జోరందుకున్న నామినేషన్లు
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది.
అరకు పార్లమెంటు స్థానానికి నామినేషను వేస్తున్న మాజీ ఎంపీ కొత్తపల్లి గీతతో కేంద్ర మంత్రి
పాడేరు, న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరందుకుంది. అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం అయిదు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్ తెలిపారు. వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం రెండు సెట్ల నామినేషన్లు వేశారు. రేగం చాణక్య వైకాపా తరఫున డమ్మీ నామినేషన్ వేశారు. స్వతంత్ర అభ్యర్థి మొగలి చంద్రకళ, బీఎస్పీ అభ్యర్థి లకే రాజారావు మరొక సెట్ నామపత్రాలు సమర్పించారు.
పాడేరులో భారీ ర్యాలీ నిర్వహించిన తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు
పాడేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ భావన తెలిపారు. పాడేరు అసెంబ్లీ తెదేపా అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, బీఎస్పీ తరఫున సుర్ల అప్పారావు, కాంగ్రెస్ పార్టీ నుంచి సతక బుల్లిబాబు, స్వతంత్ర అభ్యర్థి వంతల సుబ్బారావు నామపత్రాలు సమర్పించారు.
నామినేషన్లు వేసేందుకు భారీ ర్యాలీలతో అభ్యర్థులు రావడంతో పాడేరులో సందడి వాతావరణం నెలకొంది. పాడేరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి ముందుగా మోదకొండమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బీ-ఫాంను అమ్మవారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు చేశారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులు కుమ్మరిపుట్టులోని ఈశ్వరి నివాసం నుంచి ర్యాలీగా వచ్చారు. అరకులోయ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం, పార్టీ కార్యకర్తలు అరకు నుంచి హుకుంపేట వరకు భారీ ర్యాలీగా చేరుకున్నారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, జడ్పీ అధ్యక్షురాలు సుభద్ర, మత్స్యలింగం సతీమణి హాజరయ్యారు. నామినేషన్ల ప్రక్రియలో ఎక్కడా ఎలాంటి సంఘటనలు జరగకుండా సెబ్ సీఐ హిమగిరి, సీఐ ప్రవీణ్కుమార్, ఎస్సైలు, సిబ్బంది బందోబస్తు ఏర్పాటు చేశారు.
అరకు రిటర్నింగ్ అధికారి అభిషేక్కు నామినేషన్ పత్రాలు సమర్పిస్తున్న వైకాపా అభ్యర్థి రేగం మత్స్యలింగం, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్సీ రవిభాబు, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సుభద్ర
నాలుగో రోజు 13 ...
జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం 13 నామినేషన్లు దాఖలైనట్టు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత తెలిపారు.. అరకు అసెంబ్లీకి ఐదు, పాడేరు అసెంబ్లీకి నాలుగు, రంపచోడవరం అసెంబ్లీకి నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు.
స్కామ్ల ప్రభుత్వాన్ని సాగనంపండి
పార్వతీపురం పట్టణంలో నామినేషన్ వేయడానికి ర్యాలీగా వస్తున్న కూటమి అభ్యర్థిని గీత, నాయకులు
పార్వతీపురం, న్యూస్టుడే: అరకు పార్లమెంటరీ స్థానానికి ఐదుగురు నామపత్రాలు దాఖలు చేశారు. అరకు స్థానానికి భాజపా అభ్యర్థిగా కొత్తపల్లి గీత జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్కు నామపత్రాలు అందజేశారు. ఈమెతో పాటు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే పాల్గొన్నారు. గీత మాట్లాడుతూ స్కామ్ల వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందన్నారు. పార్వతీపురం అసెంబ్లీ కూటమి అభ్యర్థి విజయచంద్ర, భాజపా జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ జగదీశ్, భాజపా, జనసేన, తెదేపా నాయకులు ఎస్.ఉమామహేశ్వరరావు, ఎ.మోహనరావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం
[ 03-05-2024]
‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. -
పండుటాకులపై పగ
[ 03-05-2024]
సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
[ 03-05-2024]
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం
[ 03-05-2024]
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
చిమ్మచీకట్లో డోలీమోత
[ 03-05-2024]
పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. -
ఊపిరితీసిన వాగులు
[ 03-05-2024]
మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.
తాజా వార్తలు (Latest News)
-
చెలరేగిన స్టార్క్.. ముంబయిపై కోల్కతా విజయం
-
119 కోట్లకు టెలికాం సబ్స్క్రైబర్లు.. జియోకు ఎంతమందంటే?
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు