రానున్నది తెదేపా ప్రభుత్వమే
కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ నుంచి అరకులోయ వరకు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణ్కుమార్ తెలిపారు.
కాశీపట్నంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కిడారి
అనంతగిరి/గ్రామీణం, న్యూస్టుడే: కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులతో అనంతగిరి మండలంలోని చిలకలగెడ్డ నుంచి అరకులోయ వరకు మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు మాజీ మంత్రి, తెదేపా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణ్కుమార్ తెలిపారు. మండలంలోని కాశీపట్నం గ్రామంలో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. రానున్నది కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే చంద్రబాబునాయుడిని సీఎం చేయాలన్నారు. ఈ ర్యాలీకి తెదేపా, భాజపా, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అరకు పార్లమెంట్, అసెంబ్లీలో కూటమి జెండాను ఎగురవేయటమే లక్ష్యంగా ప్రతిఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు తెదేపా కార్యకర్తలంతా భాజపా, జనసేన శ్రేణులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. తెదేపా నాయకులు లక్ష్మణరావు, గన్నారావు, సన్నిబాబు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!