కార్మికులపై జగన్ కాఠిన్యం
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు.
చింతపల్లి, రంపచోడవరం, అరకులోయ పట్టణం, న్యూస్టుడే
వైకాపా పాలనలో కార్మిక రంగాలన్నీ పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కార్మికులు లేనిదే ఏ పనీ జరగదు. అటువంటి కీలకమైన ఈ రంగానికి భరోసా కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి కనీస వేతనం అమలు కావడం లేదు. వీరికి ప్రభుత్వం తరపున అందుతున్నది కేవలం నెలకు రూ. రెండు వేల నుంచి రూ.మూడు వేలు మాత్రమే. పారిశుధ్ధ్య కార్మికులకు నెలకు రూ.18 వేల వేతనం ఇస్తామని జగన్ ప్రకటించారు. కానీ ఇది అమలుకు నోచుకోలేదు. వీరికి కేవలం రూ.6 వేలే ఇస్తున్నారు. అది కూడా పంచాయతీ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. అంగన్వాడీ సిబ్బంది తమ వేతనాన్ని పెంచాలంటూ అనేక ఆందోళనలు చేసినా వారికి కంటి తుడుపు హామీలు ఇచ్చి అమలు చేయడం మానేశారు. ఆశా కార్యకర్తలు, సీహెచ్డబ్ల్యూలు, ఏపీఎఫ్డీసీ కార్మికులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో కాంట్రాక్టు, పొరుగు సేవల కింద ఉద్యోగాలు చేస్తున్న వారెవరికీ సమాన పనికి సమాన వేతనం అమలు కావడం లేదు. వీరంతా శ్రమదోపిడీకి గురవుతూనే ఉన్నారు.
ఇసుకపై ఆంక్షలతో ఇబ్బందులు
-ఉగ్గిరాల భాస్కరరావు, యార్లమామిడి
గత ప్రభుత్వం ఇసుక పుష్కలంగా లబించేది. జగన్ అధికారం చేపట్టిన తర్వాత ఐదేళ్లలో ఇసుక సరఫరాలో తీవ్ర ఆంక్షలు విధించడంతో కొన్నాళ్లపాటు భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దీంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారు
-కారం సింహాచలం, మాజీ సర్పంచి, బందపల్లి
వైకాపా అధికారం చేపట్టాక భవన నిర్మాణ, మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు వీరికి ఎంతో మేలు చేశారు. . కార్మికుల సంక్షేమాన్ని అమలు చేయాలంటే చంద్రబాబుతోనే సాధ్యం.
సమ్మె హామీలు నెరవేర్చలే
- గంగరాజు, పర్యటక శాఖ ఒప్పంద, పొరుగుసేవల కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు
అరకులోయ పట్టణం: జీతాల పెంపు, కార్మికుల క్రమబద్ధీకరణ, పదోన్నతుల కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాం. ఎమ్మెల్సీ రవిబాబు, ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ, అధికారులు సమస్యల పరిష్కారానికి హామీలిచ్చారు. అయినా దినసరి, మ్యాన్పవర్ కార్మికుల సమస్యలు పరిష్కరించలేదు. క్రమబద్ధీకరణ, పదోన్నతులపై న్యాయం జరగలేదు.
ప్రభుత్వం స్పందించడం లేదు
- బోనంగి చిన్నయ్యపడాల్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు వీటిని అమలు చేయడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవలు, ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నా వీరికి పనికి తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. వీరంతా కార్మికులుగానే మిగిలిపోతున్నారు. ఎన్ని ఆందోళనలు చేసినా ప్రభుత్వం స్పందించడం లేదు.
ఆర్థిక ఇబ్బందులు
- పాంగి ధనుంజై, కార్మిక సంఘం నేత
ప్రభుత్వం కార్మికుల శ్రమ దోపిడీకి పాల్పడుతోంది. పనికి తగ్గ వేతనాన్ని చెల్లించకపోవడంతో కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రస్తుతం గ్యాస్, పెట్రోలు, నిత్యావసరాల ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం కష్టంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఇంకా నెలకు రూ. ఆరు వేల వేతనంతో నెలంతా కుటుంబంతో ఎలా బతకాలో ప్రభుత్వమే చెప్పాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరకు పర్యటకానికి కొత్తరూపు
[ 21-05-2024]
ఆంధ్రాఊటీ అరకులోయలో ఐదు యూనిట్ల పరిధిలోని పర్యటకశాఖ అతిథిగృహాల మరమ్మతులకు అధికారులు చర్యలు చేపట్టారు. -
ఎన్నికలనాటి ప్రేమ ఇప్పుడేమైంది..!
[ 21-05-2024]
వైకాపా సర్కారు అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అభివృద్ధి పనుల జోలికే పోని నేతలు ఎన్నికల ముందు హడావిడి పనులకు శ్రీకారం చుట్టారు. రోడ్లపై గుంతలు పూడ్చేస్తామని, రహదారులను బాగుచేస్తామని, పట్టణాలను సుందరీకరిస్తామని, సెంట్రల్ లైటింగ్తో వెలుగులు నింపుతామని ఎక్కడలేని ప్రేమను ఒలకబోసి ఓటర్లకు గాలం వేశారు. -
కరకలో తవ్వకాలపై కన్నెర్ర
[ 21-05-2024]
అత్యంత విలువైన వైఢూర్యాలు (అలెక్స్ రకం రంగురాళ్లు) లభించే గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీ చుట్టూరా గస్తీ పటిష్ఠం చేశారు. -
అప్రకటిత కోతలు.. అదనపు వాతలు
[ 21-05-2024]
ఎండలు మండిపోతే లోడ్ రిలీఫ్ పేరుతో కరెంటు సరఫరా నిలిపేస్తున్నారు.. వర్షం కురిసినా.. గాలి వీచినా అంతకంటే వేగంగా విద్యుత్తు సరఫరా ఆపేస్తున్నారు. -
చంద్రబాబు సీఎం కావడం ఖాయం
[ 21-05-2024]
రాబోయేది కూటమి ప్రభుత్వమేనని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. -
ఇసుక అక్రమ రవాణాపై చర్యలు
[ 21-05-2024]
అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ విజయసునీత హెచ్చరించారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 21-05-2024]
రంపచోడవరంలో ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత పేర్కొన్నారు. -
ఈవీఎంల భద్రతలో అప్రమత్తం
[ 21-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అరకులోయ, పాడేరు అసెంబ్లీ నియోజకవర్గాలకు సబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూంల వద్ద పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశామని ఎస్పీ తుహిన్ సిన్హా, రిటర్నింగ్ అధికారులు వి.అభిషేక్, భావన తెలిపారు. -
ఐటీఐ శిక్షణతో ఉపాధి అవకాశాలు
[ 21-05-2024]
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సాధించాలంటే అర్హత ఒక్కటే సరిపోదు. -
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
[ 21-05-2024]
వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా ర్యాలీలు, ఊరేగింపులతోపాటు బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధమని రంపచోడవరం సీఐ వాసా వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. -
మూడు రోజులు.. 112 కిలోల చందనం
[ 21-05-2024]
సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయంలో సోమవారం మూడవ రోజు చందనం అరగదీత కార్యక్రమం కొనసాగింది. -
తెలంగాణ ఈసెట్లో విద్యార్థి సత్తా
[ 21-05-2024]
పరవాడ మండలం వాడచీపురుపల్లి పంచాయతీ పరిధి దళాయిపాలెం గ్రామానికి చెందిన ఆలవెల్లి ఖ్యాతీశ్వర్ సోమవారం విడుదలైన తెలంగాణ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష (టీఎస్ ఈసెట్) మెటలర్జికల్ విభాగంలో మొదటి ర్యాంకు సాధించాడు. -
24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
[ 21-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఏడు కేంద్రాల్లో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి పి.బ్రహ్మాజీరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం
-
బ్రిజ్ భూషణ్కు షాక్.. అభియోగాలు నమోదు
-
సందేశ్ఖాలీకి వెళ్తాను: మమతా బెనర్జీ
-
రూ.3.22 కోట్లు కాజేసిన అమెజాన్ ఉద్యోగి అరెస్ట్
-
ఏసీపీ నివాసంలో 12 గంటలుగా సోదాలు.. బయట పడుతున్న నోట్ల కట్టలు
-
విమానం ఢీకొని.. ఫ్లెమింగోలు మృతి