వైకాపా పాలనలో కానరాని అభివృద్ధి
అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్షో నిర్వహించారు.
సినీ నటి, భాజపా నేత ఖుష్బూ
అరకులోయ, న్యూస్టుడే: అరకు అభివృద్ధి చెందాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని సినీ నటి, భాజపా నేత ఖుష్బూ పిలుపునిచ్చారు. అరకులోయలో మంగళవారం కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కొత్తపల్లి గీత, పాంగి రాజారావులతో కలిసి ఆమె రోడ్షో నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. తాను కెప్టెన్ నాగార్జున సినిమా షూటింగ్ సమయంలో 1986లో అరకు వచ్చానని గుర్తు చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు వచ్చానన్నారు. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడూ అలాగే ఉందన్నారు. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదని విమర్శించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఎక్కడా రహదారులు వేయలేదన్నారు. ఒక్క పేద వ్యక్తికి కూడా ఇల్లు ఇవ్వలేదని పేర్కొన్నారు.
2035 వరకు తాను ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని వైకాపా అధినేత జగన్ చెబుతున్నారని, ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఆయన ఏం చేశారని ప్రశ్నించారు. జగన్ కామెడీ తప్ప అభివృద్ధి చేయడం లేదని ఎద్దేవా చేశారు. అరకులోయను ఊటీ, కొడైకెనాల్ తరహాలో అభివృద్ధి చేయవచ్చన్నారు. పర్యటక రంగం బాగుపడితే గిరి యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వికసిత్ భారత్ కార్యక్రమంతో దేశాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారన్నారు. అరకు ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడితేనే రాష్ట్రానికి మంచి రోజులు వస్తాయన్నారు. వైకాపా దుర్మార్గపు పాలనకు ప్రజలు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అరకు లోక్సభ స్థానంలో విజయం సాధించి ప్రధాని మోదీకి బహుమతిగా ఇద్దామన్నారు. భవిష్యత్తు తరాల కోసమే తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్ పనిచేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు మాట్లాడుతూ.. జీవో నంబర్ 3 పునరుద్ధరణ జరగాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు. అప్పుడే గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. భాజపా నాయకులు మాధవ్, తెదేపా నాయకులు దొన్నుదొర, బాకూరి వెంకటరమణ, లక్ష్మి, నీరజ, పాండురంగస్వామి, అమ్మన్న, సాయిరాం, భాజపా నాయకులు రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏదీ జీవం.. ఎక్కడా వైవిధ్యం!
[ 22-05-2024]
మానవ తప్పిదాలతో కాలక్రమంలో జీవవైవిధ్యం దెబ్బతింటోంది. ఆధునిక జీవన శైలిలో పర్యావరణం కాలుష్యానికి గురవుతోంది. భూగోళం వేడెక్కిపోతోంది. దీంతో జీవవైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. -
నిర్మించి నెల.. పెచ్చులూడిందిలా..
[ 22-05-2024]
వైకాపా ప్రభుత్వంలో మన్యం ప్రాంతంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడమే గగనమైంది. చేసిన కొద్ది పనులూ నాణ్యతగా చేపట్టకపోవడంతో అధ్వానంగా తయారవుతున్నాయి. -
కొనలేం.. తినలేం
[ 22-05-2024]
వేసవిలో కమ్మటి సువాసనతో అందరి నోరూరించే మామిడిపండు ఈ ఏడాది ప్రియమైపోయింది. దిగుబడులు భారీగా తగ్గడం, ఇతర ప్రాంతాల్లో డిమాండుతో సామాన్యులు మనస్ఫూర్తిగా తినే పరిస్థితి లేకుండా పోయింది. -
ఇతరులను అనుమతించొద్దు
[ 22-05-2024]
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్రూంల వద్దకు ఇతరులను అనుమతించొద్దని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ తుహిన్ సిన్హా పేర్కొన్నారు. -
ఓట్ల లెక్కింపు వరకు అప్రమత్తం
[ 22-05-2024]
పెదబయలు పోలీసుస్టేషన్ను ఎస్పీ తుహిన్ సిన్హా, సీఐ రమేష్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సై మనోజ్కుమార్, సిబ్బందితో సమావేశమయ్యారు. -
తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ స్వగ్రామంలో సోదాలు
[ 22-05-2024]
హైదరాబాద్లో అవినీతి నిరోధక శాఖకు చిక్కిన తెలంగాణ సీసీఎస్ డీఎస్పీ ఉమామహేశ్వరరావు స్వగ్రామమైన బుచ్చెయ్యపేట మండలం బంగారుమెట్ట, రోలుగుంటలోని బంధువుల ఇళ్లలో మంగళవారం ఉన్నతాధికారులు తనిఖీలు చేశారు. -
సజావుగా పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు
[ 22-05-2024]
జిల్లాలో ఈనెల 24 నుంచి పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారిణి బి.పద్మావతి సంబంధిత అధికారులను ఆదేశించారు. -
ఆర్ఎంపీ వైద్యంతో రోగి మృతిపై విచారణ
[ 22-05-2024]
ఆర్.ఎం.పి. వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా ఓ రోగి మృతిచెందాడనే ఆరోపణపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. -
అంగన్వాడీల నేత తులసి హఠాన్మరణం
[ 22-05-2024]
అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షురాలు వై.తులసి (45) మంగళవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఈమె అంగన్వాడీల సమస్యలపై గత ఇరవై ఏళ్లుగా పోరాటాలు చేస్తూ ఎన్నో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దయచేసి వినండి మీ రైలు రద్దయింది!.. ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్న రైల్వే శాఖ
-
మూడోకన్ను మూసుకుపోయింది.. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించని పోలీసులు
-
పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక రైలు
-
‘హార్ట్ బ్రేకింగ్ ఫొటో ఆఫ్ ది మ్యాచ్’.. దిగాలుగా హైదరాబాద్ బ్యాటర్
-
సరదా శ్రుతిమించితే... మృత్యు ఒడికి..!
-
అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల వ్యయం.. రూ.300 కోట్లు ?