చేతకాక చేతులెత్తేశారు...
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు.
అద్దెలు అయినా చెల్లించాలంటూ నిరసన తెలుపుతున్న దేవీపట్నం ముంపు గ్రామాల నిర్వాసితులు (పాత చిత్రం)
పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితుల పట్ల ప్రభుత్వం గడిచిన అయిదేళ్లలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎన్నికల ముందు ఎన్నో హామీ లిచ్చిన జగన్ ఆ తర్వాత వీరిని పట్టించుకున్న పాపాన పోలేదు. పరిహారం చెల్లించలేదు. పునరావాస కాలనీలను పూర్తిచేయలేదు.
న్యూస్టుడే, కూనవరం, దేవీపట్నం, చింతూరు
దేవీపట్నం మండలంలోని నిర్వాసితులు ఇళ్లు, పొలాలు అన్నీ వదిలి గోదావరి వరద భయంతో బయటకు వచ్చి దాదాపు మూడేళ్లు గడిచినా పునరావాస కాలనీ నిర్మాణ పనులు నేటికీ పూర్తవకపోవడంతో ఇళ్ల అద్దెలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారంతా చెల్లా చెదురుగా ఏజెన్సీ మైదాన ప్రాంతాల్లో ఉంటున్నామని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు నిర్వాసితులు ప్రతిఏటా గోదావరి వరదల్లో మునిగిపోతున్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నిర్వాసితుడిని కూడా పునరావాస కాలనీకి తరలించలేదున తాజాగా వరదల సమయంలో పరామర్శకు వచ్చిన ముఖ్యమంత్రి కేంద్రం నిధులివ్వకుంటే తానేమి చేయలేనంటూ చేతులెత్తేశారు. దీంతో నిర్వాసితులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
అయిదేళ్లు గడిపేశారు..
ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన వైకాపా నిర్వాసితులను నిండా ముంచింది. అటు గోదావరి వరదలు.. ఇటు ప్రాజెక్టు నిర్మాణం పూర్తికాక నిర్వాసితులు ఇబ్బందులు పడుతున్నారు. పరిహారం చెల్లించకుండానే ప్రభుత్వం అయిదేళ్లు గడిపేసింది. పునరావాసం కల్పించడంలోనూ పూర్తిగా విఫలమైంది. వరదల సమయంలో సీఎం వచ్చి నిర్వాసితులకు ఇవ్వడానికి డబ్బులు లేవన చెప్పడం హాస్యాస్పదం.
పాయం వెంకయ్య, పెదార్కూర్, కూనవరం మండలం
హామీలే.. ఆచరణ లేదు..
గత ఎన్నికల్లో నిర్వాసితులకు ఎన్నో హామీలిచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్కటంటే ఒక్కటి అమలు చేయలేకపోయింది. నిర్వాసితుల సమస్యలపై పలు పోరాటాలు చేసినా ప్రభుతానికి చీమ కుట్టినట్లు లేదు. అందుకే ఈ ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెప్తాం.
కొమరం పెంటయ్య, మాజీ ఎంపీపీ, కూనవరం
కాలనీలు పూర్తిచేయలేదు
వైకాపా ప్రభుత్వం నిర్వాసితులకు ఎలాంటి న్యాయం చేయలేదు. అనేకసార్లు అధికారులు సర్వేలు చేసినా ఒక్క రైతుకు పైసా విదల్చలేదు. నిర్వాసితులకు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా సొంత నిర్ణయాలతో కాలం గడిపేసింది. పునరావాస కాలనీలు నేటికి పూర్తి కాలేదు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎవరికీ ప్యాకేజీ అందలేదు.
ఇల్లా చిన్నారెడ్డి, చింతూరు
ఏడాదైనా వసతులు లేవు
మేము పునరావాస కాలనీకి వచ్చి ఏడాది దాటింది. మా ఊరంతా రాలేదు. వరదలకు భయపడి మేము తొమ్మిది మంది మాత్రమే వచ్చాం. ఇప్పటివరకు ఇక్కడ రోడ్లు వేయలేదు. ఇంటికి కుళాయి నీరు రావడం లేదు. మరుగుదొడ్డి పూర్తి చేయకుండానే వదిలేశారు. గుడి, బడి, అంగన్వాడీలు కట్టలేదు. రేషన్ కోసం ప్రతి నెలా మా స్వగ్రామం వెళుతున్నాము.
అందెల సూర్యకాంతం, భైరవపట్నంలోని జీడిగుప్ప నిర్వాసితురాలు
ఇళ్లు పూర్తిచేస్తే అద్దె సమస్యలు తీరతాయి
గంగాలమ్మ ఆలయం సమీపంలో దేవీపట్నం నిర్వాసితులకు నిర్మిస్తున్న ఇళ్లలో సుమారు 350 ఇళ్లు చివరి దశకు వచ్చాయి. కనీసం వాటిని పూర్తిచేస్తే కొన్ని కుటుంబాలకైనా అద్దె సమస్యలు తీరతాయి. కాలనీకి వచ్చిన ప్రతి అధికారికి ఈ విషయం మొరపెట్టుకున్నా ఫలితం లేదు. నిర్వాసితులకు కేటాయించిన తొమ్మిది ఎకరాల స్థల వివాదం త్వరితగతిన పరిష్కరించకపోతే వంద కుటుంబాలకు పైగా నిర్వాసితులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
బుర్రే ఆనందరావు, దేవీపట్నం
అద్దెలు చెల్లించలేకపోతున్నాం
పోలవరం ప్రాజెక్టు పుణ్యమా అంటూ ముంపు గ్రామాలను ఖాళీచేసి దాదాపు మూడేళ్లవుతున్నా ఇళ్ల నిర్మాణాలు పూర్తవలేదు. ప్రతినెలా వేల రూపాయిల అద్దెలు చెల్లించలేకపోతున్నాం. ఉపాధి సైతం పూర్తిస్థాయిలో లేకపోవడంతో క్రమేపీ అద్దెలు చెల్లించడం మరింత కష్టంగా మారింది.
గేదెల పెదసుబ్బారావు, దేవీపట్నం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రక్షకభటులపై కక్ష
[ 03-05-2024]
ఉద్యోగులకు అది చేస్తాం.. ఇది చేస్తాం అని మాటలు చెప్పి.. వారికి తీరని అన్యాయం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్కే దక్కుతుంది. నెత్తిన టోపీతో శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం శ్రమించేవారికి జగన్ పెద్ద టోపీయే పెట్టారు. -
ఎండలో పండుటాకులు.. బ్యాంకులో పడిగాపులు.. నరకం చూపించారు...!
[ 03-05-2024]
పింఛను సొమ్ము తీసుకునేందుకు వృద్ధులు, దివ్యాంగుల అవస్థలు వర్ణనాతీతం. అధిక శాతం మంది పింఛనుదారుల బ్యాంక్ అకౌంట్లు యాక్టివ్లో లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
పథకాలను ప్రజలకు చేరువ చేస్తాం
[ 03-05-2024]
‘ఐదేళ్ల వైకాపా పాలనలో గిరిజన చట్టాలు నిర్వీర్యమయ్యాయి. బతుకులు అతలాకుతలమయ్యాయి. గిరిజనులకు ప్రాణవాయువులాంటి జీవో నం.3ను అటకెక్కించారు. నిరుపేదలకు అందాల్సిన రాయితీ పథకాలను రద్దు చేశారు. పల్లెల్లో ప్రజలు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. -
పండుటాకులపై పగ
[ 03-05-2024]
సామాజిక పింఛన్లపైనే ఆధారపడి జీవిస్తున్న వృద్ధులు, దివ్యాంగులు పింఛను సొమ్ము పొందేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. -
వైకాపా సమర్పించు ‘అస్తవ్యస్త విస్తరణ’
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లా రంగస్థల కళాకారులకు పుట్టినిల్లు. జిల్లాలోని వైకాపాకు చెందిన పాలకులు ఈ కళాకారుల సృజనను తలదన్నేలా చాలా సిత్రాలే చేశారు. పట్టణాలనే నాటకరంగంగా మార్చేసుకుని తెగ నటించేశారు. -
గిడ్డి ఈశ్వరి విజయానికి కృషి
[ 03-05-2024]
పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేష్నాయుడు తెలిపారు. -
ఎక్కడికెళ్లినా రోడ్ల దుర్గతే చెబుతున్నారు!
[ 03-05-2024]
అనకాపల్లి జిల్లాకు చెందిన మేధావులతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి గురువారం వేపగుంటలో సమావేశం నిర్వహించారు. -
భౌతిక దాడులు రాజ్యాంగ విరుద్ధం
[ 03-05-2024]
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం భారత రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తోందని రాజ్యాంగ పరిరక్షణ వేదిక కన్వీనర్, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. -
ప్రజా సంక్షేమం కూటమితోనే సాధ్యం
[ 03-05-2024]
రాష్ట్రం అభివృద్ధి కావాలంటే వైకాపా ప్రభుత్వాన్ని గద్దెదించాలని పేట కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
ఓటరు స్లిప్పులు వచ్చేశాయి..
[ 03-05-2024]
ఈనెల 13న నిర్వహించనున్న ఎన్నికకు సంబంధించి ఓటర్లకు స్లిప్పులు వచ్చేశాయి. -
జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడి దాడి
[ 03-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న జనసేన కార్యకర్తపై వైకాపా నాయకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. -
చిమ్మచీకట్లో డోలీమోత
[ 03-05-2024]
పాలకుల నిర్లక్ష్యం గిరిజనులకు శాపంగా మారింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు వంతెన నిర్మించాలని వేడుకున్నా, ఆమెకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదు. -
ఊపిరితీసిన వాగులు
[ 03-05-2024]
మన్యంలో పర్యటక ప్రాంతాలను చూద్దామని సరదాగా వచ్చిన వారికి తీరని విషాదం మిగిలింది. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృత్యువాత పడటం ఆయా కుటుంబాల వారిని శోకసంద్రంలో ముంచింది.
తాజా వార్తలు (Latest News)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన