిశారు. ఇక పట్టణాల్లో చేరికలతోపాటు ఇంటింటా ప్రచారాన్ని చేపట్టారు. నేతలు, నాయకులందరూ కలిసి పట్టణాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి అనుబంధ సంఘాల నాయకులు మద్దతుగా నిలుస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తప్పిపోయిన చిన్నారులను చైల్డ్ లైన్కు అప్పగింత
[ 20-05-2024]
జిల్లా కేంద్రమైన అదిలాబాదులోని పంజాబ్ కూడలిలో ధనలక్ష్మి లాడ్జీ వద్ద ఏడుస్తూ ఉన్న ఇద్దరు తప్పిపోయిన చిన్నారులను స్పెషల్ బ్రాంచ్ పోలీస్ కానిస్టేబుల్ చిందం దేవిదాస్ చైల్డ్ లైన్కు అప్పగించారు. -
ప్రశాంతంగా టెట్
[ 20-05-2024]
ఉపాధ్యయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం మొదటిరోజు ప్రశాంతంగా ముగిసింది. -
ఏఎన్ఎంలకు పనిభారాన్ని తగ్గించాలి
[ 20-05-2024]
జనాభా ప్రాతిపదికన రెండో ఏఎన్ఎంలను నియమించి పని భారాన్ని తగ్గించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ డిమాండ్ చేశారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
[ 20-05-2024]
ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. -
విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
[ 20-05-2024]
భాజపా నాయకులు విమర్శలు చేసేముందు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆ పార్టీ జిల్లా నాయకురాలు అన్నపూర్ణ సూచించారు. -
గంగపుత్ర శివాలయంలో మహా అన్నదానం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలోని గంగపుత్ర శివాలయంలో సోమవారం మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. -
పిడుగుల కాలం.. అన్నదాతల అప్రమత్తం
[ 20-05-2024]
ఎవరైనా కలచివేసే వార్త చెబితే పిడుగులాంటి వార్త చెప్పావు అని అంటుంటారు. ఇంత తీవ్రమైన పదం వాడారంటే ఆ పిడుగుకున్న శక్తి అలాంటిది మరి. తన శక్తిని కోల్పోయేందుకు అది ఆకాశం నుంచి నేల పైకి దూసుకొస్తుంది. మనుషుల ప్రాణాలను హరిస్తున్నాయి. -
అర్హులు ఎందరో.. వినియోగించుకుంది కొందరే
[ 20-05-2024]
వందశాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఓటుహక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఆ అవకాశం వినియోగించుకునేలా ఎన్నికల సంఘం హోం ఓటింగ్కు అవకాశం కల్పించినా.. కొద్ది మందే ఆ సదుపాయం వినియోగించుకున్నారు. -
ఫలరాజం.. ప్రాణాంతకం
[ 20-05-2024]
మనం నిత్య జీవితంలో తినే మామిడి, తదితర పండ్ల పరిస్థితి ‘మేడి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు’ అన్న చందంగా మారింది. అధికాదాయం కోసం కొందరు వ్యాపారులు విషపూరిత రసాయనాలు వాడి కాయలను మాగబెట్టి మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. -
పంట బీమాపై ఆశలు
[ 20-05-2024]
ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్లో అమలు చేయనున్న పంటల బీమా పథకంపై వ్యవసాయశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
సమస్యలే విస్తరణ
[ 20-05-2024]
జిల్లాలో మరో జాతీయ రహదారిగా పేరొందిన బేల రోడ్డు విస్తరణ పనుల్లో జాప్యం ప్రజలకు శాపంగా మారింది. టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభం కాకపోవడం.. రాబోయేది వర్షాకాలం కావడంతో మరింత ఆలస్యం కానుంది. -
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యే స్ఫూర్తి
[ 20-05-2024]
ప్రజా ఉద్యమాలకు సుందరయ్యను స్ఫూర్తిగా తీసుకోవాలని, ఆయన ఆశయాలను సాధిస్తేనే ఘన నివాళులు అర్పించినట్లవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతిని ఆదివారం స్థానిక సుందరయ్యభవన్లో నిర్వహించారు. -
వానాకాలం సాగు ప్రణాళిక సిద్ధం!
[ 20-05-2024]
వానాకాలం సాగు ప్రణాళికను జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధం చేశారు. జిల్లాలో ఈసారి అన్నిరకాల పంటలు సుమారు 4.60 లక్షల ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. -
అవకాశం ‘దూరం’ అవుతోంది
[ 20-05-2024]
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్).. ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారందరికీ ఇది తొలిమెట్టు. ఇందులో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలవుతుంది. ఇప్పటికే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు సైతం పదోన్నతుల కోసం ఈ పరీక్ష రాయాల్సి ఉంది. -
ఓ వైపు పూల సోయగం.. మరో దిక్కు నిర్లక్ష్యం
[ 20-05-2024]
జిల్లా కేంద్రంలో నలుదిక్కుల శివారు వరకు రహదారి వెడల్పు చేసి మధ్యలో విభాగినిలు నిర్మించారు. హరితహారంలో భాగంగా రోడ్లకు ఇరువైపులా, విభాగినుల మధ్య మొక్కలు నాటారు. -
నిధుల లేమితో సతమతం
[ 20-05-2024]
ప్రజల ఆరోగ్యంగా ఉండటానికి కాలువల్లో ఉన్న మురుగు ఎత్తిపారేస్తూ.. రోడ్లన్నీ శుభ్రం చేస్తూ.. ఇంటింటా చెత్తను సేకరిస్తూ.. మొక్కలను కంటికి రెప్పలా కాపాడుతూ పచ్చదనం కోసం పరితపిస్తున్న కార్మికుల బతుకులు మారడం లేదు. -
ఖరీఫ్ సాగుకు సిద్ధం
[ 20-05-2024]
-
నిధుల లేమి.. అభివృద్ధి కునారిల్లి
[ 20-05-2024]
పల్లెలకు ప్రధాన వనరులుగా భావించే నిధులను ప్రభుత్వం గత ఆరునెలలుగా నిలిపివేసింది. ఆదాయం లేక పంచాయతీలు సిబ్బందికి జీతాలు, విద్యుత్తు బకాయిల చెల్లింపు, పారిశుద్ధ్య పనులు చేసేందుకు అవస్థలు పడుతున్నాయి. -
సింగరేణిలో ఎందుకీ వివక్ష?
[ 20-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటే ఎంతో కొంత లాభం జరగాలి కదా.. నష్టం ఎందుకు అంటారా.. సింగరేణి క్లరికల్ సిబ్బందికి ఆర్థికంగానే కాకుండా ఇతరత్రా నష్టం వాటిల్లుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం: ఏపీ స్పెషాల్టీ ఆస్పత్రుల సంఘం
-
హీరో- హార్లే భాగస్వామ్యంలో మరిన్ని మోటార్ సైకిల్స్
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM