గందరగోళం.. పోస్టల్ బ్యాలెట్
నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
పోస్టల్ బ్యాలెట్ కోరుతూ ఫాం-12 అందిస్తున్న ఉద్యోగులు
రంపచోడవరం, న్యూస్టుడే: నాలుగు రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్న పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రంపచోడవరం నియోజకవర్గానికి చెందిన వందల మంది ఉద్యోగుల ఓట్లు రాజమహేంద్రవరం, అమలాపురంలలో ఉన్నాయని, అక్కడకు వెళ్లి వేయాలని అధికారులు చెప్పడంతో ఆదివారం కొందరు అక్కడికి వెళ్లారు. అక్కడ కూడా తమ ఓట్లు లేవని చెప్పడంతో సోమవారం మళ్లీ రంపచోడవరం చెప్పారు. అయితే ఇక్కడా ఓట్లు చెబుతున్నారని, తమ ఓటు ఎక్కడ వినియోగించుకోవాలని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గంగదరగోళ పరిస్థితుల్లో దాదాపు వంద మంది ఉద్యోగులు ఓటు వేయకుండా వెనుదిరిగారు. ఈ సమయంలో పోస్టల్ బ్యాలెట్ తీరును పరిశీలించేందుకు వచ్చిన కలెక్టర్ విజయ సునీత, రిటర్నింగ్ అధికారి ప్రశాంత్కుమార్ల దృష్టికి ఉద్యోగులు తమ సమస్యలు తీసుకెళ్లారు. ఫాం-12 తీసుకుని అందరితో ఓటు వేయించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. దీంతో కొంతమంది ఉద్యోగులు బ్యాలెట్ వేశారు. అప్పటికే సమయం అయిపోవడంతో ఉద్యోగులంతా బుధవారం రావాల్సిన పరిస్థితి తలెత్తింది.
పాడేరు, న్యూస్టుడే: పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో మంగళవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో ఇతర జిల్లాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు పడిగాపులు తప్పలేదు. ఇతర జిల్లాలకు సంబంధించిన బూత్ ఒక్కటే పెట్టడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో కనీస మౌలిక వసతులు కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర జిల్లాలకు సంబంధించి మరో రెండు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. 12డి దరఖాస్తు చేసినప్పటికీ తమ పేర్లు పోలింగ్ కేంద్రంలో లేకపోవడంతో కొంతమంది ఓటేయకుండా వెనక్కి వెళ్లిపోయారు.
అరకులోయ: అరకులోయ కంఠబంసుగుడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. 987 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అరకులోయ అసెంబ్లీకి చెందిన 870 మంది ఓటర్లు, పాడేరుకి చెందిన 62 మంది, ఇతర జిల్లాలకు చెందిన 55 మంది ఓటేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..