గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు.
సమావేశంలో మాట్లాడుతున్న పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు, దారెల సర్పంచి పాండురంగస్వామి
పాడేరు, న్యూస్టుడే: పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. గురువారం గిడ్డి ఈశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ముందుగా పాడేరు టికెట్ను రమేష్నాయుడికి కేటాయించారు. ఆ తర్వాత పరిణామాలతో ఈశ్వరికి టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందేనన్నారు. గిరిజనులకు ప్రాణవాయువు లాంటి జీఓ నం 3ను తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తాము గెలిచాక జీవో నంబర్ 3 పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా అరాచక పాలన అంతం చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎన్నికలకు పది రోజులే సమయం ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సర్పంచి పాండురంగస్వామి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు గంటలు ఆలస్యంగా.. వందేభారత్ ఎక్స్ప్రెస్
[ 17-05-2024]
విశాఖ నుంచి సికింద్రా బాద్కు గురువారం ఉదయం 5.45 గంటలకు బయలుదేరాల్సిన వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు (20833) ఐదు గంటలు ఆలస్యమయింది. -
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?
[ 17-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో అభ్యర్థుల గెలుపు, ఓటములపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. బెట్టింగులు అంటే ఎక్కువగా క్రికెట్ బెట్టింగులు గుర్తుకొస్తాయి. -
నిధులివ్వకుండా నిర్మాణాలెలా..!
[ 17-05-2024]
ఎలమంచిలిలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులన్నీ పూర్తిచేశారు. పెయింటింగ్ పనులే చేయాల్సి ఉంది. రంగులు వేసే గుత్తేదారును ఆ పని పూర్తిచేయమంటే ఎన్నికలు అయ్యాక చేస్తాం.. ముందుచేస్తే బిల్లులు అవుతాయన్న నమ్మకం లేదని నిలిపేశారు. -
నిర్వహణ పనులపై నిర్లక్ష్యం
[ 17-05-2024]
ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల ఉమ్మడి నిర్వహణలోని మాచ్ఖండ్ జల విద్యుత్కేంద్రంలో సివిల్ డివిజన్లో పనులు నత్తనడకన నడుస్తున్నాయి. జలాశయం రక్షణ కోసం చేపట్టాల్సిన మరమ్మతు పనులను సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. -
దైవదర్శనానికి వెళ్తూ.. తిరిగిరాని లోకాలకు..
[ 17-05-2024]
దైవదర్శనానికి వెళ్తున్న దంపతులపై విధి పగబట్టింది. రోడ్డు ప్రమాదం రూపంలో భర్తను బలి తీసుకుంది. భార్యను ఆసుపత్రిపాల్జేసింది. -
2,08,329 మంది వజ్రాయుధాన్ని వదిలేశారు
[ 17-05-2024]
ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఓట్ల పండగలో చాలా మంది ఓటు హక్కు వినియోగించుకోలేదు. జిల్లాలో 12,89,371 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో ఈ సారి 10,81,042 మంది ఓటు వేయగా, 208329 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోలేదు. -
విశాఖ ఉక్కును.. వెంటాడుతున్న కష్టాలు!
[ 17-05-2024]
అదానీ గంగవరం పోర్టు వైఖరి, జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం వెరసి విశాఖ ఉక్కుకు కష్టాలు తెచ్చిపెట్టింది. నెల రోజులపైగా పోర్టు నుంచి ముడిసరకు అందకపోవడంతో ఉక్కులో ఉత్పత్తులు భారీగా పడిపోయాయి. -
ఆందోళన పెంచిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్
[ 17-05-2024]
చట్టాలు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా ఉండకూడదని, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇలాగే ఉందని జై భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. -
మాంచానమ్మ జాతర ప్రారంభం
[ 17-05-2024]
పెదార్కూరు ఆదివాసుల ఇలవేల్పు అయిన మాంచానమ్మ జాతర గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని అలంకరించిన తరవాత జాతర ప్రారంభించారు. -
బీసీజీ టీకా తప్పనిసరి
[ 17-05-2024]
టీబీ బాధితుల కుటుంబసభ్యులు తప్పనిసరిగా బీసీజీ టీకా వేసుకోవాలని టీబీ రాష్ట్ర బృంద ప్రొఫెసర్ రవీందర్ పేర్కొన్నారు. -
మోసం కేసులో రేవిడి సర్పంచి కుమారుడి అరెస్టు
[ 17-05-2024]
పద్మనాభం మండలం రేవిడి గ్రామంలో జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సేకరించిన భూములకు ఇచ్చిన పరిహారాన్ని పక్కదారి పట్టించిన కేసులో రేవిడి సర్పంచ్ కోన సూరి అప్పయ్యమ్మ కుమారుడు కోన రమణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. -
ఏపీఎల్ వేలంలో నితీశ్కుమార్రెడ్డికి అత్యధిక ధర
[ 17-05-2024]
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) కోసం విశాఖ నగరంలోని ఓ హోటల్లో గురువారం క్రీడాకారులకు వేలం నిర్వహించారు. ఇందులో నితీశ్కుమార్రెడ్డిని అత్యధికంగా రూ.15.60 లక్షలకు మర్లిన్ గోదావరి టైటాన్స్ ఫ్రాంఛైజీ సొంతం చేసుకుంది. -
విద్యుదాఘాతంతో ఈపీడీసీఎల్ కార్మికుడి మృతి
[ 17-05-2024]
సబ్బవరం మండలం గాలిభీమవరం రెవెన్యూ పరిధిలోని ఓ బొగ్గు కంపెనీలోని ట్రాన్స్ఫార్మర్ ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈపీడీసీఎల్ కార్మికుడు (హెల్పర్) మృతి చెందాడు. -
పాడేరులో పాగా వేసేదెవరు?
[ 17-05-2024]
మన్యంలోని ఆదివాసీ గిరిజనులు ఈసారి ఎన్నికల్లో ఎవరిని అందలం ఎక్కిస్తారు.. నువ్వా.. నేనా అంటూ సాగిన సార్వత్రిక ఎన్నికల పోరులో అడవి బిడ్డల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది. -
ఫలించిన ప్రణాళిక
[ 17-05-2024]
మావోయిస్టు ప్రభావిత అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల అధికారులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. -
మోదకొండమ్మ ఉత్సవాలపై ఆంక్షలు
[ 17-05-2024]
రాష్ట్ర గిరిజన జాతర పాడేరు మోదకొండమ్మ అమ్మవారి ఉత్సవాలకు పోలీసులు ఎన్నికల ఆంక్షలు విధిస్తున్నారు. ఈ నెల 19 నుంచి 21వ తేదీ వరకు జాతర నిర్వహించాలని నిర్ణయించారు. -
క్షయ నివారణకు చర్యలు
[ 17-05-2024]
మన్యంలో క్షయ వ్యాధి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి సాధన పేర్కొన్నారు. -
నిరంతరం అప్రమత్తంగా ఉండండి
[ 17-05-2024]
పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాట్లు చేసిన స్ట్రాంగ్ రూమ్లను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత గురువారం తనిఖీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు
-
అజ్ఞాతంలోకి మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి సోదరులు
-
వైకాపా నేతల నుంచి ప్రాణహాని.. రక్షణ కల్పించాలని ఎస్పీని కోరిన సుధాకర్
-
స్టార్లు ఉన్నంత మాత్రాన సినిమా హిట్టవుతుందని చెప్పలేం: సెహ్వాగ్