అక్రమార్కులను వదిలేదే లే!
జనసేన అధినేత పవన్కల్యాణ్కు అనకాపల్లి జిల్లా వాసులు సోమవారం ఘన స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేటలోని భూ అక్రమాలు పరిశీలించడానికి ఆయన సోమవారం విచ్చేశారు.
పవన్ కల్యాణ్ హెచ్చరిక
అడుగడుగునా జన నీరాజనం
వాహనంపై జన సేనాని
ర్యాలీలో కోలాహలం
అనకాపల్లి/ పట్టణం, గ్రామీణం, కశింకోట, న్యూస్టుడే: జనసేన అధినేత పవన్కల్యాణ్కు అనకాపల్లి జిల్లా వాసులు సోమవారం ఘన స్వాగతం పలికారు. వారాహి విజయయాత్రలో భాగంగా కశింకోట మండలం విస్సన్నపేటలోని భూ అక్రమాలు పరిశీలించడానికి ఆయన సోమవారం విచ్చేశారు. అగనంపూడి టోల్గేటు నుంచి మారేడుపూడి, గొల్లవానిపాలెం, అనకాపల్లి జాతీయ రహదారి, కొత్తూరు, కశింకోట ప్రాంతాల్లో ప్రజలు రహదారిపైకి వచ్చారు. మహిళలు పవన్కల్యాణ్కు హారతులు ఇచ్చారు. జనసైనికులు బైకుల ర్యాలీతో సందడి వాతావరణం నెలకొంది.
ఆర్చిపైకి ఎక్కి ఆర్తిగా..
పూలవర్షం కురిపిస్తూ..
కశింకోట మండలం బయ్యవరం, విస్సన్నపేట గ్రామాల్లో పవన్కల్యాణ్ రాకకోసం రహదారులపై చాలాసేపు వేచి ఉన్న ప్రజలు ఆయన రాగానే పూలవర్షం కురిపించారు. మహిళలు, గ్రామస్థులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. పవన్కల్యాణ్ కిందకు దిగి వివాదాస్పద ప్రాంతాన్ని పరిశీలించడానికి ప్రయత్నించగా జన సందోహంతో వీలుకాలేదు. దీంతో వాహనంపై నుంచే మీడియాతో మాట్లాడి అనంతరం ఇక్కడికి వచ్చిన వారికి అభివాదం చేశారు. విస్సన్నపేట భూములను పరిశీలించడానికి వచ్చిన పవన్కల్యాణ్ మీడియా వాహనం ముందు మాట్లాడుతూ కొండపై మంత్రి గుడివాడ అమర్నాథ్ నిర్మించిన గెస్ట్హౌస్ ఇదేనంటూ చూపించడంతో జనసైనికులు కేరింతలు కొట్టారు. భూ అక్రమాలు చేసే ఎవరినీ వదిలిపెట్టేది లేదంటూ ఆయన హెచ్చరించారు. మీడియాతో పవన్కల్యాణ్ మాట్లాడుతుండగా పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెళ్లి భూములను పరిశీలించారు. అక్రమ తవ్వకాలు, కొండమీద నిర్మించిన గెస్ట్హౌస్ను పరిశీలించారు. భూ ఆక్రమణల్లో మంత్రి గుడివాడ అమర్నాథ్ అనుచరుల ప్రమేయం తదితరాలను పవన్కల్యాణ్కు జనసేన పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి దూలం గోపి వివరించారు. లోకాయుక్తలో తాను వేసిన కేసు వివరాలు వెల్లడించారు. నియోజకవర్గ అధ్యక్షులు పరుచూరి భాస్కరరావు, నాయకులు కోన తాతారావు, టి.శివశంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయ్కుమార్, పంచకర్ల రమేష్, గడసాల అప్పారావు, అంగా ప్రశాంతి, పీవీఎస్ఎన్ రాజు, గంగులయ్య, శివదత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పలువురు వినతిపత్రాలు అందజేశారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం తెరిపించాలని, ఫార్మా కంపెనీల కాలుష్యం నుంచి రక్షణ కల్పించాలని అగనంపూడిలో వినతిపత్రం అందజేశారు. తాడి గ్రామం తరలింపు పవన్కల్యాణ్తోనే సాధ్యం అంటూ నినాదాలు చేశారు.
అభిమానులంతే.. తగ్గరంతే..
జాతీయ పతాకంతో వీర మహిళ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్