మన వారైౖతే చాలు!
ఉమ్మడి జిల్లాలో జలవనరుల శాఖలో బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈగా ఇంజినీరును నియమించలేదు.
ఇష్టారీతిన ఎఫ్ఏసీలుగా నియామకం
అధికార పార్టీ నేతల సిఫార్సే కీలకం
ప్రధాన శాఖల్లో అధికారుల బది‘లీలలు’
ఈనాడు, అమరావతి
అది డీఈఈ పోస్టు. అక్కడ కీలక పనులు జరుగుతున్నాయి. అడ్డగోలు ఎంబీలకు ఆ ఇంజినీరు తల ఊపడం లేదు. అంతే.. ఆయనను వేరే సెక్షన్కు బదిలీ చేశారు. డీఈ స్థాయి పోస్టులో ఒక ఏఈఈని ఇన్ఛార్జిగా నియమించి.. ఎఫ్ఏసీ (పూర్తి అదనపు బాధ్యతలు) ఇచ్చేలా ప్రజాప్రతినిధి సిఫార్సు చేశారు. నేడో రేపో ఉత్తర్వులు రానున్నాయి. ఇదీ.. జల వనరుల శాఖలో ఒక సబ్ డివిజన్లో తీరు. ఇదే కాదు.. తమకు అనుకూలంగా మాట వినడం లేదని.. సర్కిల్ అధికారిపైనే వేటు వేశారు. ఒక్క జలవనరుల శాఖలోనే కాదు.. ఇతర శాఖల్లోనూ కీలక పోస్టుల్లో ఎఫ్ఏసీ పేరుతో ఇన్ఛార్జిలను నియమించారు. కొన్ని పోస్టుల్లో కింది స్థాయి క్యాడర్ ఉద్యోగులకే ఇన్ఛార్జిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అంటే అన్నిరకాల దస్త్రాలపై ఆయన నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుంది.
పోస్టులు ఖాళీగా ఉంచడంలో సమర్థమైన అధికారులు లేరని కాదు.. తమకు అనుకూలంగా వ్యవహరించడం లేదనే కారణంతోనే అడ్డగోలుగా నియామకాలు చేసినట్లు తెలిసింది. నిబంధనలకు వ్యతిరేకంగా బదిలీలు చేశారు. పదవీ విరమణకు మూడు నెలల ముందు ఓ జిల్లా అధికారిణిని బదిలీ చేయగా.. అధికార పార్టీ నేతలతో (ప్రజాప్రతినిధులతో) తనకెందుకు ఘర్షణ అని ఆమె మౌనంగా ఉన్నారు. వడ్డించేది మనవారైతే.. అన్నట్లు ఎన్నికల ఏడాది కావడంతో కీలక పోస్టుల్లో తమ అనుచరులను నియమిస్తుండగా... కొన్ని పోస్టులు ఎన్నికల ‘ఫండ్’ ప్రాధాన్యంగా నియామకాలు జరిగినట్లు తెలిసింది. దీనిపై అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో జలవనరుల శాఖలో బదిలీలు చర్చనీయాంశంగా మారాయి. కొన్ని కీలక పోస్టుల నియామకం వివాదాస్పదంగా మారుతోంది. ఉమ్మడి జిల్లా జలవనరుల శాఖ ఎస్ఈగా ఇంజినీరును నియమించలేదు. ఈఈకి ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. గతంలో డిప్యూటీ ఈఎన్సీగా ఉన్న తిరుమలరావును నియమించారు. ఆయన ఏడాది కూడా పనిచేయలేదు. తిరిగి పంపించారు. గత ఏడాది ప్యాకేజీ పనులను ఆయన వ్యతిరేకించారు. ఈ ఏడాది పనులకు ఆయన ఆమోదం తెలపలేదు. అంతే ఆయనపై బదిలీ వేటు వేశారు. కృష్ణా తూర్పు డివిజను ఈఈగా ప్రసాద్ను నియమించి ఆయనకు ఎస్ఈగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.
* కృష్ణా సెంట్రల్ డివిజను ఈఈగా పీవీఆర్ కృష్ణారావుకు ఎఫ్ఏసీ అప్పగించారు. ఆయన అసలు పోస్టు ప్రధాన కార్యాలయం సబ్డివిజను డీఈఈ. ఒక అంచె పైస్థాయిలో ఎఫ్ఏసీ బాధ్యతలు అప్పగించారు. సెంట్రల్ డివిజనులో నిర్వహణ పనులు కీలకంగా ఉన్నాయి.
* గుడివాడ డ్రెయినేజీ డివిజను ఈఈగా విజయలక్ష్మికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ... నియమించారు. ఆమె అసలు పోస్టు కాడా (కమాండ్ ఏరియా డెవలప్మెంట్) డీఈఈ. పులిగడ్డ సబ్డివిజన్ ఈఈగా ఆర్.రవికిరణ్ను నియమించారు. ఎఫ్ఏసీగా బాధ్యతలు అప్పగించారు. ఆయన అసలు పోస్టు డ్రెయినేజీ విభాగం ఈఎన్సీ కార్యాలయం.
* చల్లపల్లి డ్రెయినేజీ స్పెషల్ సబ్ డివిజను డీఈఈ ఇమ్మానియేల్ను క్వాలిటీ కంట్రోల్ విభాగానికి బదిలీ చేశారు. ఈపోస్టు ప్రస్తుతం ఖాళీగా ఉంది. పులిగడ్డ ఇరిగేషన్ సెక్షన్లో ఒక ఏఈకి దీని ఎఫ్ఏసీని అప్పగించేలా నిర్ణయించారు.
* అకౌంట్స్ విభాగాల్లోనూ సిబ్బందిని అలాగే ఎఫ్ఏసీలు అప్పగించారు.
వేతనం అక్కడ.. విధులు ఇక్కడ!
* పలుశాఖల జిల్లా అధికారులకు ఎఫ్ఏసీలు చర్చనీయాంశమైంది. గృహ నిర్మాణ శాఖలో ఇదే తీరు. ఇక్కడ మెరక పనులు, ఇతర బిల్లులు రూ.కోట్లలో చేయిస్తున్నారు. దీనికి అనుకూలంగా బదిలీలు, నియామకాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా గృహనిర్మాణ అధికారిణి శ్రీదేవిని పదవీ విరమణకు మూడు నెలల ముందు బదిలీ చేశారు. ఈనెల 30తో ఆమె పదవీ విరమణ చేస్తున్నారు. ఆమె స్థానంలో రజినీ కుమారిని నియమించారు. ఆమె అసలు స్థానం అనంతపురం జిల్లా. వేతనం అక్కడ తీసుకుంటున్నారు. విధులు ఎన్టీఆర్ జిల్లాలో చేస్తున్నారు. డిప్యుటేషన్పై ఉన్నారు.
* కృష్ణా జిల్లా గృహనిర్మాణ అధికారి(పీడీ) రామచంద్రన్ ఉన్నారు. కానీ ఆయన విధులు ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్నారు. అక్కడ పోస్టు డ్వామా పీడీకి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆరోగ్యం బాగోలేదని వీఆర్ఎస్కు దరఖాస్తు చేసిన పీడీ రామచంద్రన్ను ప్రధాన కార్యాలయానికి పంపడం విశేషం.
* దేవదాయశాఖ కృష్ణా జిల్లా అధికారిణిగా ఎన్టీఆర్ జిల్లా అధికారిణి శాంతి వ్యవహరిస్తున్నారు. రెండు జిల్లాలకు ఆమె అధికారిణిగా ఉన్నారు. ఇతర అధికారులు ఉన్నా వారికి పోస్టు ఇవ్వలేదు.
* దేవదాయశాఖలో పలు గ్రూపు దేవాలయాలు.. ఆయా ఈవోల కిందకు వస్తాయి. కానీ కృష్ణా జిల్లా ఈవోలకు ఎన్టీఆర్ జిల్లా, ఎన్టీఆర్ జిల్లా ఈవోలకు కృష్ణాజిల్లా గ్రూపు దేవాలయాలను అప్పగించడం విశేషం.
* రెవెన్యూ, జిల్లా పరిషత్తు శాఖల్లో తహసీల్దార్లను, ఎంపీడీవోలను తమకు అనుకూలమైన వారినే ప్రజాప్రతినిధులు కావాలని నియమించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా