logo

ఆదివాసీల ఐక్యతకు కృషిచేసేవారిని గెలిపించండి

ఆదివాసీల హక్కులు, ఐక్యతకు కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పేర్కొన్నారు.

Published : 08 May 2024 01:34 IST

రోడ్‌షోలో మాట్లాడుతున్న బృందాకారాట్‌, పక్కన అభ్యర్థులు అప్పలనర్స, గంగాధరస్వామి

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: ఆదివాసీల హక్కులు, ఐక్యతకు కృషి చేసే ఇండియా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారాట్‌ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అరకులోయలో మంగళవారం రోడ్‌షో నిర్వహించారు. బృందాకరాట్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు చేశారు. ఆదివాసీల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందాలనుకునే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు పాచిపెంట అప్పలనర్స, శెట్టి గంగాధరస్వామిలకు మద్దతు ఇవ్వాలని కోరారు. సీపీఎం, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు