logo

వైకాపాను తరిమికొడదాం

వైకాపాను తరిమికొట్టి, తెదేపాను గద్దెనెక్కిద్దామని ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల వారపు సంతలో కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు.

Published : 08 May 2024 01:52 IST

పసుపుమయమైన జి.మాడుగుల వారపు సంత..
ర్యాలీలో కూటమి అభ్యర్థి ఈశ్వరి

జి.మాడుగుల, న్యూస్‌టుడే: వైకాపాను తరిమికొట్టి, తెదేపాను గద్దెనెక్కిద్దామని ఎన్డీఏ అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. జి.మాడుగుల వారపు సంతలో కూటమి నాయకులు, కార్యకర్తలు మంగళవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారపు సంత పసుపుమయమైంది. ఈశ్వరి మాట్లాడుతూ.. కూటమితోనే గిరిజనాభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు.   ఈ సందర్భంగా పలువురు వైకాపా కార్యకర్తలు తెదేపాలో చేరారు. వీరికి ఈశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ర్యాలీకి ఎదురుగా వైకాపా అభ్యర్థి ఎం.విశ్వేశ్వరరాజు ర్యాలీ వచ్చింది. అభ్యర్థులిద్దరూ పరిస్పరం అభివాదం చేసుకుంటూ ముందుకు కదిలారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి రమేష్‌నాయుడు, సీనియర్‌ నాయకులు బొర్రా నాగరాజు, ఎస్‌.వి.రమణ, గబ్బాడ సింహాచలం, ఎంపీపీ పద్మ, కొండలరావు, కళ్యాణం, చిట్టిబాబు, భీమన్న, సింహాచలం, సుబ్బారావు, రామరాజు, కె.భీంబాబు, పాండురంగస్వామి, పిన్నయ్య, పి.భీంబాబు, రెడ్డిబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని