logo

CM Jagan Public Meeting: జగనొస్తే చదువుకు సెలవే

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ సీఎం సభ జరిగినా ఆ రోజున కళాశాలలకు వెళ్లే బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామనీ.. హాజరుతో పాటు, తరగతులు కోల్పోవలసి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated : 30 Sep 2023 08:18 IST

ఈనాడు, అమరావతి: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కడ సీఎం సభ జరిగినా ఆ రోజున కళాశాలలకు వెళ్లే బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నామనీ.. హాజరుతో పాటు, తరగతులు కోల్పోవలసి వస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడలోని పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ సిటీ టెర్మినల్‌ స్టాప్‌లకు ప్రతి 5 నిమిషాలకు ఒక బస్సు తిరుగుతుంది. అలాంటిది శుక్రవారం గంటల కొద్దీ వేచి ఉన్నా బస్సులు రాక విద్యార్థులు అవస్థలు పడ్డారు. విద్యార్థులందరికి బస్‌పాస్‌లు ఉండడంతో బస్సుల కోసం వేచి చూసినా ఫలితం లేక ఇళ్లకు వెళ్లిపోయారు ఆటోల్లో వెళ్లాలంటే కనీసం రూ.50 అవుతుందని బస్‌పాస్‌లు ఉండడంతో డబ్బులు తెచ్చుకోని కొందరు ఇబ్బందులు పడ్డారు. సభలకు కేటాయించిన బస్సుల్లో మాత్రం మహిళలు చాలా తక్కువ సంఖ్యలో కనిపించారు. విద్యార్థులు మాత్రం బస్సులు లేక అవస్థలు పడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని