TDP-YSRCP: గన్నవరంలో గరం గరం!
ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు ప్రతివ్యూహాలు.. వర్గపోరు.. ఆధిపత్యపోరు.. ఇలాంటి సమీకరణలకు గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది.
తెదేపా గూటికి దాసరి సోదరులు?
యార్లగడ్డ కీలక సమావేశంపై ఆసక్తి
నిడమానూరులో లోకేశ్ బస చేసే ప్రాంతాన్ని సిద్ధం చేసే పనుల్ని ప్రారంభిస్తున్న తెదేపా నాయకులు
ఈనాడు - అమరావతి, హనుమాన్జంక్షన్ - న్యూస్టుడే : ఎత్తులు పైఎత్తులు.. వ్యూహాలు ప్రతివ్యూహాలు.. వర్గపోరు.. ఆధిపత్యపోరు.. ఇలాంటి సమీకరణలకు గన్నవరం నియోజకవర్గం కేంద్రంగా మారింది. రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకొన్న ఈ ప్రాంత సమీకరణాలు మారనున్నాయి. తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర యువగళం గన్నవరం కేంద్రంగా భారీ సభ జరగనుంది. గన్నవరంలో ఈ సారి ఎట్టి పరిస్థితుల్లో తెదేపా జెండా ఎగురవేయాలనే పట్టుదల పార్టీశ్రేణుల్లో నెలకొంది. త్వరలో భారీ మార్పులు.. చేరికలు జరగనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు అధికార పార్టీలో అసమ్మతి సమావేశాలు జరుగుతున్నాయి. దీంతో ఈ పరిణామాల పట్ల ఆసక్తి నెలకొంది. యువగళానికి ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు ప్రారంభమైనట్లు తెదేపా నేతలు ఆరోపిస్తున్నారు. అందరి దృష్టి ప్రస్తుతం గన్నవరంపైనే ఉంది. రాజకీయంగా చైతన్యం కలిగిన ఉమ్మడి కృష్ణా జిల్లాలో యువగళంలో గన్నవరం కేంద్రీకృతంగా మారింది. యువనేత లోకేశ్కు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేసేలా నాయకులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు వైకాపా అసమ్మతి నేత యార్లగడ్డ వెంకట్రావు బహిరంగంగా సీఎం జగన్ తీరు తప్పు పడుతూ సమావేశం నిర్వహించడం, రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ చేస్తాననడం, మాజీ ఎమ్మెల్యే బాలవర్థనరావు, చంద్రబాబుని కలవడం వేడిని మరింత పెంచుతుంది.
గన్నవరంపైనే!
యువగళం పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో నాలుగు రోజులు నిర్వహించనున్నారు. ఈ జిల్లా తెదేపాకు గట్టి పట్టు ఉన్న జిల్లా. గన్నవరం నియోజకవర్గంలో పాదయాత్ర రెండు రోజులు కొనసాగనుంది. బహిరంగ సభ ఇక్కడే ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ జిల్లా నుంచి పెనమలూరు నియోజకవర్గం మీదుగా నిడమానూరు చేరుకుంటుంది. చిన్నఆవుటపల్లి వద్ద బహిరంగ సభ వేదికను ఖరారు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ తెదేపా నుంచి పార్టీ మారి అధినేతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాటి నుంచి తెదేపా శ్రేణుల్లో పట్టుదల పెరిగింది. ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనెల 20, 21 తేదీల్లో పాదయాత్ర నిర్వహించనున్నారు. 21 సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. ఈక్రమంలో లోకేశ్ బస, బహిరంగ సభ నిర్వహణ నిమిత్తం అనువైన స్థలాల్ని ఎంపిక చేసిన నాయకులు నిర్వహణ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. బహిరంగ సభ కోసం చిన్నఆవుటపల్లి సమీపంలో తొమ్మిది ఎకరాలు, బస కోసం నిడమానూరు సమీపంలో ఆరెకరాలు సిద్ధం చేస్తున్నారు. గన్నవరం పర్యటనను లోకేశ్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.
మారనున్న సమీకరణాలు
గత ఎన్నికల్లో వైకాపా తరపున పోటీ చేసి ఓడిన యార్లగడ్డ వెంకట్రావు ప్రస్తుతం రాజకీయ భవిష్యత్తుపై సమాలోచనలు చేస్తున్నారు. డీసీసీబీ ఛైర్మన్ పదవి ముగిసిన తర్వాత ఖాళీగా ఉన్నారు. అప్పుడప్పుడు కార్యకర్తలను పరామర్శించేవారు. తెదేపా నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే వంశీ పార్టీ మారి జగన్కు మద్దతు తెలపడంతో వైకాపా నేతల భవిష్యత్తుపై రకరకాల ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. యార్లగడ్డ, దుట్టా... ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వ్యతిరేకించి వైకాపాలో వేరు కుంపటి పెట్టుకున్నారు. అధినేత చెప్పినా ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేందుకు అంగీకరించలేదు. దీంతో గత ఆదివారం కార్యకర్తల ఆత్మీయ సమావేశం పేరుతో బహిరంగ సభ నిర్వహించి, జగన్ తనని మోసం చేశారని యార్లగడ్డ ఆవేదన వెళ్లగక్కారు. జగన్ సీటిచ్చినా ఇవ్వకపోయినా రానున్న ఎన్నికల్లో గన్నవరం నుంచే పోటీ ఖాయమని స్పష్టం చేశారు. శుక్రవారం కూడా మరోసారి సమావేశం కానున్నారు. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా తెదేపాలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇంకా ధ్రువీకరణ కాలేదు. మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్థనరావు కూడా చంద్రబాబుని కలవడంతో పరిణామాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఫ్లెక్సీల లొల్లి..!
యువగళం పాదయాత్ర సందర్భంగా విజయవాడ నగరంలో, గన్నవరంలో అధికార పార్టీ నేతలు ఆటంకాలు సృష్టిస్తున్నారు. తమ నేతకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించడం ఉద్రిక్తతలకు దారి తీసింది. దీనిపై తెదేపా నేతలు బుద్దా వెంకన్న, కేశినేని చిన్ని ఘాటుగా స్పందించారు. గురువారం రాత్రి కొన్ని తొలగించడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదాలు తలెత్తాయి. గన్నవరంలో బహిరంగ సభ వేదికకు స్థలం లభించకుండా వ్యూహాలు పన్నారు. ఎట్టకేలకు చిన్నఅవుట్పల్లి వద్ద ఏర్పాటు చేశారు. విజయవాడలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలు ఇవ్వడానికి రాజకీయ ఒత్తిడి తెచ్చి బెదిరింపులకు గురిచేశారు. ఎట్టకేలకు తిరిగి దానినే బసకు ఏర్పాటు చేశారు. వేరే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల సిబ్బంది పొరపాటు.. పీవోకి గ్రహపాటు
[ 17-05-2024]
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మచిలీపట్నంలోని ఎన్నికల సామగ్రి స్వీకరణ(రిసీవింగ్) సిబ్బంది చేసిన పొరపాటుకు ఓ ఉపాధ్యాయుడి కుడి చేయి విరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గుడివాడ పట్టణానికి చెందిన షేక్.ఇబ్రహీం బేతవోలులోని ఎస్జీవీఎస్జీ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
ఆధిక్యంపైనే అసలు ఆట!
[ 17-05-2024]
ఎన్నికలలో కీలకమైన పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ముఖ్యమైన లెక్కింపు ఘట్టం మిగిలే ఉంది. అభ్యర్థుల తలరాతలు, రాష్ట్ర భవితను నిర్దేశించే ఈ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దీనికి ఇంకా 18 రోజులు సమయం ఉంది. -
జగనొస్తే చుక్కలే!
[ 17-05-2024]
సీఎం జగన్ పర్యటన అంటేనే విజయవాడ నగర ప్రజలు హడలెత్తిపోతున్నారు. గురువారం సీఎం జగన్ విజయవాడ బెంజ్సర్కిల్ సమీపంలో ఐ-ప్యాక్ కార్యాలయానికి వచ్చారు. -
రాతిమండపం తొలగించి.. ప్రైవేటు దుకాణాలా?
[ 17-05-2024]
గత అయిదేళ్లుగా దుర్గ గుడిలో ఒక్క నిర్మాణం కట్టింది లేదు.. ఉన్నవాటిని కూల్చేయడమే.. పాలకుల అనాలోచిత నిర్ణయాలు.. అమ్మవారి ఆదాయాన్ని కరిగించేస్తుండగా...దిశా నిర్దేశం లేని ప్రణాళికలతో కాలహరణం చేయడం పరిపాటిగా మారిపోయింది.. -
కొనేవారున్నా.. కాయల్వేవ్!
[ 17-05-2024]
నున్న మార్కెట్ నుంచి నిత్యం ఎగుమతవుతున్న మామిడి దాదాపు 200 టన్నులు.. గతంలో ఇదే సమయంలో ఎగుమతులు 400 నుంచి 500 టన్నుల వరకు ఉండేవి. 2023లో టన్ను ధర రూ. 10 వేల నుంచి రూ. 25 వేల వరకు ఉండగా... ఈ ఏడాది రూ. 25 వేల నుంచి రూ. 35 వేల వరకు పలుకుతోంది. -
అందని వేతనం.. బతుకు భారం
[ 17-05-2024]
ఆరువేల వేతనం ఇస్తాం....ప్రతి నెలా నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని పాలకులు చెప్పడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అనేకమంది మహిళలు పాఠశాలల్లో ఆయాలుగా చేరారు. -
గాయపర్చిన ఘటనలో కేసు నమోదు
[ 17-05-2024]
పెదపారుపూడి మండలం పాములపాడు శివారు దూళ్లవానిగూడెంలో వ్యక్తిని కొట్టి గాయపర్చిన ఘటనలో కేసు నమోదు చేశామని పెదపారుపూడి ఎస్ఐ రాజు గురువారం తెలిపారు. -
ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు
[ 17-05-2024]
జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తయిన క్రమంలో.. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లపై కలెక్టరేట్లో గురువారం అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. -
మిర్చి వ్యాపారి రూ.1.76 కోట్లకు ఐపీ?
[ 17-05-2024]
కంచికచర్లకు చెందిన ఒక మిర్చి వ్యాపారి ఐపీ దాఖలు చేసినట్లు తెలియడంతో అతడి ఇంటి వద్ద బాధితులు గురువారం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచికచర్ల పట్టణానికి చెందిన మిర్చి వ్యాపారి దొడ్డా నరసింహారావు, అతని కుమారుడు వెంకట వాసుదేవకుమార్(వాసు) స్థానిక రైతుల నుంచి మిర్చి కొనుగోలు వ్యాపారం నిర్వహించేవారు. -
ఏళ్ల ఆశ.. నెరవేరక నిరాశ
[ 17-05-2024]
నగర పాలక సంస్థలో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న టైంస్కేలు వర్కర్లు (గతంలో ఎన్నెమ్మార్లు), ఒప్పంద కార్మికులు, పొరుగు సేవల సిబ్బందిని ప్రభుత్వం నమ్మించి మోసం చేసింది. -
కార్పొరేటర్ భర్త కోసం పోలీసుల గాలింపు
[ 17-05-2024]
విజయవాడ 42వ డివిజన్ కార్పొరేటర్ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రసాద్రెడ్డి పోలింగ్ రోజున రెండు బూత్ల వద్ద అనుచరులతో కలిసి వీరంగం సృష్టించి..ఒక మహిళతో సహా ముగ్గురిపై దాడులకు పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు