logo

గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి

పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్‌నాయుడు తెలిపారు.

Published : 03 May 2024 02:25 IST

సమావేశంలో మాట్లాడుతున్న పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి, తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్‌నాయుడు, దారెల సర్పంచి పాండురంగస్వామి

పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్‌నాయుడు తెలిపారు. గురువారం గిడ్డి ఈశ్వరిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించారు. ముందుగా పాడేరు టికెట్‌ను రమేష్‌నాయుడికి కేటాయించారు. ఆ తర్వాత పరిణామాలతో ఈశ్వరికి టికెట్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వీరిద్దరూ మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిందేనన్నారు. గిరిజనులకు ప్రాణవాయువు లాంటి జీఓ నం 3ను తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వమేనని పేర్కొన్నారు. తాము గెలిచాక జీవో నంబర్‌ 3 పునరుద్ధరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వైకాపా అరాచక పాలన అంతం చేయడానికి కూటమి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఎన్నికలకు పది రోజులే సమయం ఉన్నందున నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి కూటమి మ్యానిఫెస్టోను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. సర్పంచి పాండురంగస్వామి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని