logo

చిన ఓగిరాలలో కంటైనర్ల కలకలం

ఉయ్యూరు మండలం చిన ఓగిరాలలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచŸర్‌లో నిలిపి ఉన్న కంటైనర్లు కలకలం రేపాయి.

Published : 15 Apr 2024 04:12 IST

ఓ వెంచర్‌లో నిలిపి ఉంచిన వాహనాలు

ఉయ్యూరు, న్యూస్‌టుడే: ఉయ్యూరు మండలం చిన ఓగిరాలలో ఓ రియల్‌ ఎస్టేట్‌ వెంచŸర్‌లో నిలిపి ఉన్న కంటైనర్లు కలకలం రేపాయి. ఎన్నికల వేళ వీటిలో భారీగా సొమ్ము, మద్యం ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం కావడంతో సమాచారం అందుకున్న పెనమలూరు నియోజకవర్గం ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం ఆదివారం మధ్యాహ్నం అక్కడకు హుటాహుటిన వెళ్లి నిశితంగా పరిశీలించింది. అక్కడున్న వాహనాల తాలుకా సిబ్బందిని బృందం అధికారి ఉదయ్‌భాస్కర్‌ ప్రశ్నించారు. పామర్రు మండలం కురుమద్దాలి సమీపంలోని తమ రొయ్యల కంపెనీ వద్ద పార్కింగ్‌ స్థలం లేనందున ఇక్కడ వాహనాలను ఉంచడం జరిగిందని వారు బదులిచ్చారు. దాదాపు 15కు పైగా ఉన్న వాహనాల తాళాలు తీయించి పరిశీలించారు. అన్నీ ఖాళీగానే ఉన్నాయని, ఎందులోనూ ఎలాంటి మద్యం, సొమ్ము లేదని ఉయ్యూరు ఆర్డీవో, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి డి.రాజు తెలిపారు.

కంటైనర్లను పరిశీలిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని