logo

సముచిత స్థానం కల్పిస్తాం

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పాడేరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేశ్‌నాయుడు మంగళవారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 01 May 2024 02:09 IST

చింతపల్లి, పాడేరు, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను పాడేరుకు చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి కిల్లు వెంకట రమేశ్‌నాయుడు మంగళవారం ఉండవల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. వెంకటరమేశ్‌నాయుడుకు తొలుత పాడేరు అసెంబ్లీ నియోజవర్గ తెదేపా టికెట్‌ కేటాయించారు. ఆ తరువాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో గిడ్డి ఈశ్వరికి టికెట్‌ ఇచ్చారు. పార్టీ సూచనతో వెంకట రమేశ్‌నాయుడు తన నామినేషన్‌ ఉపసంహరించుకున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం లోకేశ్‌ను కలిశారు. కూటమి అధికారంలోకి రాగానే తనకు సముచిత స్థానం కల్పిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. కూటమి అభ్యర్థి విజయానికి తమవంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు