అంతకు మించి అన్నారు.. అలా వంచించారు!
మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం.
నాలుక మడతెట్టిన జగన్, వైకాపా నేతలు
అచ్యుతాపురం, న్యూస్టుడే
మత్స్యకారులు నా కుటుంబ సభ్యులు. వారి జీవితాలను బాగుచేస్తాం. వైకాపా అధికారంలోకొస్తే ఇంటికో ఉద్యోగం, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి రూ. 5 లక్షల చొప్పున ఏపీఐఐసీ పైపులైను పరిహారం చెల్లిస్తాం. రాష్ట్రంలో అతిపెద్ద మత్స్యకార గ్రామమైన పూడిమడకను సమగ్రంగా అభివృద్ధి చేసి తీరుతాం..
నెత్తిపై తాటాకు టోపీ పెట్టుకొని వల చేతపట్టుకొని సీఎం జగన్ చేసిన ప్రతిజ్ఞ ఇది.
ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న అనే సామెత దీనికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. ఎన్నికల ముందు వరకు గంగపుత్రులకు అది చేస్తాం... ఇది చేస్తామంటూ జగన్తోపాటు గొప్పలు చెప్పిన వైకాపా నాయకులు ఎన్నికల తరవాత ఐదేళ్లలో వారివైపు కన్నెత్తి చూడలేదు.
అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలిలో (సెజ్) ఏర్పాటు చేసిన రసాయన పరిశ్రమల వ్యర్థాలను సముద్ర జలాల్లో కలపడానికి ఏపీఐఐసీ అధికారులు పూడిమడక తీరంలో పైపులైను ఏర్పాటు చేశారు. రసాయన వ్యర్థాల వల్ల తాము ఉపాధిని కోల్పోతామని మత్స్యకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో 4,800 మంది మత్స్యకార కుటుంబ యజమానులు ఒక్కొక్కరికి రూ. 1.25 లక్షలు పరిహారం అందివ్వడానికి ఏర్పాట్లు చేశారు. ఈ మొత్తం సరిపోదని, రూ. 5 లక్షలు అందివ్వాలని వైకాపా నాయకులు ఉద్యమబాట పట్టారు.తాము అధికారంలోకి వచ్చాక రూ. 5 లక్షలిస్తామని ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఈ హామీతో చాలామంది మత్స్యకారులు తెదేపా ప్రభుత్వం అందించిన పరిహారం తీసుకోకుండా ఉండిపోయారు. వైకాపా అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తయి, మళ్లీ ఎన్నికలు వచ్చినా ఈ హామీ అమలు కాలేదు. ఇలా వైకాపా పాలకుల మోసానికి బలయినవారు వెయ్యిమందికిపైగా ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
అచ్యుతాపురం మండలంలోని పూడిమడక అతిపెద్ద మత్స్యకార గ్రామం. ఇక్కడ దాదాపు 20 వేల జనాభా ఉంటారు. వీరికి వైకాపా ప్రభుత్వం తీరని అన్యాయం చేసింది. మత్స్యకారుల చేతివరకు వచ్చిన పరిహారం తీసుకోవద్దని, తాము అంతకుమించి ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇదే విషయాన్ని పదేపదే వల్లెవేశారు. దీనిని అమాయక మత్స్యకారులు పూర్తిగా నమ్మేశారు. తెదేపాకు కంచుకోటగా ఉండే ఈ గ్రామంలో గత ఎన్నికల్లో భారీ మెజార్టీ అందించారు. కానీ చివరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా చేతులెత్తేశారు.
కాగితాలకే పరిమితం
మత్స్యకారులకు మేలు చేసేలా పూడిమడకలో మినీ ఫిషింగ్ హార్బర్ నిర్మిస్తున్నామని సీఎం జగన్ ఘనంగా ప్రకటించారు. నెల్లూరు బహిరంగ సభలో పూడిమడకలో హార్బర్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ప్రకటించారు. ఇక్కడ కనీసం తట్ట మట్టి కూడా తవ్విపోయకుండా శరవేగంగా పనులు జరుగుతున్నాయని ఎలా ప్రకటిస్తారంటూ విపక్షాలు, స్థానికులు మండిపడినా వైకాపా నాయకుల్లో చెలనంలేదు. ఎన్నికల ముందు మత్స్యకారుల ఆగ్రహం నుంచి తప్పించుకోవడానికి హార్బర్ కోసమంటూ రోడ్డు మాత్రం నిర్మిస్తున్నారు. హార్బర్ నిర్మాణం చేపట్టకపోగా ఈ పేరుతో మత్స్యకారులు సాగు చేసుకున్న జీడిమామిడి తోటలను ధ్వంసం చేసి వైకాపా పరిపాలన ఏవిధంగా ఉంటుందో మత్స్యకారులకు రుచిచూపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ ఎన్నికల్లో విజయంపై రూ.1.75 కోట్ల పందెం
[ 19-05-2024]
ఓటర్ల తీర్పు ఈవీఎంల్లో నిక్షిప్తమై ఉండగా గెలుపుపై నేతలు ఆశల పల్లకీలో ఊరేగుతున్నారు. -
కాంబోడియాలో విశాఖ యువత నరకయాతన
[ 19-05-2024]
ఉద్యోగం సంపాదించాలి...కుటుంబాన్ని పోషించాలి అనే ఒకే ఒక్క ఆశతో ‘ఏజెంట్ల’ను నమ్మిన యువకులు సైబర్నేరగాళ్ల ఉచ్చులో చిక్కుకున్నారు. -
ఎన్నికల విధుల్లో.. ఎన్ని బాధలో!!
[ 19-05-2024]
సార్వత్రిక ఎన్నికల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి తగిన సౌకర్యాలు కల్పించడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. -
పట్టభద్రుల నెత్తిన మట్టితట్టలు
[ 19-05-2024]
ఏటా డిగ్రీ, బీటెక్లు పూర్తిచేసి కళాశాలల నుంచి బయటకు వస్తున్న పట్టభద్రులు వేల సంఖ్యలో ఉంటున్నారు. వీరికి గత అయిదేళ్లలో ఎలాంటి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు చూపలేకపోయారు. -
వేసవి శిక్షణ ఇంతేసంగతులా?
[ 19-05-2024]
ఈ ఏడాది వేసవి క్రీడా శిక్షణ తరగతులు లేనట్లేనని క్రీడా శాఖ ఉన్నతాధికారులు తేల్చేశారు. -
రంపచోడవరంలో పుష్ప-2 చిత్రీకరణ
[ 19-05-2024]
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప-2 సినిమాను శనివారం రంపచోడవరం మార్కెట్లో చిత్రీకరించారు. -
జడిగుడ జలజలా.. జోలాపుట్టు వెలవెల!
[ 19-05-2024]
ముంచంగిపుట్టు మండలంలోని బాబుసాల పంచాయతీ జడిగుడ సమీపంలో జలపాతం మండువేసవిలోనూ జాలువారుతూ కళకళలాడుతోంది. -
ఆన్లైన్లో ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం
[ 19-05-2024]
ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ జవాబు పత్రాల మూల్యాంకనం ఆన్లైన్ విధానంలో చేపట్టనున్నారు. -
సరిహద్దులు దాటని అభివృద్ధి
[ 19-05-2024]
ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. -
ప్రాణాంతక వ్యాధులపై ఇంటింటి సర్వే
[ 19-05-2024]
ప్రాణాంతక వ్యాధుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. -
ప్రయాణికుల రద్దీతో ప్రత్యేక రైళ్లు
[ 19-05-2024]
వేసవి సెలవులతో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో వేసవి ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఏకే త్రిపాఠి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..