విడత విడతకూ కోత.. పింఛనుదారులకు వ్యధ
పింఛన్లు ఇస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం వివిధ రకాల వడపోతలతో విడత విడతకు కోత పెడుతుందంటూ పింఛనుదారులు వాపోతున్నారు.
729 మంది అనర్హులుగా గుర్తింపు
మచిలీపట్నం కార్పొరేషన్, న్యూస్టుడే
పింఛన్లు ఇస్తున్నామని చెబుతూనే ప్రభుత్వం వివిధ రకాల వడపోతలతో విడత విడతకు కోత పెడుతుందంటూ పింఛనుదారులు వాపోతున్నారు. కేవలం విచారణ నిమిత్తమేనని, అందరికీ పింఛన్లు అందజేస్తామని పాలకులు చెబుతున్నా జిల్లావ్యాప్తంగా విచారణచేసి వందలాదిమందిని అనర్హులుగా ప్రకటించడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా పింఛను పొందుతున్న వారిలో ఎవరైనా అనర్హులు ఉన్నారా లేదా అన్న దానిపై ప్రభుత్వం ఆరు అంచెల విధానాన్ని అమలు చేస్తోంది. దీనిలో భాగంగానే అన్ని మండలాల్లో పింఛను పంపిణీకి నిర్దేశించిన మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నవారి జాబితా తయారు చేసి గత డిసెంబరు నెలలో నోటీసులు జారీ చేశారు. అలా మొత్తం జిల్లాలో 6,667మందికి నోటీసులు ఇవ్వగా ఇందులో ఎక్కువశాతం బందరు నగరంలోనే 1203 ఉన్నారు. పెనమలూరులో 1192, గుడివాడ పట్టణంలో 800 చొప్పున, మిగిలిన మండలాల్లో 50 నుంచి 200 వందలమందికిపైగా నోటీసులు ఇచ్చారు. వీరందరికీ తగిన ఆధారాలను సచివాలయంలో సమర్పించేందుకు 15 రోజుల గడువు విధించారు. ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించేలా రెవెన్యూ, విద్యుత్తు, రవాణా తదితర శాఖల అధికారులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అలా పూర్తిస్థాయిలో విచారణ చేసిన అనంతరం ప్రస్తుతానికి 729మంది అనర్హులుగా గుర్తించారు. వీరందరికీ పింఛన్లు ఆగిపోవడంతో ఆందోళన చెందుతూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు.
పింఛను వస్తుందో రాదో..
పింఛను ఆగిపోయిన వారిలో చాలామందికి అర్హత ఉన్నా తొలగించారని బాధితులు వాపోతున్నారు. పదెకరాల పొలం లేకున్నా, సరాసరిన 300 యూనిట్ల విద్యుత్తు వినియోగం జరగకపోయినా సాంకేతికంగా దొర్లిన తప్పుల వల్ల పింఛన్ ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులుగా గుర్తించిన వారికి జనవరి నెల పింఛను ఆపేశారు.అనర్హులుగా గుర్తించిన వారిలో ఎక్కువశాతం మంది 300 యూనిట్లపైగా విద్యుత్తు వినియోగిస్తున్నవారు ఉన్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడిగా వస్తున్న పింఛను నిలిపివేయడంతో కేవలం దానిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్న వృద్ధులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరునెలలకోసారి కొత్త పింఛన్లు ఇవ్వడంతో అప్పటివరకు పింఛన్లు రావేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎప్పటికప్పుడు ఏదో ఒక సాకుతో పింఛన్లకు కోత పెట్టడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి, తగున్యాయం చేసి త్వరితగతిన పింఛన్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు.
స్పందనలో అర్జీ ఇచ్చినా..
మాతమ్మ, పోతేపల్లి, బందరు మండలం
నా బియ్యం కార్డులో మా ఆయన పేరుందని చెప్పి పింఛను తొలగించారు. ఆయన చనిపోయి ఏళ్లు గడిచిపోతుంది. ఎప్పటినుంచో వస్తున్న పింఛను ఆపేయడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మా గ్రామంలో ఉన్న సచివాలయ ఉద్యోగులతోపాటు కలెక్టరేట్లో నిర్వహించిన స్పందనలోనూ అర్జీ ఇచ్చాను. ఉన్నతాధికారులు స్పందించి త్వరితగతిన పింఛను ఇచ్చేలా చొరవ తీసుకుని ఆదుకోవాలని కోరుతున్నా.
అర్హులందరికీ ఇస్తున్నాం..
వరప్రసాద్, డీఆర్డీఏ, పీడీ
జిల్లాలో అర్హులందరికీ పింఛన్లు ఇస్తున్నాం. క్షేత్రస్థాయిలో అన్నివిధాలుగా విచారణ చేసి తక్కువమందిని మాత్రమే అనర్హులుగా గుర్తించాం. వీరికి కూడా ఏ కారణంతో ఆపినట్లు చెప్పామో దానికి సంబంధించిన పత్రాలు అందజేస్తే తిరిగి పింఛను అందుతుంది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సాంకేతిక సమస్యలు ఉంటే సంబంధిత విభాగ అధికారుల వద్దకు వెళ్తే వెంటనే పరిష్కరిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
[ 27-04-2024]
ఉంగుటూరు మండలం ఎలుకపాడులో సర్వే నంబరు 31/1లో 50 మంది దళితులకు అసైన్డ్ భూమి కేటాయించారు. పాసుపుస్తకాలు కూడా అందాయి. వీరిలో నలుగురి వివరాలే ఆన్లైన్ అయ్యాయి. -
113 నామపత్రాలకు ఆమోదం
[ 27-04-2024]
జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు దాఖలైన వాటిలో 113 నామపత్రాలు సక్రమంగా ఉన్నట్లు ఎన్నికల అధికారులు నిర్ధారించారు. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో శుక్రవారం నామపత్రాలు పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. -
ఏ ముఖం పెట్టుకుని ఓట్లడగడానికి వస్తారు
[ 27-04-2024]
గన్నవరం నియోజకవర్గానికి చెందిన అంబాపురం పంచాయతీ నగరానికి చేరువుగా ఉన్నా.. అభివృద్ధి జాడ మాత్రం కన్పించడం లేదు. అంతరవలయ రహదారికి ఒకవైపు నగరపాలకసంస్థ అందమైన రహదారులతో, తాగునీరు, కాలువలతో సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంటే.. -
తలపడలేక.. తొండాట!
[ 27-04-2024]
సారూప్యం ఉన్న పేర్లతో నామినేషన్ల జిమ్మిక్కులు.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చి ప్రత్యర్థికి నష్టం కలిగించే ఎత్తుగడలు.. అసంబద్ధ ఫిర్యాదులు.. ఇలా ఎన్నో వ్యూహాలు.. ఎత్తుగడల మధ్య నామినేషన్ల పరిశీలన క్రతువు ముగిసింది. -
ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!
[ 27-04-2024]
జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు. -
బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు: బాలశౌరి
[ 27-04-2024]
విజయం అనేది కష్టపడితే వస్తుంది..ప్రజలకు మేలు చేస్తే ఆశీర్వదిస్తారు.. కానీ బందరులో ఓ తిక్కసన్నాసి ఉన్నారు.. ఓటమి భయం పట్టుకుని తన పేరుతో ఉన్న వ్యక్తులతో నామినేషన్లు వేయించారని ఎమ్మెల్యే పేర్ని నానీని ఉద్దేశించి కూటమి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి బాలశౌరి పరోక్షంగా విమర్శించారు. -
మిగులు పనుల పూర్తికి ఐదేళ్లా..!
[ 27-04-2024]
తెదేపా హయాంలో కానూరు వీఆర్ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో యాజమాన్యం వారు సొంత నిధులు వెచ్చించి వంతెన నిర్మించారు. కొన్ని పనులు మిగిలిపోయాయి. వాటిని పూర్తి చేయడానికి ఇంకా రూ.2.50 కోట్లు అవసరం. -
కాంగ్రెస్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా.. రుణమాఫీ
[ 27-04-2024]
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రానికి పదేళ్లు ప్రత్యేకహోదా వస్తుందని, రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ అవుతుందని; పోలవరం, అమరావతి నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారు. -
గురువులపై కక్షగట్టి
[ 27-04-2024]
వైకాపా పాలనలో గురువులపై ఒత్తిడి పెరిగింది. పాఠాలు చెప్పడంతోనే వారి బాధ్యత తీరిపోలేదు. యాప్లో అటెండెన్స్ ఆలస్యంగా వేసినా, ఏదైనా ప్రధాన కారణం చేత స్పాట్ వాల్యుయేషన్కు హాజరు కాకపోయినా, బయోమెట్రిక్ వాడకపోయినా సంజాయిషీ తాఖీదు తప్పదు. -
సర్వే అన్నారు.. భూవిస్తీర్ణం తగ్గించారు
[ 27-04-2024]
భూ సంబంధిత సమస్యలన్నింటినీ శాశ్వతంగా పరిష్కరించడంతోపాటు వివాదాలు తలెత్తకుండా హద్దులు ఏర్పాటు చేసి అందరికీ మళ్లీ భూహక్కు పత్రాలు అందిస్తాం. దీని కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగిస్తున్నాం. -
ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేసి చూపుతా
[ 27-04-2024]
ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజాప్రతినిధులను రీకాల్ చేసే విధానం రావాలని, పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఎప్పుడూ అండగా ఉంటానని కేంద్ర మాజీ మంత్రి, ఎన్డీయే కూటమి విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. -
విజయవాడ ఎంపీ బరిలో 19 నామినేషన్ల ఆమోదం
[ 27-04-2024]
విజయవాడ లోక్సభ స్థానానికి సంబంధించి నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) ప్రక్రియ శుక్రవారం పూర్తయింది. సక్రమంగా ఉన్న 19 నామినేషన్లు చెల్లుబాటయ్యాయి. వివిధ కారణాలతో 15 నామినేషన్లను తిరస్కరించినట్టు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్