ఎలా అమ్మాలి..ఏం చేయాలి?
ఘంటసాల మండలంలోని చిట్టూర్పు గ్రామానికి చెందిన రాఘవరావు అనే రైతు తన పొలాన్ని ఈ-పంటలో నమోదు చేయించుకున్నారు...ఇటీవల ధాన్యం విక్రయించడానికి వెళ్తే మూడెకరాల్లో సగం మాత్రమే నమోదైనట్లు సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు.
ఈ- పంటలో నమోదుకాక అన్నదాతల అవస్థలు
అధికారుల చుట్టూ ప్రదక్షిణలు
ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తుతున్న రైతులు
గూడూరు మండలం కంకటావ గ్రామానికి చెందిన పలువురు రైతులు తాము సాగు చేసిన పొలాన్ని ఈ- పంటలో నమోదు చేసుకున్నారు.. అధికారులు కూడా నమోదైనట్లు చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రం సైట్లో వివరాలు చూపించకపోవడంతో ధాన్యం విక్రయించడానికి అవస్థలు పడుతున్నారు.
ఇలా జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రైతుల పొలాలు ఈ-పంటలో నమోదు కాకపోవడం, నమోదైనా ధాన్యం కొనుగోళ్ల సైట్లో చూపించకపోవడంతో విక్రయించుకునే మార్గం లేక ఆందోళన చెందుతున్నారు.
గోడుగుపేట (మచిలీపట్నం), న్యూస్టుడే : జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్లో 2.48లక్షల హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో వరి సాగయ్యింది. క్షేత్రస్థాయిలో ఏది సాగుచేసినా అది ఈ-పంట సైట్లో నమోదైతేనే ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ధాన్యం విక్రయించాలన్నా నమోదు తప్పనిసరి. అందుకే ఎప్పటి పంటలు అప్పుడు నమోదు చేసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇంత చేసినా పూర్తిస్థాయిలో నమోదు కాలేదు. నూరుశాతం పంట నమోదు లక్ష్యాన్ని సాధించినట్లు అధికారులు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఉంగుటూరు, గన్నవరం, బాపులపాడు, పెడన, ఘంటసాల, కృత్తివెన్ను, బందరు ఇలా అనేక మండలాల్లో వేలాది హెక్టార్లలో విస్తీర్ణం ఇంకా నమోదు కాలేదు. ఈ సమస్య జిల్లావ్యాప్తంగా ఉండడంతో ఏయే మండలాల్లో ఎంత విస్తీర్ణం నమోదు కాలేదో వివరాలు సేకరించే ప్రయత్నం చేసినా కొన్ని మండలాలకే పరిమితం అయ్యిందని రైతులు వాపోతున్నారు.
అవకాశం ఇచ్చి ఆదుకోవాలి
భూమి అడంగళ్లలో సమస్యలు, సాంకేతిక లోపాలు తదితర కారణాలతో జిల్లాలో వేలాదిమంది రైతుల పంటలు నమోదు కాలేదు. గ్రామాల్లో ఉండే వ్యవసాయ సహాయకులతోపాటు అనుబంధ శాఖల సిబ్బంది వారి పరిధిలోని పొలాలకు వెళ్లి ఏపంట సాగు చేశారో చిత్రాలు తీసి దస్తావేజుల వివరాలతో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. కొత్తగా భూములు కొనుగోలు చేసిన రైతులు, కొంతమంది తమ పిల్లలకు భూమి పంపకాలు చేసి రిజిస్ట్రేషన్ చేసినా ఇంకా ఆన్ లైన్లో నమోదు కాకపోవడం ఇలా వేలాదిమంది రైతుల భూమి వివరాలు నమోదుకాలేదు.కొన్ని చోట్ల రైతులు చనిపోవడంతో వారిపేరిట ఉన్న భూములకు సంబంధించిన ధాన్యాన్ని విక్రయించాలన్నా కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది ఇలాంటి సమస్య ఉత్పన్నంకావడంతో అప్పటికప్పుడు నమోదు చేయించేలా ప్రభుత్వం వెసులుబాటు ఇచ్చింది. ప్రస్తుతం ఈ పంట నమోదు వెబ్సైట్ను క్లోజ్ చేయడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.
పంట నూర్చి రెండు నెలలైంది
రెండెకరాల పంట నూర్పిడి చేసి నెలయ్యింది...ధాన్యం విక్రయిద్దామని కొనుగోలు కేంద్రం వద్దకు వెళ్తే సర్వే నెంబర్లు చూసి సిబ్బంది నమోదు కాలేదన్నారు. ఆ తరువాత అసలు ఎంత విస్తీర్ణం నమోదయ్యిందో తెలుసుకుందామని ఆరాతీస్తే ఆరెకరాల్లో మూడు ఎకరాలే నమోదయ్యింది. నాలాంటి రైతులు చాలామంది ఉన్నారు. ఏంచేయాలో తెలియడం లేదు. - కొండవీటి నాగభూషణం, ఉప్పలకలవగుంట, పెడన మండలం
ప్రభుత్వానికి నివేదించాం
జిల్లాలో అన్ని పంటలూ నమోదు చేశాం. వివిధ కారణాలతో అక్కడక్కడా ఇంకా కొందరు ఉన్నారని తెలిసి వివరాలు సేకరించాం. దాదాపు ఇంకా 5వేల ఎకరాలకుపైగా విస్తీర్ణం నమోదు చేయాల్సి ఉందని గుర్తించాం. దీనిపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి అందించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పంట పోర్టల్లో నమోదు చేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. - మోహన్రావు, వ్యవసాయశాఖ జేడీ
అప్పుడే చూసుకోవాల్సింది
పంట నమోదుచేసిన తరువాత జాబితాలను రైతుభరోసా కేంద్రాల్లో ప్రదర్శించారు. అప్పుడే రైతులు తమ వివరాలు సరిచూసుకుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. అయినా రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కచ్చితంగా త్వరలోనే మళ్లీ నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. - జన్ను రాఘవరావు, వ్యవసాయ సలహా మండలి జిల్లా ఛైర్మన్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేర్ని కిట్టూపై ఎందుకంత ప్రేమ?.. స్వామి భక్తి ప్రదర్శిస్తున్న పోలీసులు
[ 04-05-2024]
ఐదు సంవత్సరాలుగా అధికార పార్టీ సేవలకే పరిమితమైన పోలీస్శాఖ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా తీరు మార్చుకోవడం లేదు. -
జగన్.. ‘పైసా’చికానందం..!
[ 04-05-2024]
‘ఇది అత్యంత దారుణం.. పండుటాకులతో జగన్ పైశాచిక క్రీడ ఆడుతున్నారు. వృద్ధులంతా ఎండలో నరకం అనుభవించాలని.. తమ బాధకు కారణం.. వాలంటీర్లు లేకపోవడమేనని వాళ్లు భావించాలనేదే.. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యం. -
బ్యాలట్ కాదు.. బుల్లెట్
[ 04-05-2024]
ఒక పూటలో తినే కూరగాయల్నే ఏరి ఏరి కొంటాం.. మరి అయిదేళ్లకోసారి వేసే ఓటు ఆచితూచి వేయలేమా..! సామాజిక మాధ్యమాల్లో ఇటీవల చక్కర్లు కొడుతున్న పోస్టు ఇది. -
సహకారానికి జగన్ కత్తెర
[ 04-05-2024]
సహకార చట్టం ప్రకారం.. సంఘానికి నిర్ధరిత కాలవ్యవధిలో ప్రత్యేక ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. -
జగన్ జమాన.. జనం భయాన!
[ 04-05-2024]
ప్రశాంతంగా కుటుంబంతో పార్కుకు వెళ్లాలంటే భయం.. పద్మావతి ఘాట్కో... కృష్ణవేణి ఘాట్కో వెళ్లి కొద్దిసేపు సేదదీరాలన్నా భయమే... నిర్మానుష్యంగా.. చీకటిగా ఉన్న రోడ్లపై వెళ్లాలన్నా ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే...ఎటువైపు నుంచి బ్లేడ్, గంజాయి బ్యాచ్లు దాడి చేస్తాయో తెలీదు. -
పోలీసుపై కొడాలి నాని ప్రధాన అనుచరుడి అరాచకం
[ 04-05-2024]
గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని ప్రధాన అనుచరుడైన కసుకుర్తి జనార్దన్ (గుడ్లవల్లేరు బాబ్జి) ట్రాఫిక్ విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. -
ఆటోనగర్పై పగ.. శ్రామికులకు సెగ
[ 04-05-2024]
ఆసియాలోనే పెద్దదైన బెజవాడ ఆటోనగర్ పారిశ్రామికవాడ నేడు అనేక సమస్యలతో సతమతమౌతోంది. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దీనిని పట్టించుకోవడం మానేసింది. -
వంశీ, నానీ.. ‘దారి’ మరిచారేం?
[ 04-05-2024]
గన్నవరం, నూజివీడు నియోజకవర్గాలకు ఎంతగానో ఉపకరించే కీలక రహదారి అభివృద్ధిపై వైకాపా ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం చూపారు. చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు గాలిలో కలిసిపోయాయి. -
రూ.కోట్ల విలువైన స్థలంఫై విష్ణు కన్ను
[ 04-05-2024]
నగరంలో గత అయిదేళ్లలో వైకాపా ప్రజాప్రతినిధులు.. ఎక్కడ ఖాళీ స్థలాలు కనిపించినా కబ్జా చేసేశారు. స్థానిక కార్పొరేటర్ల అండతో ప్రభుత్వ స్థలాలను మింగేశారు. -
బూతుల నేత.. మెరకలో మేత!
[ 04-05-2024]
శతకోటి అక్రమాలకు అనంతకోటి ఉపాయాలు! మట్టి నుంచి రూ. కోట్లు ఎలా పిండుకోవచ్చో గుడివాడ వెళ్లి చూస్తే తెలుస్తుంది.ఆ పిండుకున్నదాన్ని చట్టానికి దొరక్కుండా ఎలా జేబులో వేసుకోవచ్చో కూడా చూడొచ్చు. -
తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయుల దాడి
[ 04-05-2024]
బాపులపాడు మండలం కొత్తమల్లవల్లిలో తెదేపా శ్రేణులపై వైకాపా వర్గీయులు రెచ్చిపోయారు. ఇళ్ల మీదకు వెళ్లి దాడికి పాల్పడ్డారు. -
మళ్లీ అదే తంతు
[ 04-05-2024]
అనుమతి లేకుండా 59వ డివిజన్లోని పలు నివాసాలపై వైకాపా నేతలు ఆ పార్టీ స్టిక్కర్లు అంటించడం వివాదాస్పదమైంది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛను
[ 04-05-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ అందిస్తామని కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు కేశినేని చిన్ని, శ్రీరాం తాతయ్య పేర్కొన్నారు. -
కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యం: సుజనా
[ 04-05-2024]
ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడమే లక్ష్యంగా తెదేపా, జనసేన, భాజపా కార్యకర్తలు కృషి చేయాలని పశ్చిమ అభ్యర్థి సుజనా చౌదరి పిలుపునిచ్చారు. -
చిన్నారులకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
[ 04-05-2024]
నగరంలోని ఆంధ్రా ఆసుపత్రిలో హీలింగ్ లిటిల్ హార్ట్స్ యూకే సౌజన్యంతో 15 మంది చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. -
తెదేపాతోనే యువతకు భవిష్యత్తు
[ 04-05-2024]
యువత భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని విజయవాడ పార్లమెంట్ తెదేపా అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు. -
నేటి నుంచి పోస్టల్ బ్యాలట్ ఓటింగ్
[ 04-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఈ నెల 4, 5, 6 తేదీల్లో పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
టికెట్టు లేని ప్రయాణాలకు జరిమానా
[ 04-05-2024]
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో టికెట్టు లేని ప్రయాణికుల ద్వారా ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో రికార్డు స్థాయిలో డివిజన్కు రూ.7.96కోట్ల ఆదాయం లభించింది. -
ప్రధాని రోడ్షో భద్రతపై సమీక్ష
[ 04-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈనెల 8వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు విజయవాడలో రోడ్షోలో పాల్గొననున్నారని ఇందుకు భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు ప్రధాని పర్యటనకు అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..