logo

భారత్‌ ఆదివాసీ పార్టీ అభ్యర్థుల జాబితా విడుదల

భారత్‌ ఆదివాసీ పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజబాబు పాడేరులో విడుదల చేశారు.

Published : 16 Apr 2024 02:08 IST

మాట్లాడుతున్న భారత్‌ ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు  రాజబాబు తదితరులు

పాడేరు, న్యూస్‌టుడే: భారత్‌ ఆదివాసీ పార్టీ పార్లమెంట్‌, అసెంబ్లీ అభ్యర్థుల మొదటి జాబితాను సోమవారం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మొట్టడం రాజబాబు పాడేరులో విడుదల చేశారు. ఆ పార్టీ నుంచి అరకు ఎంపీగా మొట్టడం రాజబాబు పోటీ చేస్తున్నారు. ఏలూరు ఎంపీగా తెల్లం రవిప్రసాద్‌, అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా డాక్టర్‌ పి.రామకృష్ణ, కురుపాం ఎమ్మెల్యేగా అడ్డాకుల గీతారాణి, పోలవరం ఎమ్మెల్యేగా మొడియం శ్రీనివాసరావులు పోటీ చేస్తున్నారని ఆయన వెల్లడించారు.  కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్‌ పి.రామకృష్ణ, రాష్ట్ర కోశాధికారి మర్రిచెట్టు పోతురాజు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని