మండుతున్న ఎండలు... తాగునీటికి అవస్థలు
వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
ముంచంగిపుట్టు, న్యూస్టుడే: వేసవి తీవ్రత పెరుగుతోంది. గ్రామాల్లో నీటి ఎద్దడి ఎక్కువ అవుతోంది. బోర్లు, బావులు అడుగంటిపోతున్నాయి. రూ.లక్షల ఖర్చుతో నిర్మించిన నీటి పథకాలు నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అరకులోయ నియోజకవర్గంలోని 630 గ్రామాల్లో కనీస నీటి వసతులు లేక ప్రజలు కలుషిత ఊట గెడ్డలు, పొలాల చెంతన ఉన్న కుండీల్లో నీటిపై ఆధారపడుతున్నారు
ముంచంగిపుట్టు మండలంలోని లక్ష్మీపురం, వనుగమ్మ, బుంగాపుట్టు, దారెల, పెదగుడ, కుమడ, బూసీపుట్టు పంచాయతీల్లోని గ్రామాలకు నీటి పథకాలు మంజూరైనా నిర్మాణాలు పూర్తి చేయలేదు. బూసీపుట్టు పంచాయతీలోని సంతవీధి, సరియాపల్లి, సుల్తాన్పుట్టు, ఖమ్మరిగొయ్యి గ్రామాల్లో ప్రజలు కలుషిత ఊటనీరు వినియోగిస్తున్నారు. మైళ్ల దూరం వెళ్లి పొలాల నుంచి ఊటనీరు తీసుకొస్తున్నారు. బాబుసాల, కుమడ, బరడ, లక్ష్మీపురం, రంగబయలు, బుంగాపుట్టు పంచాయతీల్లోని గిరిజనులకు గెడ్డల నీరే దిక్కవుతోంది.
మత్స్యగెడ్డ పరివాహకంలో ఉన్న పెదగుడ, పనసపుట్టు, దారెల, ఏనుగురాయి, సుజనకోట పంచాయతీల్లోని గ్రామాల్లోనూ నీటి ఎద్దడి ఏర్పడి గిరిజనులు గెడ్డ ఒడ్డున బురదనీరు వినియోగిస్తున్నారు. ఈ నీటి వినియోగం వల్ల వ్యాధులు ప్రబలుతాయని ఆందోళన చెందుతున్నారు. రక్షిత మంచినీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదీ జీవం.. ఎక్కడా వైవిధ్యం!
[ 22-05-2024]
మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతోంది. భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. -
నిర్మించి నెల.. పెచ్చులూడిందిలా..
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వంలో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడమే గగనమైంది. చేసిన కొద్ది పనులూ నాణ్యతగా చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. -
కొనలేం.. తినలేం
[ 22-05-2024]
వేసవిలో కమ్మటి సువాసనతో అందరి నోరూరించే మామిడిపండు ఈ ఏడాది ప్రియమైపోయింది. దిగుబడులు భారీగా తగ్గడం, ఇతర ప్రాంతాల్లో డిమాండుతో సామాన్యులు మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా పోయింది. -
ఇతరులను అనుమతించొద్దు
[ 22-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తం
[ 22-05-2024]
పెదబయలు పోలీసుస్టేషన్ను ఎస్పీ తుహిన్ సిన్హా, సీఐ రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై మనోజ్కుమార్, సిబ్బందితో సమావేశమయ్యారు. -
తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ స్వగ్రామంలో సోదాలు
[ 22-05-2024]
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, రోలుగుంటలోని బంధువుల ఇళ్లలో మంగళవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. -
సజావుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
[ 22-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి.పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎంపీ వైద్యంతో రోగి మృతిపై విచారణ
[ 22-05-2024]
ఆర్.ఎం.పి. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతిచెందాడనే ఆరోపణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. -
అంగన్వాడీల నేత తులసి హఠాన్మరణం
[ 22-05-2024]
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి (45) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈమె అంగన్వాడీల సమస్యలపై గత ఇరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?
-
ఔటర్ చుట్టూ.. ఔరా అనిపించేలా
-
ఓటుకు ఊపిరిలూదిన ఊళ్లు.. 748 కేంద్రాల్లో 91 శాతానికి పైగా నమోదు
-
అతని తీరుతో అంతటా శోకం.. పోలీసు అధికారి వ్యవహార శైలిపై విమర్శలు
-
తల్లికి కుమార్తె నుంచి భరణం.. ఇందౌర్ కోర్టు తీర్పు